logo

పులివెందులలో వైకాపాను ఓడిస్తాం

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పులివెందులలో వైకాపాను ఓడిస్తామని తెదేపా ఎమ్మెల్సీలు బీటెక్‌ రవి, భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి అన్నారు.

Published : 28 Mar 2023 03:18 IST

ఎమ్మెల్సీలు బీటెక్‌ రవి, రామగోపాల్‌రెడ్డి

తెదేపా నాయకులతో సమావేశమైన ఎమ్మెల్సీలు బీటెక్‌ రవి, భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి

వేంపల్లె, న్యూస్‌టుడే : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పులివెందులలో వైకాపాను ఓడిస్తామని తెదేపా ఎమ్మెల్సీలు బీటెక్‌ రవి, భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం వేంపల్లెకు వచ్చిన వారు స్థానిక తెదేపా కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలు, ఇతర నేతలతో సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ పులివెందులలో వివేకా హత్య విషయంలో వైఎస్‌ కుటుంబ సభ్యులపై చాలా వ్యతిరేకత వచ్చిందన్నారు. పట్టభద్రుల, శాసనమండలి ఎన్నికల్లో తెదేపా సత్తా ఏమిటో చూపించామని, ఓ పథకం ప్రకారం పార్టీ బలోపేతానికి చర్యలు చేపడతామన్నారు. జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, రానున్న రోజుల్లో ఆ పార్టీని దెబ్బతీసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి మద్దతు చాలా ఉపయోగకరంగా ఉంటుందని బీటెక్‌ రవి అన్నారు. కార్యక్రమంలో పార్టీ పార్లమెంటరీ విభాగం కార్యదర్శి మైసూరారెడ్డి, మండల కన్వీనర్‌ రామమునిరెడ్డి, పట్టణశాఖాధ్యక్షుడు రమేష్‌బాబు, నాయకులు వీరభద్ర, వలీ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని