మత్తుపదార్థాల రహిత జిల్లాగా మార్చాలి : కలెక్టర్
జిల్లాను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్ విజయరామరాజు ఆదేశించారు.
మాట్లాడుతున్న కలెక్టర్ విజయరామరాజు, పక్కన ఎస్పీ అన్బురాజన్, అధికారులు
జిల్లా సచివాలయం, న్యూస్టుడే : జిల్లాను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో మత్తు పదార్థాల నివారణ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధంపై ఎస్పీ అన్బురాజన్, సెంట్రల్ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ మాధురితో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మత్తు పదార్థాలతో జరిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఆశా, మహిళా పోలీసు, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తల సహకారంతో మత్తు పదార్థాల వినియోగంపై పర్యవేక్షణ చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో గంగాధర్గౌడ్, కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్చంద్, ఆర్డీవోలు పాల్గొన్నారు. మత్స్యకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే మత్స్య సంపద యోజన అందేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. మత్స్య సంపద యోజనపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 32 మంది లబ్ధిదారులను మినీ ఫిషరీస్ రిటైల్ అవుట్లెట్ల ఏర్పాటుకు ఎంపిక చేశామని, మరో 15 మందిని మోపెడ్ విత్ఐస్బాక్స్ కలిగిన మూడు, నాలుగు చక్రాల వాహనాలకు ఎంపికచేసినట్లు వివరించారు. రూ.10 లక్షలు, రూ.20 లక్షల విలువ చేసే కియోస్క్లను ప్రారంభించనున్నామన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ డీడీ నాగలింగాచార్యులు, జడ్పీ సీఈవో సుధాకర్రెడ్డి, డీఏవో నాగేశ్వరరావు, ఎల్డీఎం దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. జిల్లా ఆర్థిక ప్రగతికి పరిశ్రమలు ముఖ్యమని ఆ దిశగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆదేశించారు. బుధవారం కడప కలెక్టరేట్లోని తన ఛాంబరులో జిల్లా పరిశ్రమల ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలోని అన్ని సెక్టార్లకు సంబంధించి 81 యూనిట్లకు రూ.9.47 కోట్ల మేర రాయితీకి కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజరు జయలక్ష్మీ , ఏపీఐఐసీ జోనల్ మేనేజరు శ్రీనివాసమూర్తి, డీపీవో ప్రభాకర్రెడ్డి, డీసీఐ కృష్ణమూర్తి, ఎల్డీఎం దుర్గాప్రసాద్, పీసీబీ ఈఈ జావిద్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు కథనానికి స్పందన
[ 29-03-2024]
మండలంలోని దూలంవారిపల్లెలో మండలాధికారులు రక్షిత మంచి పథకానికి ఉన్న పార్టీ రంగులను చెరిపేసి తెల్లరంగుపూత వేశారు. -
భక్తిశ్రద్ధలతో గుడ్ఫ్రైడే
[ 29-03-2024]
మండలకేంద్రంలోని 136 ఏళ్ల నాటి పురాతన సీఎస్ఐ చర్చిలో శుక్రవారం గుడ్ఫ్రైడేను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. -
ఆదేశాలకు పాతర.. ఇసుకాసురుల జాతర!
[ 29-03-2024]
పర్యావరణ అనుమతుల్లేకుండా ఇసుక తవ్వకాలు జరపొద్దని హైకోర్టు స్పష్టం చేసినా అధికార పార్టీ నేతలు ఖాతరు చేయడం లేదు. నిబంధనలను అతిక్రమిస్తే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తీర్పు వెల్లడించినా పోలీసు అధికారులు సైతం వాటిని పట్టించుకోకుండా వైకాపా నేతలకు వత్తాసు పలుకుతున్నారు. -
కీలక నేతలతో చంద్రబాబు భేటీ!
[ 29-03-2024]
మదనపల్లెలో బుధవారం రాత్రి, గురువారం ఉదయం తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ కీలక నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు -
రాయచోటిపై తెదేపా ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
రాయచోటి నియోజకవర్గంపై తెదేపా ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలను పిలిపించుకుని గెలుపు వ్యూహాలపై చర్చించారు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథరెడ్డితో చంద్రబాబు పలుమార్లు మాట్లాడారు -
రెండో రోజూ ప్రయాణికులకు తిప్పలే
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభలకు జిల్లా నుంచి బస్సులు కేటాయించడంతో వరుసగా రెండోరోజూ గురువారం ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. -
ఒంటిమిట్టలో ఆదర్శ పోలింగ్ కేంద్రం
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒంటిమిట్ట ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఆదర్శ పోలింగ్ (పీఎస్-47) కేంద్రం ఏర్పాటు చేశారు. ఉద్యోగుల విధుల నిర్వహణ, ఓటర్లతో మాట్లాడాల్సిన తీరు, ఈవీఎంల పనితీరుపై వీఆర్వోలు, వీఆర్ఏలు, బీఎల్వోలు, సిబ్బందికి అవగాహన కల్పించారు -
దాహమో.... రఘురామ!
[ 29-03-2024]
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది సీఎం జగన్ సొంత ఇలాకాలోని మైదుకూరు పురపాలక సంఘం ప్రజల పరిస్థితి -
మైనార్టీ విద్యకు గ్రహణం!
[ 29-03-2024]
కేంద్ర ప్రాయోజిత నిధులతో నిర్మించతలపెట్టిన ముస్లిం, దూదేకులు, దళిత క్రిస్టియన్ల పిల్లలకు 6 నుంచి 10వ తరగతి వరకు గురుకుల పాఠశాలలు, వసతిగృహ సముదాయాలు ప్రతిపాదనలకే పరిమిత మయ్యాయి -
‘దోషులను వెంట పెట్టుకుంది జగనే’
[ 29-03-2024]
శామాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిని వెంటపెట్టుని తిరుగుతున్నది సీఎం జగనే అని మాజీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు సనసభ తెదేపా అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి ఆరోపించారు -
వివేకా హత్య కేసులో నిందితుడు అవినాష్ ఎంపీ టికెట్టా?
[ 29-03-2024]
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడు వై.ఎస్.అవినాష్రెడ్డిని పక్కన పెట్టుకుని, తన చిన్నాన్నను ఎవరో చంపేశారని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని భాజపా జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్రెడ్డి అన్నారు. -
తాగునీటి గండం..విద్యార్థులకు శాపం
[ 29-03-2024]
దేశ సరిహద్దులో భద్రత ఏర్పాట్లు చూసే సైనికులు... పశువైద్య విజ్ఞానాన్ని అవపోశన పడుతున్న విద్యార్థులను తాగునీటి సమస్య విపరీతంగా వేధిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు