వాళ్లొద్దు... వెంటనే మారుద్దాం!
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని అధికార వైకాపా జీర్ణించుకోలేకపోతోంది. గృహ సారథుల ద్వారా సరైన ఫలితాలు రాలేదని గ్రహించింది.
సగం మంది గృహ సారథులకు మంగళం
వాలంటీర్ల కుటుంబ సభ్యులకే అవకాశం
వైకాపా అధిష్ఠానం నుంచి ఆదేశాల జారీ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితోనే నిర్ణయం
నేటి నుంచి క్షేత్రస్థాయిలో ప్రక్రియ ఆరంభం
-ఈనాడు డిజిటల్, కడప
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని అధికార వైకాపా జీర్ణించుకోలేకపోతోంది. గృహ సారథుల ద్వారా సరైన ఫలితాలు రాలేదని గ్రహించింది. వీరిలో సగం మందికి మంగళం పలకాలని నిర్ణయించుకుంది. వెంటనే మార్పునకు శ్రీకారం చుట్టాలని భావించింది. ఈ మేరకు గురువారం నుంచి క్షేత్రస్థాయిలో ప్రక్రియ ప్రారంభం కానుంది.
గృహ సారథుల విషయమై సచివాలయ వాలంటీర్లకు అందిన సందేశం
సచివాలయ కన్వీనర్లు, గృహ సారథుల నియామకôతో క్షేత్రస్థాయిలో రాష్ట్రంలో 5.65 లక్షల మందితో వైకాపా సైన్యం అందుబాటులోకి వచ్చింది. వీరితో పార్టీ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలి. వీరి ద్వారా ఏడాదిలో జరిగే శాసనసభ ఎన్నికల్లో రాజకీయాన్ని మలుపు తిప్పేయాలని వైకాపా భావించింది. ఈ ప్రయోగం ద్వారా ఆశించిన ఫలితాలు రాలేదని ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రహించింది. 2019లో అధికార పగ్గాలు చేపట్టాక వాలంటీర్ల వ్యవస్థను వైకాపా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కొక్కరికి 50 ఇళ్ల బాధ్యతలు అప్పగించింది. నెలకు రూ.5 వేలు గౌరవ వేతనం, చరవాణుల బిల్లులు, పురస్కారాలు, సత్కారాలు తదితర వాటికి కలిపి ఏడాదికి రూ.వేల కోట్లు వెచ్చిస్తోంది. వీరికి ప్రత్యామ్నాయంగా గృహ సారథులు, సచివాలయ కన్వీనర్ల పేరుతో మరో కొత్త సైన్యాన్ని సృష్టించింది. వీరిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం, సామాజిక పింఛన్లు వీరి ద్వారా ఇప్పించడం ద్వారా ప్రజలకు పరిచయం చేసింది. వాలంటీర్ల ద్వారా అనుకున్న లక్ష్యాన్ని చేరలేదని.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లక్ష్యం నెరవేరని పరిస్థితుల్లో గృహసారథులను మోహరించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేయి కాల్చుకున్నట్లు గ్రహించింది.
సగం మందికి ఉద్వాసన
గృహ సారథులు సగం మందికి ఉద్వాసన పలకాలని వైకాపా అధిష్ఠానం నేతలను ఆదేశించింది. వారి స్థానంలో వాలంటీర్ల కుటుంబ సభ్యుల్లో ఒకరికి స్థానం ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు మార్పులు చేసి జాబితాలను రూపొందించి పంపాలని స్పష్టం చేసింది. దీంతో వార్డులు/ గ్రామాల వారీగా గురువారం నుంచి సమావేశాలు నిర్వహించి గృహ సారథులను ఎంపిక చేయాలని పురమాయించింది. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు సారథులను గతంలో వైకాపా నియమించింది. వీరికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచార, పంపిణీ బాధ్యతలు అప్పగించింది. చాలా చోట్ల వాలంటీర్లకు.. గృహ సారథులకు పొసగని పరిస్థితులేర్పడ్డాయి. ఆధిపత్య పోరు తలెత్తింది. సమన్వయం లేకపోవడం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి కారణంగా గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాలంటీర్లను ఎన్నికల సంఘం దూరంగా పెట్టింది. రానున్న సాధారణ ఎన్నికల్లో దూరంగా పెట్టే అవకాశాలున్నాయి. వాలంటీర్ల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలుండవనే అంచనాకు వచ్చింది. సమన్వయ లోపాన్ని అధిగమించడంతోపాటు వాలంటీర్ల కుటుంబసభ్యులకు బాధ్యతలు అప్పగించే పక్షంలో ప్రభావితం చేయెచ్చనే అభిప్రాయానికి వచ్చింది. ఇకపై ప్రతి ఇద్దరిలో వార్డు/ గ్రామ వాలంటీరు జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుడు ఒకరు ఉండేవిధంగా గృహ సారథులను ఎంపిక చేయనున్నారు. మార్పునకు రాజకీయపరంగా ప్రతిబంధకం అయినట్లయితే మూడో వ్యక్తిగా వాలంటీరు కుటుంబ సభ్యుడిని నియమించాలని ఆదేశించింది. తాజా నిర్ణయంపై ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే గృహసారథుల నియామకంతో అక్కడక్కడ తలవంపులు వచ్చాయి.. ప్రస్తుతం మళ్లీ మార్పులు... చేర్పులతో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు మరింత జఠిలమయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. తొలగించిన గృహసారథులు పార్టీ మారే అవకాశాలున్నాయని, ఏం చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉందంటూ నిట్టూరుస్తున్నారు. ఇదిలా ఉండగా ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ(ఎఫ్ఓఏ) పేరుతో వాలంటీర్లకు బుధవారం చరవాణి సందేశాలు అందాయి. ప్రతి సచివాలయ పరిధిలో సమావేశాలు నిర్వహించడం.. గృహ సారథుల నియామకాలు కొత్తగా చేపట్టాలని.. వాలంటీర్ కుటుంబసభ్యులు తప్పనిసరిగా ఉండాలని కోరుతూ సందేశాలు చేరాయి. కొత్తగా ఎంపిక చేసిన వారి పేరు, ఫోన్ నంబరు, వయసు తదితర వివరాలు సేకరించి పంపాలని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాయంచపై రాములోరి రాజసం
[ 19-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు గురువారం రాత్రి రాయంచపై రాములోరి విహారం కనులపండువగా సాగింది. -
మొదలైన నామినేషన్ల సందడి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ గురువారం మొదలైంది. కలెక్టర్ విజయ రామరాజు ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం కలెక్టరేట్లోని తన ఛాంబరులో నామపత్రాల స్వీకరణను ఆయన ప్రారంభించారు. -
జగన్ను నమ్మాం... నిండా మునిగాం!
[ 19-04-2024]
‘నేను ఉన్నానన్నావ్... నేను విన్నానన్నావ్... నిజమే అనుకున్నాం... నీ మాటలు విని మా బాధలు తెలుసుకుంటావని, పరిష్కారం చూపుతావని ఎంతో ఆశతో నిన్ను గెలిపించాం... తీరా చూస్తే నువ్వు ఉన్నావు... కానీ వినే ఓపికే లేకుండా పోయింది. -
షర్మిలకు మద్దతుగా పులివెందులలో సునీత ప్రచారం
[ 19-04-2024]
కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల తరఫున మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత దంపతులు గురువారం నుంచి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. -
బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మరథం
[ 19-04-2024]
బ్రహ్మాండ నాయకుడైన శ్రీరాముడి రథోత్సవం గురువారం వాల్మీకి క్షేత్రంలో వైభవంగా జరిగింది. ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
మరో వైకాపా ఫ్యానుపై వేటు
[ 19-04-2024]
వృత్తి ఉద్యోగమైనా... నిబంధనలు ఉల్లంఘించి అత్యుత్సాహంతో ముఖ్యమంత్రి జగన్కు ఊడిగం చేసే వారికి తగిన శాస్తి జరుగుతుందనడానికి నిదర్శనమే... ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై వేటు. -
పెద్దిరెడ్డి కుటుంబ దోపిడీని ఓటుతో అడ్డుకోండి
[ 19-04-2024]
రాజంపేట పార్లమెంట్ పరిధిలో పెద్దిరెడ్డి దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ముఖ్యమంత్రి, భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. -
జగన్ బాటలో బస్సులు.. జనానికి ‘ముప్పు’తిప్పలు!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో పల్లెలకు బస్సులు దూరమయ్యాయి... కొత్త బస్సులు రాకపోగా, ఉన్న బస్సులు మరమ్మతులకు గురయ్యాయి... పల్లె బస్సులు రద్దయ్యాయి. అవీ ఎప్పుడొస్తాయో తెలియదు. -
బ్రహ్మోత్సవ శోభ... ఆధ్యాత్మిక ప్రభ
[ 19-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రామయ్య క్షేత్రంలో రెండో రోజు గురువారం ఉదయం యాగశాలలో తితిదే ఆగమ సలహాదారు కల్యాణపురం రాజేష్ భట్టార్ ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు. -
జగనన్న చెప్పాడంటే చెయ్యడంతే
[ 19-04-2024]
మైకు పట్టుకుని రాజకీయ నాయకులేం చెబుతారో ఎన్నికల తర్వాత ఆ పని చేయకపోతే రాజీనామా చేసిపోయే పరిస్థితి రావాలన్నావు. నీ మాటలు నమ్మి ప్రశ్నిస్తే.. కేసులు పెట్టిస్తున్నావ్.. నీ అనునాయులతో ఉరికించి ఉరికించి కొట్టిస్తున్నావ్.. చెప్పిన మాటకు కట్టుబడక పోతే ఎలాగన్నా. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి
[ 19-04-2024]
కేంద్రం, రాష్ట్రంలో తమ ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే చేనేత కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తామని కడప ఎంపీ తెదేపా అభ్యర్థి భూపేష్రెడ్డి, జమ్మలమడుగు అసెంబ్లీ భాజపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డి హామీ ఇచ్చారు. -
జిల్లాకు చేరుకున్న కేంద్ర ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై పర్యవేక్షణకు కేంద్ర ఎన్నికల పరిశీలకులు గురువారం జిల్లాకు చేరుకున్నారు. తొలుత కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, ఎస్పీ కృష్ణారావు, ఇతర జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. -
రాజంపేట వైకాపాలో ముసలం
[ 19-04-2024]
రాజంపేట వైకాపాలో ముసలం పుట్టింది. నియోజకవర్గానికి చెందిన వైకాపా నాయకులు, కార్యకర్తలు ఇటీవల తెదేపాలో చేరారు. ఈ క్రమంలో హైదరాబాద్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో బుధవారం జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు, తెదేపా నాయకుడు పోలి సుబ్బారెడ్డి, సుగవాసి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో నందలూరు, రాజంపేట మండలాలకు చెందిన వైకాపా నేతలు పార్టీలో చేరారు.