logo

భార్య తీరుపై మనస్తాపంతో భర్త బలవన్మరణం

భార్య ప్రవర్తనపై అనుమానం, ఆమె తీరుపై మనస్తాపం చెందిన భర్త ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం ములకలచెరువులో చోటు చేసుకుంది.

Published : 27 Mar 2023 05:53 IST

అక్బర్‌బాషా (పాతచిత్రం)

ములకలచెరువు గ్రామీణ, న్యూస్‌టుడే : భార్య ప్రవర్తనపై అనుమానం, ఆమె తీరుపై మనస్తాపం చెందిన భర్త ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం ములకలచెరువులో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు... ఉమాశంకర్‌ కాలనీకి చెందిన ఎస్‌.అక్బర్‌బాషా (36) వివాహం అయి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అక్బర్‌బాషా స్థానికంగా ఓ బేకరిలో పనిచేస్తున్నాడు. వీరింట¨కి సమీపంలోనే ఉన్న వినోద్‌కుమార్‌ కొంతకాలంగా అక్బర్‌ బాషా భార్యతో చనువుగా ఉంటున్నాడు. ఈ నెల 23న వినోద్‌కుమార్‌తో తన భార్య సన్నిహితంగా మెలుగుతుండడం చూసిన అక్బర్‌బాషా ఇది పద్ధతి కాదని భార్యను మందలించాడు. విషయం తెలుసుకున్న వినోద్‌కుమార్‌ అక్బర్‌బాషాతో గొడవపడ్డాడు. నీ భార్యతో మాట్లాడుతూనే ఉంటానంటూ బహిరంగంగానే చెప్పడంతో చుట్టుపక్కల వారంతా మందలించి పంపేశారు. అవమానాన్ని తట్టుకొలేక మనస్తాపంతో అక్బర్‌బాషా తన చావుకు వినోద్‌కుమారే కారణం అంటూ సామాజిక మాధ్యమాల్లో విడియో పెట¨్ట ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఎస్‌.బాషా ఫిర్యాదు మేరకు వు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌.ఐ. డీవై స్వామి చుట్టు పక్కల వారిని విచారించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని