logo

ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఉరేేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మదనపల్లె రూరల్‌లో సోమవారం రాత్రి జరిగింది.

Published : 28 Mar 2023 03:14 IST

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఉరేేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మదనపల్లె రూరల్‌లో సోమవారం రాత్రి జరిగింది. కోళ్లబైలు పంచాయతీ బాబుకాలనీకి చెందిన గంగయ్య కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఆఫీస్‌ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. ఆయన భార్య ప్రమీల (49) టైలరింగ్‌ పని చేస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరిద్దరికీ వివాహాలు అయ్యాయి. ఈ క్రమంలో ప్రమీల పలువురి వద్ద పెద్ద మొత్తంలో అప్పులు చేశారు. ఇటీవల రుణదాతలు డబ్బులు చెల్లించాలని కోరారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న రూరల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని