logo

‘ప్రతి ఇల్లు చంద్రబాబును కోరుకుంటోంది’

రాష్ట్రంలో సైకో పాలన పోవాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఇల్లు కోరుకుంటోందని తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ బాధ్యుడు అమీర్‌బాబు అన్నారు.

Published : 27 Mar 2023 06:05 IST

కడపలో ప్రదర్శనగా వస్తున్న తెదేపా నాయకులు, కార్యకర్తలు

అరవిందనగర్‌ (కడప), న్యూస్‌టుడే : రాష్ట్రంలో సైకో పాలన పోవాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఇల్లు కోరుకుంటోందని తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ బాధ్యుడు అమీర్‌బాబు అన్నారు. ఆదివారం కడప నగరంలోని 47వ డివిజన్‌లో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. స్థానికులకు కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దోపిడీని వివరించారు. అమీర్‌బాబు మాట్లాడుతూ  ప్రజల నుంచి తెలుగుదేశం పార్టీకి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. అరాచక ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుందా అని ప్రజలు అడుగుతున్నారన్నారు. సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి వచ్చినప్పటి నుంచి కరెంటు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారని, పన్నులు పెంచి సామాన్యులపై భారం మోపారన్నారు. కార్యక్రమంలో మైనార్టీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిలానీబాషా, నాయకులు రవిశంకర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, రామాంజనేయులరెడ్డి, సునీత, పార్వతి, కళావతి, శివశంకర్‌రెడ్డి, బండి జయశేఖర్‌, వెంకటేశ్‌, కొండా సుబ్బయ్య, శ్రీనివాసులు, రాఘవ, సుధాకర్‌యాదవ్‌, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని