అమ్మా.. కొద్దిసేపు ఆగండమ్మా
‘మహిళల ఖాతాల్లో డబ్బులు జమచేస్తుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పిన మాటలు కూర్చుని పది నిముషాలు వినేదానికి ఓపిక లేదంటే నిజంగా చాలా బాధేస్తోందమ్మా!
ప్రసంగిస్తున్న ఉప ముఖ్యమంత్రి అంజాద్బాషా... బయటకు వెళ్లిపోతున్న మహిళలు
కడప నగరపాలక, న్యూస్టుడే : ‘మహిళల ఖాతాల్లో డబ్బులు జమచేస్తుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పిన మాటలు కూర్చుని పది నిముషాలు వినేదానికి ఓపిక లేదంటే నిజంగా చాలా బాధేస్తోందమ్మా! అమ్మా కొద్ది సేపు ఆగండమ్మా.. ఆయన ఎన్నికష్టాలు పడుతున్నారు.. మనకోసం ఆయన ఒక మాటిచ్చారు. ఆ మాటను నెరవేర్చుకోవడానికి రూ.6,500 కోట్లు ఒక్క బటన్ నొక్కి మనందరి ఖాతాల్లో జమచేస్తున్నారు. కడప నగరానికే రూ.33 కోట్లు వచ్చాయి’ అని ఉప ముఖ్యమంత్రి అంజాద్బాషా అన్నారు. మూడో విడత వైయస్ఆర్ ఆసరా కార్యక్రమం సందర్భంగా కడప మరియాపురం చర్చి ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగానే మహిళలు వెనుతిరిగారు. వేదిక మీద నుంచే వారిని వెళ్లవద్దని కోరారు. బయటకు వెళుతున్న మహిళలను ఆపడానికి పోలీసులు గేట్లు మూసే ప్రయత్నం చేశారు. కార్యక్రమంలో మెప్మా పీడీ రామ్మోహన్రెడ్డి, కార్పొరేటరు షఫీ, నాయకులు అఫ్జల్ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా