logo

ఆర్టీపీపీ ఏడీఈ ఆత్మహత్య

ఆర్టీపీపీ ఏడీఈ హుసేన్‌సాహెబ్‌(52) అనే వ్యక్తి మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుకున్నది. 

Published : 22 Mar 2023 01:36 IST

ఎర్రగుంట్ల(ఆర్టీపీపీ), న్యూస్‌టుడే: ఆర్టీపీపీ ఏడీఈ హుసేన్‌సాహెబ్‌(52) అనే వ్యక్తి మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుకున్నది.  ఏడీఈ హుసేన్‌ సాహేబ్‌, నీరజ దంపతులు ఆర్టీపీపీలోని వి.విరెడ్డి నగర్‌ ఈ టైపులో క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. వారికి ఒక కుమార్తె, కుమారుడు సంతానం ఉన్నారు. ఇటీవల హుసేన్‌ సాహేబ్‌ ఏఈఈ నుంచి ఏడీఈకి పదోన్నతి పొందారు. అనారోగ్య సమస్యల వల్ల ఇంటిలో ఎవ్వరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు వివరించారు. ఈ విషయంపై కలమల్ల ఎస్‌.ఐ శివప్రసాద్‌ను వివరణ కోరగా ఏడీఈ హుసేన్‌ సాహేబ్‌ ఉరివేసుకున్న విషయంపై ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని