వీపీసీకి వివాదాల మసి
పశువైద్యంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న బహుళార్ధ పశువైద్యశాల నేడు వివాదాలకు కేంద్రబిందువైంది. ఉమ్మడి కడప జిల్లాలోని పశువుల ఆసుపత్రుల్లో వైద్యం అందించలేని జీవాలను వాటిని ఇక్కడకు పంపితే బాగుచేసి పంపేవారు.
గతేది ఆగస్టు నుంచి గొడవలు మొదలు
పరిష్కారం చూపడంలో అధికారుల చర్యలు నామమాత్రం
- న్యూస్టుడే, కడప గ్రామీణ, కడప నేరవార్తలు
కడప నగరంలోని వీపీసీ భవనం
పశువైద్యంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న బహుళార్ధ పశువైద్యశాల నేడు వివాదాలకు కేంద్రబిందువైంది. ఉమ్మడి కడప జిల్లాలోని పశువుల ఆసుపత్రుల్లో వైద్యం అందించలేని జీవాలను వాటిని ఇక్కడకు పంపితే బాగుచేసి పంపేవారు. అలాంటి చరిత్ర ఉన్న ఆసుపత్రి గతేడాది ఆగస్టు నుంచి వివాదాలకు కేంద్రం కావడం ప్రస్థావనార్హం. వీపీసీ డీడీగా అచ్చెన్న 2021 జూన్ 25న బాధ్యతలు చేపట్టారు. ఏడీలుగా సుధీర్నాథ్బెనర్జీ, శ్రీధర్లింగారెడ్డి, పశువైద్యులు సుభాష్చంద్రబోస్, సిబ్బంది, అటెండర్లు పనిచేస్తున్నారు. డీడీ అచ్చెన్న, ఏడీ సుధీర్నాథ్బెనర్జీ మధ్య తొలుత విబేధాలు వచ్చినట్లు సమాచారం. సెప్టెంబరులో సుధీర్నాథ్ బెనర్జీని సరెండర్ చేస్తూ డీడీ చర్యలు తీసుకున్నారు. నేరుగా డైరెక్టర్కు సరెండర్ చేసే అధికారం లేదంటు డైరెక్టర్ నుంచి తిరిగి ఉత్తర్వులు వచ్చాయి. దీంతో డీడీ మళ్లీ బెనర్జీని జిల్లా అధికారి (జేడీ) నుంచి డైరెక్టర్కు సరెండర్ చేశారు. కొన్నాళ్లకు పశువైద్యుడు సుభాష్చంద్రబోస్కు డీడీకి మనస్పర్థలు వచ్చాయి. విధులు సక్రమంగా నిర్వర్తించలేదంటూ సరెండర్ చేశారు. గతేడాది నవంబరులో అచ్చెన్నను సరెండర్ చేస్తూ డైరెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. అక్కడే పనిచేసే ఏడీ సుధీర్నాథ్బెనర్జీకి డీడీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అచ్చెన్న న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టేటస్కో తెచ్చుకుని తిరిగి డీడీగా బాధ్యతలు చేపట్టారు. సరెండర్ చేస్తే జీతాలు ఇవ్వడం కుదరని కొందరికి జీతాలు నిలిపేశారు. ఫిబ్రవరి 6న సిబ్బంది లోపలికి రాకుండా గేటుకు తాళం వేయడంతో వివాదం తారాస్థాయికి చేరుకుంది. రెండురోజుల తేడాతో ఏడీ శ్రీధర్లింగారెడ్డి, ఇద్దరు అటెండర్లను సరెండర్ చేస్తూ డీడీ చర్యలు తీసుకున్నారు. జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు జిల్లా అధికారులు చేరవేస్తూ వచ్చారు. అధికారుల మధ్య చోటు చేసుకున్న వివాదాన్ని పరిష్కరించడంలో విఫలమయ్యారనే అపవాదును ఉన్నతాధికారులు ఎదుర్కొంటున్నారు. ఫిబ్రవరి 14, 15 తేదీల్లో త్రిసభ్య కమిటీతో కూడిన నిజనిర్ధారణ కమిటీ వచ్చి అందరి నుంచి రాతపూర్వకంగా తీసుకుని వెళ్లింది. నెల్లూరు పశువైద్యాధికారి విచారణ జరిపారు. రెండు కమిటీలు వేర్వేరుగా ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయి. తర్వాత డీడీ అచ్చెన్నను సస్పెండ్ చేస్తూ మార్చి 15న ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. వీపీసీ డీడీగా జిల్లా పశుంవర్ధకశాఖ అధికారి శారదమ్మను అదనపు బాధ్యతలు తీసుకోవాలని ఆదేశాలూ వచ్చాయి. అదే నెల 12న అచ్చెన్న అదృశ్యమయ్యారు. 14న కుటుంబ సభ్యులు అయిదుగురిపై అనుమానం ఉందని కడప ఒకటో పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ నెల 24న గువ్వలచెరువు ఘాట్లో శవమై కనిపించడంతో ఆయన హత్య ఉదంతం వెలుగు చూసింది. వృత్తిపరమైన విభేదాలను వ్యక్తిగతంగా తీసుకునే వరకు పరిస్థితి దారి తీసింది. ఉన్నతాధికారులు కూర్చుని సమస్యను సర్దుబాటు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనే వాదన వినిపిస్తోంది.
పిలిచినప్పుడు రావాల్సిందే
కడప పశుసంవర్ధకశాఖ డీడీ అచ్చెన్న హత్యకేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురు ఉద్యోగులను అదుపులోకి తీసుకుని విచారించగా వారిలో సుభాష్చంద్రబోస్ హత్య చేసినట్లు రుజువు కావడంతో అతనితో పాటు మరో ఇద్దరు బయట వ్యక్తులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరో ఇద్దరు ఉద్యోగులు ఆదివారం నుంచి పోలీసుల అదుపులోనే ఉన్నారు. వారిని పోలీసులు విభిన్న కోణాల్లో విచారించి సోమవారం సాయంత్రం విడిచిపెట్టారు. తిరిగి విచారణకు పిలిస్తే తప్పనిసరిగా రావాలని చెప్పి పంపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా శ్రీ వీరాంజనేయ స్వామి తిరుణాల
[ 19-04-2024]
మండలంలోని కొండపేటలో శుక్రవారం శ్రీ వీరాంజనేయ స్వామి తిరుణాల ఘనంగా జరిగింది. -
మద్యం సీసాలు పట్టివేత
[ 19-04-2024]
మండల కేంద్రంలో శుక్రవారం అక్రమంగా మద్యం సీసాలు తరలిస్తున్న రమేష్ అనే వ్యక్తిని అరెస్టు చేసి 15 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ నాగమురళి తెలిపారు. -
రాయంచపై రాములోరి రాజసం
[ 19-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు గురువారం రాత్రి రాయంచపై రాములోరి విహారం కనులపండువగా సాగింది. -
మొదలైన నామినేషన్ల సందడి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ గురువారం మొదలైంది. కలెక్టర్ విజయ రామరాజు ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం కలెక్టరేట్లోని తన ఛాంబరులో నామపత్రాల స్వీకరణను ఆయన ప్రారంభించారు. -
జగన్ను నమ్మాం... నిండా మునిగాం!
[ 19-04-2024]
‘నేను ఉన్నానన్నావ్... నేను విన్నానన్నావ్... నిజమే అనుకున్నాం... నీ మాటలు విని మా బాధలు తెలుసుకుంటావని, పరిష్కారం చూపుతావని ఎంతో ఆశతో నిన్ను గెలిపించాం... తీరా చూస్తే నువ్వు ఉన్నావు... కానీ వినే ఓపికే లేకుండా పోయింది. -
షర్మిలకు మద్దతుగా పులివెందులలో సునీత ప్రచారం
[ 19-04-2024]
కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల తరఫున మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత దంపతులు గురువారం నుంచి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. -
బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మరథం
[ 19-04-2024]
బ్రహ్మాండ నాయకుడైన శ్రీరాముడి రథోత్సవం గురువారం వాల్మీకి క్షేత్రంలో వైభవంగా జరిగింది. ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
మరో వైకాపా ఫ్యానుపై వేటు
[ 19-04-2024]
వృత్తి ఉద్యోగమైనా... నిబంధనలు ఉల్లంఘించి అత్యుత్సాహంతో ముఖ్యమంత్రి జగన్కు ఊడిగం చేసే వారికి తగిన శాస్తి జరుగుతుందనడానికి నిదర్శనమే... ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై వేటు. -
పెద్దిరెడ్డి కుటుంబ దోపిడీని ఓటుతో అడ్డుకోండి
[ 19-04-2024]
రాజంపేట పార్లమెంట్ పరిధిలో పెద్దిరెడ్డి దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ముఖ్యమంత్రి, భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. -
జగన్ బాటలో బస్సులు.. జనానికి ‘ముప్పు’తిప్పలు!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో పల్లెలకు బస్సులు దూరమయ్యాయి... కొత్త బస్సులు రాకపోగా, ఉన్న బస్సులు మరమ్మతులకు గురయ్యాయి... పల్లె బస్సులు రద్దయ్యాయి. అవీ ఎప్పుడొస్తాయో తెలియదు. -
బ్రహ్మోత్సవ శోభ... ఆధ్యాత్మిక ప్రభ
[ 19-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రామయ్య క్షేత్రంలో రెండో రోజు గురువారం ఉదయం యాగశాలలో తితిదే ఆగమ సలహాదారు కల్యాణపురం రాజేష్ భట్టార్ ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు. -
జగనన్న చెప్పాడంటే చెయ్యడంతే
[ 19-04-2024]
మైకు పట్టుకుని రాజకీయ నాయకులేం చెబుతారో ఎన్నికల తర్వాత ఆ పని చేయకపోతే రాజీనామా చేసిపోయే పరిస్థితి రావాలన్నావు. నీ మాటలు నమ్మి ప్రశ్నిస్తే.. కేసులు పెట్టిస్తున్నావ్.. నీ అనునాయులతో ఉరికించి ఉరికించి కొట్టిస్తున్నావ్.. చెప్పిన మాటకు కట్టుబడక పోతే ఎలాగన్నా. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి
[ 19-04-2024]
కేంద్రం, రాష్ట్రంలో తమ ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే చేనేత కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తామని కడప ఎంపీ తెదేపా అభ్యర్థి భూపేష్రెడ్డి, జమ్మలమడుగు అసెంబ్లీ భాజపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డి హామీ ఇచ్చారు. -
జిల్లాకు చేరుకున్న కేంద్ర ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై పర్యవేక్షణకు కేంద్ర ఎన్నికల పరిశీలకులు గురువారం జిల్లాకు చేరుకున్నారు. తొలుత కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, ఎస్పీ కృష్ణారావు, ఇతర జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. -
రాజంపేట వైకాపాలో ముసలం
[ 19-04-2024]
రాజంపేట వైకాపాలో ముసలం పుట్టింది. నియోజకవర్గానికి చెందిన వైకాపా నాయకులు, కార్యకర్తలు ఇటీవల తెదేపాలో చేరారు. ఈ క్రమంలో హైదరాబాద్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో బుధవారం జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు, తెదేపా నాయకుడు పోలి సుబ్బారెడ్డి, సుగవాసి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో నందలూరు, రాజంపేట మండలాలకు చెందిన వైకాపా నేతలు పార్టీలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు