logo

‘విస్తరణ పేరుతో పేదల కడుపు కొట్టొద్దు’

రోడ్ల విస్తరణ పేరుతో పేదల కడుపు కొట్టే ప్రయత్నాలు మానుకోవాలని సీపీఎం నగర కార్యదర్శి రామ్మోహన్‌, జిల్లా కమిటీ సభ్యుడు దస్తగిరిరెడ్డి అన్నారు.

Published : 22 Mar 2023 01:57 IST

నిరసన తెలుపుతున్న బాధితులు, సీపీఎం నాయకులు

మారుతీనగర్‌ (కడప), న్యూస్‌టుడే : రోడ్ల విస్తరణ పేరుతో పేదల కడుపు కొట్టే ప్రయత్నాలు మానుకోవాలని సీపీఎం నగర కార్యదర్శి రామ్మోహన్‌, జిల్లా కమిటీ సభ్యుడు దస్తగిరిరెడ్డి అన్నారు. కడప నగరంలో కెనాల్‌ కట్ట పక్కన నివాసం ఉన్నవారితో కలిసి మంగళవారం నగరపాలక కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. గత 20 ఏళ్లుగా నివాసం ఉంటున్న ప్రజలను ఉన్నఫలంగా ఖాళీ చేయాలనడం సమంజసం కాదన్నారు. ఆ ప్రాంతంలో నివాసం ఉన్నవారంతా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారని, రోడ్ల విస్తరణ పేరుతో వారి కడుపులు కొట్టడం సరికాదన్నారు. ప్రత్యామ్నాయం చూపిన తర్వాత ఇళ్లు కూల్చాలని డిమాండు చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఫారుక్‌హుసేన్‌, షాకీర్‌, గౌస్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని