logo

జిల్లాకు నేడు త్రిసభ్య కమిటీ రాక

జిల్లా బహుళార్ధ పశువైద్యశాల వివాదంపై నేడు (మంగళవారం) త్రిసభ్య కమిటీ జిల్లాకు రానుందని పశుసంవర్ధకశాఖ సంచాలకులు అమరేంద్రకుమార్‌ తెలిపారు.

Published : 28 Mar 2023 03:14 IST

అచ్చెన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ అమరేంద్రకుమార్‌, జిల్లా  
అధికారి శారదమ్మ, తదితరులు

జిల్లా బహుళార్ధ పశువైద్యశాల వివాదంపై నేడు (మంగళవారం) త్రిసభ్య కమిటీ జిల్లాకు రానుందని పశుసంవర్ధకశాఖ సంచాలకులు అమరేంద్రకుమార్‌ తెలిపారు. సోమవారం జిల్లాకు వచ్చిన ఆయన వీపీసీలో అచ్చెన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అచ్చెన్న కుటుంబానికి తమ శాఖ అండగా ఉంటుందన్నారు. పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారిణి శారదమ్మ, తదితరులతో కలిసి కలెక్టర్‌, ఎస్పీలను కలిశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీ మంగళవారం జిల్లాకు వచ్చి వీపీసీ పరిస్థితిపై విచారణ చేస్తుందన్నారు. కార్యక్రమంలో డీడీ రమణయ్య, ఐఎస్‌డీపీ ఏడీ రమణారెడ్డి, పశువైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని