ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ
ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. శ్రీరామనవమి పండగ వేడుకలను గురువారం నుంచి నిర్వహించాలని తితిదే అధికారులు నిర్ణయించారు.
పురుషోత్తముడి క్షేత్రం పుష్ప శోభితం
దేదీప్యంగా ఆలయ పరిసరాలు
విద్యుత్తు వెలుగుల్లో కోదండరాముడి ఆలయం
ఒంటిమిట్ట, జిల్లా సచివాలయం, న్యూస్టుడే : ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. శ్రీరామనవమి పండగ వేడుకలను గురువారం నుంచి నిర్వహించాలని తితిదే అధికారులు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. రామయ్య క్షేత్రాన్ని రంగురంగుల పూలతో సుందరంగా అలంకరించారు. పుష్పాలతో తయారు చేయించి తూర్పు ద్వారం వద్ద ఏర్పాటు చేసిన శ్రీరామచంద్రుడు, హనుమాన్ ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయ ప్రాకారం విద్యుత్తు దీపకాంతుల వెలుగుల్లో ప్రకాశిస్తోంది. భక్త సంజీవరాయస్వామి ఆలయం, అన్నప్రసాద కేంద్రం నుంచి పరిపాలన భవనం వరకు రంగురంగుల దీపాలతో అలంకరించారు. శృంగిశైలం గుట్టకు దీప కాంతుల శోభ తీసుకొచ్చారు. భక్తులకు అన్నప్రసాదం వితరణ చేయాలని భారీ ఏర్పాట్లు చేశారు.
సీతారామలక్ష్మణమూర్తులు
ఉత్సవాలు సాగేదిలా...
శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం సాయంత్రం అంకురార్పణ చేయనున్నారు. గురువారం ఉదయం సుప్రభాతం, ఆలయ శుద్ధి, అలంకరణ, ఆరాధన, అర్చన, సర్వదర్శనం, 10 గంటలకు శ్రీరామనవమి ఆస్థానం, స్నపన తిరుమంజనం, సాయంత్రం బ్రహ్మోత్సవాల నిర్వహణకు అంకురార్పణ క్రతువు జరుగనుంది. మార్చి 31న ధ్వజారోహణం, శేష వాహనం, ఏప్రిల్ 1న వేణు గానాలంకారం, హంస వాహనం, 2న వటపత్రశాయి అలంకారం, సింహ వాహనం, 3న నవనీతకృష్ణాలంకారం, హనుమత్సేవ, 4న మోహినీ అలంకారం, గరుడ సేవ, 5న శివధనుర్భాణాలంకారం, గజ వాహనం, 6న రథోత్సవం, 7న కాళీయమర్ధనాలంకారం, అశ్వ వాహనం, 8న చక్రస్నానం, ధ్వజావరోహణం, 9న పుష్పయాగం, ఏకాంత సేవ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తితిదే అధికారులు తెలిపారు.
కట్టుదిట్టమైన బందోబస్తు
బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐలు పురుషోత్తమరాజు, హనుమంతనాయక్ తెలిపారు. రామయ్య క్షేత్రం పరిసర ప్రాంతాలను బుధవారం పరిశీలించారు. భద్రత విధులు నిర్వహించడానికి వచ్చిన పోలీస్ అధికారులు, సిబ్బందితో హరిత కల్యాణ మండపంలో సమావేశాన్ని నిర్వహించారు. భక్తులతో గొడవ పెట్టుకోరాదని, భక్తిభావంతో సేవలందించాలని సూచించారు.
మిగిలిన పనులు పూర్తి చేయండి
సీతారాముల కల్యాణోత్సవం కోసం చేపడుతున్న ఏర్పాట్లలో మిగిలిన పనులను శరవేగంగా పూర్తి చేయాలని తితిదే ఎస్ఈ పి.జగదీశ్వర్రెడ్డి ఆదేశించారు. సీతారాముల కల్యాణ వేదిక, పరిపాలన, విశ్రాంతి భవనం, అన్నప్రసాద వితరణ కేంద్రాలను బుధవారం పరిశీలించారు. అన్నదానం ప్రత్యేక అధికారి శాస్త్రి, ఈఈ సుమతితో చర్చించారు. భక్తులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.
ఏర్పాట్లు పక్కాగా ఉండాలి
ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణోత్సవానికి అధికారులంతా సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లన్నీ పక్కాగా ఉండేలా చూడాలని జేసీ సాయికాంత్వర్మ ఆదేశించారు. బుధవారం కడప కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ఏప్రిల్ 5న సీతారాముల కల్యాణం జరగనుందని, కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వచ్చే అవకాశం ఉందన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రముఖులు వస్తారన్నారు. ఇందుకోసం ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. భద్రత, పార్కింగ్, అన్న ప్రసాదాల వితరణ, తాత్కాలిక మరుగుదొడ్లు, విద్యుత్తు సరఫరా, ప్రథమ చికిత్స కేంద్రాలు తదితర వాటికి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో గంగాధర్గౌడ్, ట్రైనీ కలెక్టర్ రాహుల్మీనా, ఆర్డీవోలు ధర్మచంద్రారెడ్డి, వెంకటరమణ, జడ్పీ సీఈవో సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదేశాలకు పాతర.. ఇసుకాసురుల జాతర!
[ 29-03-2024]
పర్యావరణ అనుమతుల్లేకుండా ఇసుక తవ్వకాలు జరపొద్దని హైకోర్టు స్పష్టం చేసినా అధికార పార్టీ నేతలు ఖాతరు చేయడం లేదు. నిబంధనలను అతిక్రమిస్తే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తీర్పు వెల్లడించినా పోలీసు అధికారులు సైతం వాటిని పట్టించుకోకుండా వైకాపా నేతలకు వత్తాసు పలుకుతున్నారు. -
కీలక నేతలతో చంద్రబాబు భేటీ!
[ 29-03-2024]
మదనపల్లెలో బుధవారం రాత్రి, గురువారం ఉదయం తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ కీలక నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు -
రాయచోటిపై తెదేపా ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
రాయచోటి నియోజకవర్గంపై తెదేపా ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలను పిలిపించుకుని గెలుపు వ్యూహాలపై చర్చించారు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథరెడ్డితో చంద్రబాబు పలుమార్లు మాట్లాడారు -
రెండో రోజూ ప్రయాణికులకు తిప్పలే
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభలకు జిల్లా నుంచి బస్సులు కేటాయించడంతో వరుసగా రెండోరోజూ గురువారం ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. -
ఒంటిమిట్టలో ఆదర్శ పోలింగ్ కేంద్రం
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒంటిమిట్ట ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఆదర్శ పోలింగ్ (పీఎస్-47) కేంద్రం ఏర్పాటు చేశారు. ఉద్యోగుల విధుల నిర్వహణ, ఓటర్లతో మాట్లాడాల్సిన తీరు, ఈవీఎంల పనితీరుపై వీఆర్వోలు, వీఆర్ఏలు, బీఎల్వోలు, సిబ్బందికి అవగాహన కల్పించారు -
దాహమో.... రఘురామ!
[ 29-03-2024]
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది సీఎం జగన్ సొంత ఇలాకాలోని మైదుకూరు పురపాలక సంఘం ప్రజల పరిస్థితి -
మైనార్టీ విద్యకు గ్రహణం!
[ 29-03-2024]
కేంద్ర ప్రాయోజిత నిధులతో నిర్మించతలపెట్టిన ముస్లిం, దూదేకులు, దళిత క్రిస్టియన్ల పిల్లలకు 6 నుంచి 10వ తరగతి వరకు గురుకుల పాఠశాలలు, వసతిగృహ సముదాయాలు ప్రతిపాదనలకే పరిమిత మయ్యాయి -
‘దోషులను వెంట పెట్టుకుంది జగనే’
[ 29-03-2024]
శామాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిని వెంటపెట్టుని తిరుగుతున్నది సీఎం జగనే అని మాజీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు సనసభ తెదేపా అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి ఆరోపించారు -
వివేకా హత్య కేసులో నిందితుడు అవినాష్ ఎంపీ టికెట్టా?
[ 29-03-2024]
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడు వై.ఎస్.అవినాష్రెడ్డిని పక్కన పెట్టుకుని, తన చిన్నాన్నను ఎవరో చంపేశారని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని భాజపా జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్రెడ్డి అన్నారు. -
తాగునీటి గండం..విద్యార్థులకు శాపం
[ 29-03-2024]
దేశ సరిహద్దులో భద్రత ఏర్పాట్లు చూసే సైనికులు... పశువైద్య విజ్ఞానాన్ని అవపోశన పడుతున్న విద్యార్థులను తాగునీటి సమస్య విపరీతంగా వేధిస్తోంది.