కలుపు ఏరివేత... కాలువల్లో శుభ్రత
నేటి తరం విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే చదువుతో పాటు సృజనాత్మకతకు పదును పెడుతూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. పీలేరు మండలానికి చెందిన ఓ విద్యార్థి రైతులకు ఉపయుక్తమైన వీడ్ డ్రీ మూవర్ (కలుపు ఏరివేత పరికరం) ఆవిష్కరించి రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
న్యూస్టుడే, పీలేరు గ్రామీణ, కడప విద్య
తయారు చేసిన పరికరంతో విద్యార్థి కార్తిక్, గైడ్ టీచర్ ఉషారాణి
నేటి తరం విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే చదువుతో పాటు సృజనాత్మకతకు పదును పెడుతూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. పీలేరు మండలానికి చెందిన ఓ విద్యార్థి రైతులకు ఉపయుక్తమైన వీడ్ డ్రీ మూవర్ (కలుపు ఏరివేత పరికరం) ఆవిష్కరించి రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
పీలేరు మండలం రాయలవారిపల్లెకు చెందిన రూప, మోహన్ దంపతుల కుమారుడు చీకటిపల్లె కార్తిక్ పట్టణంలోని కాకతీయ విద్యా సంస్థల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వీరిది వ్యవసాయ కుటుంబం కావడంతో సాగు చేస్తున్న పంటకు కలుపు తీసే పనులు తలకు మించిన భారం అవుతోంది. ఇది గ్రహించిన ఈ విద్యార్థి తన ఆలోచనకు పదును పెట్టి పాఠశాల బయాలజీ ఉపాధ్యాయురాలు ఉషారాణి, బాబా ఫకృద్దీన్ మార్గదర్శకత్వంలో వ్యవసాయ పంటల్లో రైతుకు గుదిబండగా మారుతున్న కలుపు ఏరివేతకు ఉపయోగపడే విధంగా పరికరాన్ని రూపొందించాడు. ఆన్లైన్ ద్వారా ఈ నెల 23న కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక సదస్సులో దీన్ని ప్రదర్శించారు. అక్కడ న్యాయ నిర్ణేతల మన్ననలు పొంది జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైంది.
తక్కువ ఖర్చుతో తయారు : ఈ పరికరం సాధారణ రైతు తక్కువ ఖర్చుతో తయారు చేసుకునేలా రూపొందించారు. ఒక ఇనుప పైపును తీసుకుని, చిన్నపిల్లల సైకిల్కు వాడే ప్లాస్టిక్ చక్రాలకు అమర్చి ఒక నీళ్ల డబ్బా పట్టే విధంగా పెట్టను తయారు చేసుకోవాలి. అక్కడ ఏర్పాటు చేసే డబ్బాకు ఒక స్ప్రే పరికరాన్ని ఏర్పాటు చేయాలి. ఈ భాగం పని చేయడానికి చేతితో ఉపయోగించి స్ప్రే పని చేసే విధంగా రెండు బ్రేకు వైర్లు ఏర్పాటు చేయాలి. పంట పొలాల సాళ్ల మధ్యలో వెళ్లే విధంగా రెండు ఇనుప మడకలను అమర్చాలి. ఈ పరికరం వరిమడికి తప్ప మిగతా అన్ని రకాల పంటలకు సంబంధించి కలుపు ఏరివేతతో పాటు పురుగు మందు పిచికారీ చేసే అవకాశం ఉంటుంది. ఆరుతడి పంటలకే ఇది పరిమితం. దీనికి ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ డబ్బాలో కలుపును నియంత్రించే మందుల ద్రావకాన్ని నింపుకోవాలి. పంట సాళ్ల వెంబడి మడకల ద్వారా దున్నుకుంటూ వెళ్లాలి. తద్వారా అక్కడ ఉన్న కలుపును పెకిలిస్తుంది. మొక్కల మధ్యలో ఉన్న కలుపు మొక్కలు చనిపోయే విధంగా దీనికి ఏర్పాటు చేసిన పిచికారీ యంత్రం ద్వారా నివారణ మందును పిచికారీ చేసే వెసులుబాటు ఉంది.
రైతులకు ఉపయోగపడేలా తయారీ - కార్తిక్, విద్యార్థి
అనుకోకుండా వచ్చిన ఆలోచనతో కాకతీయ విద్యా సంస్థల కరస్పాండెంట్ వెంకట్రమణరెడ్డి ప్రోత్సాహంతో ఈ పరికరాన్ని ఆవిష్కరించాను. జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపిక కావాలని కోరుకుంటున్నా. ప్రపంచ దేశాల్లో ఉన్న రైతులందరికీ ఈ పరికరం ఉపయోగపడుతుంది. అందరికీ అందుబాటులోకి వస్తే ఎంతో మేలు జరుగుతుంది.
తయారు చేసిన మ్యాన్హోల్ శుభ్రపరిచే పరికరంతో విద్యార్థి మహమ్మద్ సిరాజ్
ములకలచెరువు గ్రామీణ: తంబళ్లపల్లె మండలం, కన్యమడుగు జడ్పీ హైస్కూల్కు చెందిన పదో తరగతి విద్యార్థి మహమ్మద్ సిరాజ్ వినూత్నంగా ఆలోచించి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. గైడ్ ట©చర్ రమణమ్మ సహకారంతో విద్యార్థి తయారు చేసిన మ్యాన్హోల్ శుభ్రపరిచే పరికరం జాతీయ స్థాయికి ఎంపికైంది. దిల్లీలో జరుగే వైజ్ఞానిక సదస్సులో తన ప్రయోగాన్ని ప్రదర్శించనున్నారు. మారుమూల పాఠశాలకు చెందిన విద్యార్థి ఎంపిక కావడంతో సర్పంచి శ్యామలమ్మ, ఎంపీటీసీ సభ్యుడు మహేష్, స్కూల్ కమిటీ ఛైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు.
చేనేతల శ్రమ తగ్గేలా!
ఇన్స్పైర్మనాక్ ప్రదర్శనలో కడప నగరం చెమ్ముమియాపేట జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని షేక్ ఫైజాసుల్తానా రూపొందించిన ఫెడల్ ఫ్రీ హ్యాండ్లూమ్ ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికైంది. ‘నేత పని వారు ఉపయోగిస్తున్న మగ్గంలో మార్పులు చేయడం. వారికి శారీరక శ్రమ తగ్గించడం. వికలాంగులు సైతం ఈ పరికరంతో సులభంగా నేత నేయడం. మగ్గం ఉపయోగించేటప్పుడు రెండు కాళ్లను, రెండు చేతులను పనిలో వినియోగిస్తారు. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ లేకుండా పరికరాన్ని తయారుచేశాం. నాలుగు అవయవాలు చేసే పనిని ఒక్క చేతితో సులభంగా చేసేలా ఏర్పాటు చేశాం’ అని విద్యార్థిని ఫైజా సుల్తానా తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
[ 20-04-2024]
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
జనంపై జగనాసురుడి దండయాత్ర!
[ 20-04-2024]
జగన్ అయిదేళ్ల పాలనలో ఊరికో అసురుడు తయారయ్యాడు... కనిపించిన భూములన్నింటికీ కబ్జా చేశారు... సహజ వనరులను ఇష్టారీతిన కొల్లగొట్టారు... తమ ఆగడాలపై ప్రశ్నించినవారిపై దాడులకు తెగబడ్డారు... హత్యలకు సైతం వెనకాడలేదు. -
హామీలకు మంగళం... ఖాకీలకు ద్రోహం!
[ 20-04-2024]
జిల్లా వ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు సబ్ డివిజన్లు ఉన్నాయి. -
నేడు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నామినేషన్
[ 20-04-2024]
పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈమె ఉదయం 8 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి కడప నగరం ఐటీఐ సర్కిల్కు 9.15 గంటలకు చేరుకుని ర్యాలీ ప్రారంభిస్తారు. -
తెదేపా రాజంపేట నియోజకవర్గ పరిశీలకుడిగా దుర్గాప్రసాద్
[ 20-04-2024]
రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంపై తెదేపా అధిష్ఠానం ప్రత్యేక దృష్టిసారించింది. కడపకు చెందిన కీలక నేత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుధా దుర్గాప్రసాద్ను పరిశీలకుడిగా నియమించింది. -
ఏం చేశావ్ మేలు... కౌలు రైతు కుదేలు..!
[ 20-04-2024]
జిల్లాలో 4,88,672 మంది రైతులుండగా, పంటలు సాగు చేసే నికర భూమి 2,70,985 హెక్టార్లు ఉంది. సొంత పొలం లేని 50 వేల మందికి పైగా కౌలురైతులు సొంతూర్లు, ఇతర ప్రాంతాల్లో మిగతా సాగు దారులకు చెందిన భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. -
సింహ వాహనంపై సీతాపతి
[ 20-04-2024]
ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు శుక్రవారం రాత్రి సింహ వాహనంపై సీతాపతి ఊరేగారు. -
అశ్వవాహనంపై శ్రీరాముడు
[ 20-04-2024]
వాల్మీకిపురంలో తితిదే ఆధ్వర్యంలోని పట్టాభిరాముడి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అశ్వవాహనంపై శ్రీరాముడు అధిరోహించి తిరుమాడవీధుల్లో ఊరేగారు. -
మామయ్యనంటూ ఊదరగొట్టేశావ్.. చిన్నారుల భద్రతను గాలికొదిలేశావ్..!
[ 20-04-2024]
జగన్ మామయ్య మాయమాటలకు చిన్నారులూ మోసపోయారు. పిల్లలకు మేనమామనని ఊదరగొట్టి వారి భద్రతను పూర్తిగా గాలికొదిలేశారు. -
అరాచక పాలన పోవాలంటే తెదేపా రావాలి
[ 20-04-2024]
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన పోవాలంటే తెదేపా అధికారంలోకి రావాలని ప్రొద్దుటూరు శాసనసభ తెదేపా అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. -
చిన్నారులతో రాజకీయ ప్రచారం?
[ 20-04-2024]
అధికార పార్టీ ఉల్లంఘనలకు కాదేదీ అనర్హం అన్నట్లు ప్రచారంలోనూ నాయకులు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. చిన్నారుల చేతికి జెండాలిచ్చి ప్రచారం చేయించుకుంటున్నారు. -
వేడుకగా ఊంజల్ సేవ
[ 20-04-2024]
రామయ్య క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం కల్యాణ మండపంలో ఊంజల్ సేవ నిర్వహించారు. -
పాలకుల నిర్లక్ష్యం... ప్రజలకు శాపం
[ 20-04-2024]
పురపాలక హోదా కల్గి పద్దెనిమిదేళ్లు కావస్తున్నా ఇంకా బద్వేలులో పలువార్డులు కనీస సౌకర్యాలకు నోచుకోలేదు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
తెదేపాలో చేరిన పగిడాల దస్తగిరి
[ 20-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. -
ప్రభుత్వ స్థలం... రాచమల్లు పరం
[ 20-04-2024]
వైకాపా ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు, స్థానిక సంస్థల భూములను అధికార పార్టీ నేతలు తమ ఆధీనంలో పెట్టేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, వారి అనుయాయులు, పార్టీ నేతలు, ఓ మోస్తరు నాయకులు, కార్యకర్తలు సైతం మున్సిపల్ స్థలాలపై కన్నేసి వాటిని తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు. -
నిందితుల అరెస్టు
[ 20-04-2024]
బాలఓబిగారి వీధిలో ఈ నెల 17న రాత్రి ఓ మహిళ విషయంలో యువకుల మధ్య జరిగిన ఘర్షణ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఒకటో పట్టణ ఠాణా సీఐ శ్రీకాంత్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి