నిమ్మ రైతు కన్నీరు
వేసవిలో నిమ్మ కాయలకు డిమాండు ఎక్కువ. గతేడాది ఒక్కో నిమ్మకాయ ధర రూ.10 పలికింది. ప్రస్తుతం డిమాండు ఉన్న తరుణంలో పేనుబంక, వేరుకుళ్లుతో చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి.
వేరుకుళ్లుతో నిలువునా ఎండుతున్న చెట్లు
న్యూస్టుడే, జమ్మలమడుగు: వేసవిలో నిమ్మ కాయలకు డిమాండు ఎక్కువ. గతేడాది ఒక్కో నిమ్మకాయ ధర రూ.10 పలికింది. ప్రస్తుతం డిమాండు ఉన్న తరుణంలో పేనుబంక, వేరుకుళ్లుతో చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. ఏటా ఈ-క్రాప్ చేయించుకుంటున్నా నష్టపోయిన వాటికి పరిహారం ఎందుకివ్వరని బాధిత రైతులు ప్రశ్నిస్తున్నారు. మూడు నెలల పంటలకు ప్రకృతి వైపరీత్యాలతో నష్టం జరిగితే ప్రభుత్వం పరిహారం ప్రకటిస్తోందని దీర్ఘకాలిక తోటలకు సైతం వర్తింపజేయాలని కోరుతున్నారు.
తెగుళ్లతో కలవరం...
నియోజకవర్గంలో జమ్మలమడుగు, మైలవరం, ముద్దనూరు, కొండాపురం తదితర మండలాల్లో నిమ్మ తోటలు విస్తారంగా ఉన్నాయి. జమ్మలమడుగు మండలం గండికోటలోనే సుమారు 20 వేల వరకు నిమ్మ చెట్లు ఉన్నాయి. రెండేళ్లుగా పేనుబంక, వేరుకుళ్లు తెగులు రైతులను కలవరపెడుతున్నాయి. ఎన్ని మందులు వాడినా అదుపులోకి రావడం లేదని రైతులు వాపోతున్నారు. కొమ్మలకు పేనుబంక వచ్చిన వెంటనే పూత రాలిపోతోందని చెబుతున్నారు. ఎండలు మండిపోతుండడంతో మార్కెట్లో నిమ్మ కాయలకు డిమాండు ఏర్పడింది. వెయ్యి కాయలు రూ.4 వేలు ధర పలుకుతోంది. ప్రతిరోజూ జమ్మలమడుగు ప్రాంతం నుంచి ప్రొద్దుటూరు, బెంగళూరుకు దిగుబడులు తరలిస్తున్నారు. ఇలాంటి సమయంలో వేరుకుళ్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యానశాఖాధికారులు పరిశీలించి తెగుళ్లను అరికట్టేవిధంగా సూచనలివ్వాలని కోరుతున్నారు.
వెయ్యి చెట్లు ఎండిపోయాయి
- నరసింహ, నిమ్మరైతు, గండకోట
నాకు గండికోటలో సుమారు 2 వేలకుపైగా నిమ్మ చెట్లు ఉన్నాయి. వేరుకుళ్ల్లు కారణంగా ఇప్పటివరకు వెయ్యి చెట్ల వరకు కోల్పోయాను. ఈ వేసవిలో ధర బాగుందనుకున్న సమయంలో తెగుళ్లతో చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి నష్టపోతున్న రైతులకు ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలి.
ముందే గుర్తిస్తే అరికట్టవచ్చు
- భరత్రెడ్డి, ఉద్యానశాఖాధికారి, ప్రొద్దుటూరు
వేరుకుళ్లును ముందే పసిగడితే చెట్టు ఎండిపోకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ తెగులు ప్రారంభ దశలో ఆకులు వాడిపోతాయి ఆ సమయంలోనే ట్రైకోడెర్మావిరిడిని వంద కిలోల పశువుల ఎరువును అర కిలో ప్యాకెట్ను కలుపుకుని చెట్టు పాదులో వేయాలి. పేనుబంకకు అయితే రోగర్ను రెండు ఎంఎల్ను ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే సరిపోతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదేశాలకు పాతర.. ఇసుకాసురుల జాతర!
[ 29-03-2024]
పర్యావరణ అనుమతుల్లేకుండా ఇసుక తవ్వకాలు జరపొద్దని హైకోర్టు స్పష్టం చేసినా అధికార పార్టీ నేతలు ఖాతరు చేయడం లేదు. నిబంధనలను అతిక్రమిస్తే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తీర్పు వెల్లడించినా పోలీసు అధికారులు సైతం వాటిని పట్టించుకోకుండా వైకాపా నేతలకు వత్తాసు పలుకుతున్నారు. -
కీలక నేతలతో చంద్రబాబు భేటీ!
[ 29-03-2024]
మదనపల్లెలో బుధవారం రాత్రి, గురువారం ఉదయం తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ కీలక నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు -
రాయచోటిపై తెదేపా ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
రాయచోటి నియోజకవర్గంపై తెదేపా ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలను పిలిపించుకుని గెలుపు వ్యూహాలపై చర్చించారు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథరెడ్డితో చంద్రబాబు పలుమార్లు మాట్లాడారు -
రెండో రోజూ ప్రయాణికులకు తిప్పలే
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభలకు జిల్లా నుంచి బస్సులు కేటాయించడంతో వరుసగా రెండోరోజూ గురువారం ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. -
ఒంటిమిట్టలో ఆదర్శ పోలింగ్ కేంద్రం
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒంటిమిట్ట ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఆదర్శ పోలింగ్ (పీఎస్-47) కేంద్రం ఏర్పాటు చేశారు. ఉద్యోగుల విధుల నిర్వహణ, ఓటర్లతో మాట్లాడాల్సిన తీరు, ఈవీఎంల పనితీరుపై వీఆర్వోలు, వీఆర్ఏలు, బీఎల్వోలు, సిబ్బందికి అవగాహన కల్పించారు -
దాహమో.... రఘురామ!
[ 29-03-2024]
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది సీఎం జగన్ సొంత ఇలాకాలోని మైదుకూరు పురపాలక సంఘం ప్రజల పరిస్థితి -
మైనార్టీ విద్యకు గ్రహణం!
[ 29-03-2024]
కేంద్ర ప్రాయోజిత నిధులతో నిర్మించతలపెట్టిన ముస్లిం, దూదేకులు, దళిత క్రిస్టియన్ల పిల్లలకు 6 నుంచి 10వ తరగతి వరకు గురుకుల పాఠశాలలు, వసతిగృహ సముదాయాలు ప్రతిపాదనలకే పరిమిత మయ్యాయి -
‘దోషులను వెంట పెట్టుకుంది జగనే’
[ 29-03-2024]
శామాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిని వెంటపెట్టుని తిరుగుతున్నది సీఎం జగనే అని మాజీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు సనసభ తెదేపా అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి ఆరోపించారు -
వివేకా హత్య కేసులో నిందితుడు అవినాష్ ఎంపీ టికెట్టా?
[ 29-03-2024]
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడు వై.ఎస్.అవినాష్రెడ్డిని పక్కన పెట్టుకుని, తన చిన్నాన్నను ఎవరో చంపేశారని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని భాజపా జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్రెడ్డి అన్నారు. -
తాగునీటి గండం..విద్యార్థులకు శాపం
[ 29-03-2024]
దేశ సరిహద్దులో భద్రత ఏర్పాట్లు చూసే సైనికులు... పశువైద్య విజ్ఞానాన్ని అవపోశన పడుతున్న విద్యార్థులను తాగునీటి సమస్య విపరీతంగా వేధిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్