ప్రైవేటీకరణ వైపు... సర్కారు చూపు!
పర్యాటకులను ఆకర్షించే కొత్త ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాల్లో కొన్ని ప్రైవేటు సంస్థలకు కొత్త అభివృద్ధి పనులను ఒప్పంద విధానంలో అప్పగించడానికి కసరత్తు చేస్తోంది
హార్సిలీహిల్స్లో నిర్మాణాలు కలేనా?
అందని నిధులతో ముందుకు సాగని ప్రగతి
- న్యూస్టుడే, బి.కొత్తకోట
పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్
పర్యాటకులను ఆకర్షించే కొత్త ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాల్లో కొన్ని ప్రైవేటు సంస్థలకు కొత్త అభివృద్ధి పనులను ఒప్పంద విధానంలో అప్పగించడానికి కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో బి.కొత్తకోట మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్లో రిసార్టుల నిర్మాణాన్ని పర్యాటకశాఖ చేపట్టే అవకాశాలు సన్నగిల్లిపోతున్నాయి. హరిత హిల్ రిసార్టు పేరిట రూ.6.50 కోట్ల అంచనాలతో కొత్త ప్రాజెక్టు కోసం పర్యాటకశాఖ అధికారులు అయిదేళ్ల కిందట ప్రతిపాదనలు పంపారు. ఇందుకోసం హార్సిలీహిల్స్లోని పర్యావరణ అధ్యయన కేంద్రం వెనుక మూడెకరాలను రెవెన్యూశాఖ పర్యాటకశాఖకు అప్పగించింది. రాతిబండలతో నిండిన ఈ ప్రదేశంలో రిసార్టులను నిర్మించడానికి అనువుగా ఉంటుందని అధికారులు గుర్తించారు.
కొండకు మహర్దశ
సముద్ర మట్టానికి 4,312 అడుగుల ఎత్తులో ఉన్న హార్సిలీహిల్స్ ప్రకృతి రమణీయతకు... ఆహ్లాదకర వాతావరణానికి మారుపేరుగా నిలుస్తోంది. వేసవి గ్రీష్మతాపంతో తల్లడిల్లుతున్న జనం సేదతీరడానికి అనువైన హిల్ స్టేషన్గా భావిస్తున్నారు. ఆంధ్రా ఊటీగా ప్రత్యేక గుర్తింపు ఉన్న ఈ కొండకు వస్తున్న పర్యాటకులు ఏటికేడాది పెరుగుతున్నారు. పర్యాటక, అటవీ, పోలీసుశాఖలతో పాటు ప్రైవేటు అతిథి గృహాలున్నాయి. పర్యాటకశాఖకు చెందిన గవర్నరు బంగ్లాతో పాటు అతిథి గృహాలు, టెంట్ హౌస్, కాటేజీల్లో 52 గదులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి వేసవిలో కొండపై ఉన్న గదులు పర్యాటకులకు సరి పోవడం లేదు. ఎండా కాలంలో కొండపై బస చేసేందుకు వచ్చి గదుల్లేక వెనుదిరిగి వెళ్లిపోతున్న పర్యాటకుల సంఖ్య భారీగానే ఉంటోంది. దీన్ని గుర్తించిన పర్యాటకశాఖ ఆధునాతన వసతులతో రిసార్టులను నిర్మించాలని, రానున్న 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉండేవిధంగా ప్రణాళికను సిద్ధం చేసింది. రిసార్టుల నిర్మాణంతో కొండకు మహర్ధశ వస్తుందని, పర్యాటకశాఖ రాబడి భారీగా పెరుగుతుందని ఆశించారు. అయితే ఈలోగా ఒబెరాయ్ సంస్థకు అయిదు నక్షత్రాల హోటల్ నిర్మాణానికి కొండపై 15 ఎకరాల భూమిని కేటాయించింది. వచ్చే ఏడాది రూ.250 కోట్లతో హోటల్ నిర్మాణపనులను ప్రారంభించ డానికి ఒబెరాయ్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ భారీ ప్రాజెక్టుకు మంత్రి మండలి ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. ఈ పరిస్థితుల్లో పర్యాటకశాఖ సొంతంగా రిసార్టుల నిర్మాణాన్ని చేపట్టే అవకాశాలు మృగ్య మవుతున్నాయి. కాగా మరోవైపు ప్రస్తుతం కొండపై ఉన్న కాటేజీలకు మరమ్మతులు చేయించడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. ఇప్పుడున్న అతిథి గృహాలు, హరిత హోటళ్లను ప్రైవేటుకు ధీటుగా ఆధునికరించడానికి నిధుల కొరత అవరోధంగా మారింది.
వసతుల కల్పనకు ప్రాధాన్యం
హార్సిలీహిల్స్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అయిదు నక్షత్రాల హోటల్ రూపుదిద్దుకోబోతోంది. పర్యాటకులకు అత్యాధునిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. ఇలాంటి సమయంలో గత ప్రతిపాదనల మేరకు రిసార్టులు నిర్మించినా పర్యాటకులు రావడం కష్టమేనని భావిస్తున్నాం. రిసార్టుల నిర్మాణం కోసం సేకరించిన భూమిని ప్రైవేటు సంస్థకు అప్పగించే ఆలోచనలో ఉన్నాం. కొండపైకి వస్తున్న పర్యాటకులకు వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నాం.
నాగభూషణం, జిల్లా పర్యాటకశాఖ అధికారి (డీటీవో)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుగుబాటు మొదలైంది.. జగన్ ఇంటికి పోవడం ఖాయం: చంద్రబాబు
[ 25-04-2024]
రాయలసీమలో తిరుగుబాటు మొదలైందని.. జగన్ ఇంటికి పోవడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
వైకాపాని పాతాళానికి తొక్కేద్దాం.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం: పవన్
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దాం.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
[ 25-04-2024]
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
[ 25-04-2024]
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
[ 25-04-2024]
సీఎం జగన్ వైకాపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు గురువారం పులివెందుల రానున్నారు. -
మీ బిడ్డనని గారాలు... నీ గడ్డపైనే ఘోరాలు!
[ 25-04-2024]
రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా నరేగా నుంచి రూ.26.02 కోట్లతో 349 మట్టి పనులను వైకాపా నేతలకు పంచిపెట్టారు. -
ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం
[ 25-04-2024]
మాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు -
నేడు రాజంపేట, రైల్వేకోడూరులో ప్రజాగళం
[ 25-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరు పర్యటనకు రానున్నారు -
అక్రమాలకు పాల్పడకుండా గెలిచే సత్తా మీకుందా?
[ 25-04-2024]
అక్రమాలకు పాల్పడకుండా పులివెందులలో గెలిచే సత్తా మీకుందా? అని తెదేపా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి సీఎం జగన్కు సవాల్ విసిరారు -
నీళ్లు గరళం... పారిశుద్ధ్యం అధ్వానం
[ 25-04-2024]
నియోజకవర్గ కేంద్రాలు ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు పట్టణ ప్రాంతాల్లోని కాలనీల ప్రజలు కనీస వసతులకు నోచుకోలేక తల్లడిల్లుతున్నారు -
జగన్ పాలనలో పర్యాటకాభివృద్ధి శూన్యం
[ 25-04-2024]
పర్యాటకుల నుంచి ఛార్జీలు, పన్నులు తదితరాల పేరుతో ఆదాయం వస్తున్నా ఆ రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. -
జగనన్న హామీలు...నీటి మూటలు
[ 25-04-2024]
ఆరునూరైనా అభివృద్ధి చేసి తీరుతాం.. మైదుకూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామంటూ జగన్ ప్రభుత్వంలో పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్