పోలవరం ఎత్తు తగ్గిస్తే సీమ ఎడారే
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే రాయలసీమ ఎడారిగా మారుతుందని, పూర్తిస్థాయిలో నీటిని నిలిపేలా నిర్మించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు.
కలెక్టరేట్ ఎదుట దీక్షలు చేస్తున్న సీపీఐ నాయకులు
అరవిందనగర్ (కడప), న్యూస్టుడే : పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే రాయలసీమ ఎడారిగా మారుతుందని, పూర్తిస్థాయిలో నీటిని నిలిపేలా నిర్మించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట పోలవరం ప్రాజెక్టును 150 అడుగులతో నిర్మించాలని కోరుతూ చేపట్టిన రిలే దీక్షలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గాలి చంద్ర మాట్లాడుతూ జాతీయ హోదా కల్గిన పోలవరం ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. 150 అడుగుల ఎత్తులో 294 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాల్సిన ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం రోజుకో షరతు విధిస్తూ నిధుల కేటాయింపుల్లో నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసం మోదీకి రాష్ట్ర భవిష్యత్తును తాకట్టుపెట్టారని ఆరోపించారు. పోలవరం సామర్థ్యాన్ని 90 అడుగులకు కుదిస్తే రాయలసీమ ఎక్కువగా నష్టపోతుందన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు నాగసుబ్బారెడ్డి, ఆంజనేయులు, బషీరున్నీసా, సుబ్రహ్మణ్యం, సుబ్బారెడ్డి, వేణుగోపాల్, బాదుల్లా, వలరాజు, గంగాసురేష్, సావంత్ సుధాకర్, మనోహర్రెడ్డి, ఈశ్వరయ్య, వెంకటరాముడు, యానదయ్య, పద్మ, మైనుద్ధీన్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనమామ వేషం... అక్కచెల్లెమ్మలకు మోసం
[ 18-04-2024]
సీఎం జగన్... రాష్ట్రంలోని విద్యార్థులందరికీ తాను మేనమామని గొప్పగా చెప్పుకొంటుంటారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేవిధంగా చేస్తానంటూ బీరాలు పలుకుతుంటారు. ఇందుకోసం అన్ని రకాల సాయాలు చేస్తానంటూ వాగ్దానాలు ఇచ్చేస్తుంటారు. -
ఎన్నికల రణరంగానికి వేళాయె!
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తలపడనున్న అభ్యర్థులు గురువారం నుంచి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంటు స్థానానికి, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు(ఎస్సీ), వైయస్ఆర్ జిల్లా కడప పార్లమెంటు స్థానంతో పాటు కడప, పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు, బద్వేలు(ఎస్సీ), జమ్మలమడుగు, మైదుకూరు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై మైనార్టీల తిరుగుబాటు
[ 18-04-2024]
జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై ముస్లిం మైనార్టీలు తీవ్ర స్థాయిలో తిరుగుబాటు చేశారు. జమ్మలమడుగులోని ఆయన కార్యాలయాన్ని బుధవారం రాత్రి వారంతా ముట్టడించి నిరసన తెలిపారు. -
జగన్ దంపతులకు తెలియకుండా వివేకా హత్య జరిగి ఉండదు
[ 18-04-2024]
సీఎం జగన్ దంపతులకు తెలియకుండా మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగి ఉండదని భాజపా జమ్మలమడుగు అభ్యర్థి ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక భాజపా కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. -
రాజంపేటలో వైకాపాకు భారీ షాక్!
[ 18-04-2024]
రాజంపేట నియోజకవర్గంలో వైకాపాకు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే అధిక సంఖ్యలో నాయకులు తెదేపాలో చేరగా, మరికొందరు నేతలు బుధవారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో మంగళగిరిలో చేరారు. -
దాశరథి...శేష వాహన విహారి
[ 18-04-2024]
శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో తొలిరోజు బుధవారం రాత్రి సీతారాములు ప్రత్యేక అలంకరణలో శేష వాహనంపై భక్తులకు దర్శన మిచ్చారు. -
కాస్త మిగిల్చారు
[ 18-04-2024]
మళ్లీ వైకాపా అధికారంలోకొస్తే ఇక్కడ గగ్గితిప్ప కొండ ఉండేదని మా పిల్లలకు చెప్పాల్సి వస్తుందని ఇటీవల అధికార వైకాపా నుంచి తెదేపాలో చేరిన ఓ నాయకుడు అన్న మాటలవి. -
వైకాపా అండదండలు... నేతలే అనకొండలు..!
[ 18-04-2024]
అధికార వైకాపా అండదండలతో నేతలు అనకొండల్లా కొండలు, గుట్టలను మింగేస్తున్నారు. ‘పచ్చని చెట్లను నరికేస్తే మళ్లీ నాటుకోవచ్చు. అదే కొండలు, గుట్టలను కొల్లగొడితే వాటి ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉంది’ అని న్యాయస్థానాలు అక్షింతలు వేసినా, ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా అధికార నేతల చెవికెక్కడంలేదు. -
ప్రతి హృది నిండుగా... పురుషోత్తముని పండగ
[ 18-04-2024]
ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు ధ్వజారోహణం క్రతువు వైభవంగా జరిగింది. -
ఇదేం సన్నద్ధత
[ 18-04-2024]
ఒంటిమిట్ట కోదండరామాలయం బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని గత మూడు నెలలుగా తితిదే అధికారులు తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. -
ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు తయారీ
[ 18-04-2024]
ఒంటిమిట్ట రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 22న నిర్వహించే సీతారాముల కల్యాణం తిలకించడానికి తరలిరానున్న భక్తులకు పంపిణీ చేయడానికి ముత్యాల తలంబ్రాలు ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. -
పోతన రచనలు జన రంజకం
[ 18-04-2024]
బమ్మెర పోతన రచనలు జన రంజకమై చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయినట్లు తితిదే దత్సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనందతీర్థాచార్యులు పేర్కొన్నారు. ఒంటిమిట్టలో బుధవారం పోతన జయంతి వేడుకలను నిర్వహించారు. -
తొలిప్రయత్నంలోనే సివిల్స్లో 475 ర్యాంకు
[ 18-04-2024]
సివిల్స్లో కడప యువకుడు హరిప్రసాద్రాజు మెరిశాడు. తొలిప్రయత్నంలోనే 475వ ర్యాంకుతో సత్తాచాటాడు. వీరి సొంతూరు రాజంపేట ములక్కాయలపల్లె గ్రామం కాగా, ప్రస్తుతం కడప బాలాజీనగర్ నివాసముంటున్నారు. -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
[ 18-04-2024]
ఎన్నికల ప్రక్రియలో అతి కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు విజయరామరాజు తెలిపారు. -
సెక్యూరిటీ గార్డే శవపరీక్ష నిపుణుడు
[ 18-04-2024]
మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఎంత మంది ఎంఎన్వోలు, జీడీఏ సిబ్బంది వచ్చినా శవపరీక్షలు మాత్రం భద్రతా సిబ్బందే చేయాల్సి వస్తోంది. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రెడ్డెప్ప గత కొంతకాలంగా శవపరీక్ష విధులు నిర్వహిస్తున్నారు. -
చేనేతల సమస్యల పరిష్కారానికి కృషి : నల్లారి
[ 18-04-2024]
చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి హామీ ఇచ్చారు. -
ఉప కారాగారంలో రిమాండు ఖైదీ మృతి
[ 18-04-2024]
మద్యం కేసులో అరెస్టు అయిన నిందితుడు మదనపల్లె ఉప కారాగారంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం ముతుకూరుకు చెందిన మొగిలప్ప (67) వ్యవసాయ కూలి. -
రామయ్యను దర్శించుకున్న శారదాపీఠం ఉత్తరాధికారి
[ 18-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని విశాఖపట్నం శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి బుధవారం సందర్శించారు. -
కడప ఎంపీ స్థానానికి పోటీ చేయాలంటే రూ.40 కోట్ల ఖర్చు
[ 18-04-2024]
కడప పార్లమెంటుకు పోటీ చేయడానికి రూ.40 కోట్ల వరకు ఖర్చవుతుందని, కాంగ్రెస్ పార్టీ మహా అయితే రూ.10 లక్షలు ఇస్తుందని, మిగిలిన డబ్బులు అభ్యర్థి వైఎస్ షర్మిల ఎక్కడి నుంచి తెస్తారని వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి రమేశ్రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. ఎయిర్పోర్టు రన్వేపై వీడియో చిత్రీకరించి..
-
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు
-
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: పాల్