logo

‘ఓట్ల కోసమే ముఖ్యమంత్రి రిజర్వేషన్ల ప్రకటన’

రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ రిజర్వేషన్లను దళిత క్రిస్టియన్లకు ఇచ్చేందుకు కుట్ర పన్నారని భారతీయ జనతా పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రాయలసీమ బాధ్యుడు నాగరాజు ఆరోపించారు.

Published : 28 Mar 2023 03:14 IST

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న భాజపా నాయకులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ రిజర్వేషన్లను దళిత క్రిస్టియన్లకు ఇచ్చేందుకు కుట్ర పన్నారని భారతీయ జనతా పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రాయలసీమ బాధ్యుడు నాగరాజు ఆరోపించారు. దళిత కిస్టియన్లను ఎస్సీ జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులు, క్రిస్టియన్లు వేర్వేరని, దళిత క్రిస్టియన్ల పేరుతో ఎస్సీల కోటాను అప్పగించడం దుర్మార్గమన్నారు.. ఎస్సీ, బీసీ సీగా రెండు వైపులా రిజర్వేషన్లు పొందేలా ప్రభుత్వం మద్దతు ఇవ్వడం సరికాదన్నారు. ఈ ప్రక్రియను భాజపా ఖండిస్తోందన్నారు. నేటికీ ఎస్సీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,  ఉన్న రిజర్వేషన్లను ఇతరులకు పంచితే ఆర్థిక అసమానతలు పెరిగిపోతాయన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు చలపతిరావు, సాంబశివయ్య, రామసుబ్బయ్య, లక్ష్మీనారాయణ, లక్షణరావు, వెంకటేశు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని