పెన్నా... ఇసుక తవ్వకాలు ఆపేనా?
ఇసుక... అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. అధికార పార్టీ నేతల అండతో కొందరు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పెన్నానది నుంచి భారీ ఎత్తున ఇసుక తరలిపోతున్నా అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గడువు ముగిసినా కొనసాగుతున్న అక్రమ రవాణా
నాయకుల అండతో చెలరేగిపోతున్న అక్రమార్కులు
న్యూస్టుడే, సిద్దవటం, కడప
జంగాలపల్లె వద్ద పెన్నాలో యంత్రంతో ఇసుక తవ్వకాలు
ఇసుక... అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. అధికార పార్టీ నేతల అండతో కొందరు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పెన్నానది నుంచి భారీ ఎత్తున ఇసుక తరలిపోతున్నా అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిద్దవటం మండలం జంగాలపల్లె గ్రామసమీపంలోని పెన్నానదిలో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భారీ వాహనాల రాకపోకలతో రహదారి ప్రమాదాలు జరుగుతుండడంతో సిద్దవటం మండలం జంగాలపల్లె గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. తెదేపా, జనసేన పార్టీల నాయకులు ప్రజల పక్షాన నిలిచి వాహనాలు అడ్డుకున్నారు. జంగాలపల్లె గ్రామసమీపంలోని పెన్నానదిలో ఏడాది కిందట అధికారికంగా ఇసుక క్వారీ ప్రారంభమైంది. ఆరంభం నుంచి క్వారీలో నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలొచ్చాయి. నదిలో సుమారు 15 అడుగుల లోతు వరకు యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరిపారు. లారీల్లో 30 టన్నులకుపైగా ఇసుక నింపి ఇతర రాష్ట్రాలకు తరలించినట్లు ఆరోపణలున్నాయి. క్వారీ గడువు గతేడాది డిసెంబరులోనే ముగియడంతో గుత్తేదారు తవ్వకాలు నిలిపేసి వెళ్లిపోయారు. అనంతరం అధికార పార్టీ మండల నాయకులు రంగంలోకి దిగారు. యథావిధిగా తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ప్రతి రోజూ సుమారు వంద టిప్పర్లు, ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం. పొలాలకు, తాగునీటి పథకాలకు సమీపంలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. బిల్లులు, అనుమతుల్లేకుండానే వాహనాల్లో ఇసుక తరలిస్తున్నారు. ఈ నెల 21న స్థానిక మహిళలు కూలీ పనులకు ఆటోలో వెళ్తుండగా వేగంగా వస్తున్న ఇసుక టిప్పర్ ఢీకొంది. ప్రమాదంలో పలువురు మహిళలు గాయపడ్డారు. వీరిలో ఓ మహిళ కాలును వైద్యులు తొలగించారు. ఇసుక కోసం వచ్చే వాహనాలతో ప్రమాదాలు జరుగుతుండడంపై ప్రజలు ఆందోళన బాట పట్టారు.
ఇసుకలోడుతో వస్తున్న వాహనం
తెదేపా, జనసేన నాయకుల ఆందోళన
జనసేన పార్టీ యువ నాయకుడు అతికారి దినేష్కుమార్ స్థానికులతో కలిసి ఆందోళన చేశారు. ఇసుక తవ్వకాలను నిలిపేయాలని డిమాండు చేశారు. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు స్థానిక నాయకులు, గ్రామస్థులతో కలిసి పెన్నాను పరిశీలించారు. బిల్లులు చూపించాలని టిప్పర్లు, లారీల చోదకులను కోరగా లేవని సమాధానం చెప్పారు. క్వారీకి అనుమతి లేదనే అనుమానాలు కలుగుతున్నాయని నాయకులు స్పష్టం చేశారు. రెండు నెలల కిందటే క్వారీ గడువు ముగిసిందని, అయినప్పటికీ ఇసుక అక్రమ రవాణా జరుపుతుండడం దారుణమంటూ వాహనాలను అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు పెన్నా వద్దకు రావడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. క్వారీకి అనుమతులు ఉన్నాయా లేవా అనేది విచారిస్తామని సీఐ చెప్పడంతో ఆందోళన విరమించారు.
గడువు ముగిసింది
- వెంకటేశ్వరరెడ్డి, డీడీ, గనులశాఖ
జంగాలపల్లె గ్రామంలో ఇసుక క్వారీ గడువు గతేడాది డిసెంబరుతో ముగిసింది. ఇసుక రవాణాకు ఎలాంటి అనుమతి లేదు. ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే నివారించేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంటు బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు చర్యలు తీసుకోవాలి.
చర్యలు తీసుకుంటాం
- ఉరుకుందమ్మ, సీఐ, ఎస్ఈబీ, సిద్దవటం
సిద్దవటం ఎస్ఈబీ పరిధిలో ఉండే మండలాల్లో ఇసుక అక్రమ రవాణా జరగకుండా నిఘా ఉంచాం. జంగాలపల్లెలోని పెన్నాలో గతంలో క్వారీకి అనుమతి ఉండేది. ప్రస్తుతం అనుమతి ఉందా లేదా అన్నది పూర్తి సమాచారం లేదు. సంబంధిత అధికారుల ద్వారా తెలుసుకుని అక్రమ రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుగుబాటు మొదలైంది.. జగన్ ఇంటికి పోవడం ఖాయం: చంద్రబాబు
[ 25-04-2024]
రాయలసీమలో తిరుగుబాటు మొదలైందని.. జగన్ ఇంటికి పోవడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
వైకాపాని పాతాళానికి తొక్కేద్దాం.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం: పవన్
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దాం.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
[ 25-04-2024]
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
[ 25-04-2024]
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
[ 25-04-2024]
సీఎం జగన్ వైకాపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు గురువారం పులివెందుల రానున్నారు. -
మీ బిడ్డనని గారాలు... నీ గడ్డపైనే ఘోరాలు!
[ 25-04-2024]
రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా నరేగా నుంచి రూ.26.02 కోట్లతో 349 మట్టి పనులను వైకాపా నేతలకు పంచిపెట్టారు. -
ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం
[ 25-04-2024]
మాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు -
నేడు రాజంపేట, రైల్వేకోడూరులో ప్రజాగళం
[ 25-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరు పర్యటనకు రానున్నారు -
అక్రమాలకు పాల్పడకుండా గెలిచే సత్తా మీకుందా?
[ 25-04-2024]
అక్రమాలకు పాల్పడకుండా పులివెందులలో గెలిచే సత్తా మీకుందా? అని తెదేపా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి సీఎం జగన్కు సవాల్ విసిరారు -
నీళ్లు గరళం... పారిశుద్ధ్యం అధ్వానం
[ 25-04-2024]
నియోజకవర్గ కేంద్రాలు ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు పట్టణ ప్రాంతాల్లోని కాలనీల ప్రజలు కనీస వసతులకు నోచుకోలేక తల్లడిల్లుతున్నారు -
జగన్ పాలనలో పర్యాటకాభివృద్ధి శూన్యం
[ 25-04-2024]
పర్యాటకుల నుంచి ఛార్జీలు, పన్నులు తదితరాల పేరుతో ఆదాయం వస్తున్నా ఆ రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. -
జగనన్న హామీలు...నీటి మూటలు
[ 25-04-2024]
ఆరునూరైనా అభివృద్ధి చేసి తీరుతాం.. మైదుకూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామంటూ జగన్ ప్రభుత్వంలో పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!