logo

ఉరేసుకొని టిప్పరు డ్రైవరు ఆత్మహత్య

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చినమాచనూరు పంచాయతీ పోలిరెడ్డిపల్లి సమీపంలోని పొలాల్లో మంగళవారం కేశవ(37) అనే టిప్పర్‌ డ్రైవరు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Published : 29 Mar 2023 03:48 IST

మర్రిపాడు, న్యూస్‌టుడే: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చినమాచనూరు పంచాయతీ పోలిరెడ్డిపల్లి సమీపంలోని పొలాల్లో మంగళవారం కేశవ(37) అనే టిప్పర్‌ డ్రైవరు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వైయస్సార్‌(కడప) జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం నందిపల్లికి చెందిన కేశవ.. మర్రిపాడు మండలంలోని కంపసముద్రం వద్ద నిర్మిస్తున్న సోమశిల హై లెవల్‌ కెనాల్‌ ఫేజ్‌-2 పనులకు మట్టి తోలుతున్నారు. కుటుంబ కలహాలతో ఇతను చెట్టుకు ఉరేసుకొని మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని కిందకు దించారు. పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు