logo

రద్దయిన రైళ్లను పునరుద్ధరించండి

రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో కొవిడ్‌ సమయంలో రద్దయిన వివిధ రైళ్లను పునరుద్ధరించాలని ఎంపీ మిథున్‌రెడ్డి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు విన్నవించారు.

Updated : 29 Mar 2023 06:10 IST

రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఎంపీ మిథున్‌రెడ్డి వినతి

రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో చర్చిస్తున్న ఎంపీ మిథున్‌రెడ్డి

రాయచోటి, న్యూస్‌టుడే: రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో కొవిడ్‌ సమయంలో రద్దయిన వివిధ రైళ్లను పునరుద్ధరించాలని ఎంపీ మిథున్‌రెడ్డి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు విన్నవించారు. జిల్లా పరిధిలో రైల్వే ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాజంపేట, ఓబులవారిపల్లె, పుల్లంపేట, రైల్వేకోడూరు, నందలూరు రైలునిలయాల్లో 26 రైళ్లను నిలిపేవిధంగా ఆదేశాలివ్వాలని కోరారు. వేలాది మంది ప్రయాణికులు ఆయా రైలునిలయాల నుంచి ప్రయాణం సాగించేందుకు అనువుగా ఉంటుందని వివరించగా వీలైనంత త్వరగా అన్ని అంశాలు పరిశీలించి చర్యలు చేపడతామని మంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని