చమురు, సహజవాయువుల అన్వేషణకు ఓఎన్జీసీ సర్వే
జిల్లాలోని పెన్నా, కుందూ పరివాహక సమీపంలోని చుట్టుపక్కల గ్రామాల్లో చమురు, సహజ వాయువు అన్వేషణకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలోని ఓఎన్జీసీ (ఆయిల్, నాచురల్ గ్యాస్ కార్పొరేషన్) కార్యాచరణ దిశగా సన్నద్ధమవుతోంది.
సర్వేలో సిస్మోగ్రాఫ్ నమోదుకు వినియోగించే ప్రత్యేక వాహనం
ప్రొద్దుటూరు గ్రామీణ, న్యూస్టుడే: జిల్లాలోని పెన్నా, కుందూ పరివాహక సమీపంలోని చుట్టుపక్కల గ్రామాల్లో చమురు, సహజ వాయువు అన్వేషణకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలోని ఓఎన్జీసీ (ఆయిల్, నాచురల్ గ్యాస్ కార్పొరేషన్) కార్యాచరణ దిశగా సన్నద్ధమవుతోంది. దీనిపై ఆయా మండలాల వారీగా భూకంప సర్వేలకు సంబంధించిన గ్రామాల జాబితాలను ఇటీవల తహసీల్దార్లకు చెన్నె నుంచి వచ్చిన సాంకేతిక బృందం అంద జేసింది. ఈ ఏడాది ఆగస్టు నాటికి సర్వే పూర్తవుతుందని తెలిపింది. జాబితాలోని పేర్కొన్న గ్రామాల్లో 30 నుంచి 35 మీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్ చేసిన రంధ్రాల్లో ప్రాథమిక ఎక్స్ప్లోరేషన్ ప్రక్రియతో భూమిపై ఉంచిన కేబుల్స్, సెన్సార్ల ద్వారా సిస్మోగ్రాఫ్లో నమోదు చేయడానికి ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వాహనం వినియోగించనున్నారు. ప్రొద్దుటూరు మండలం గోపవరం ప్రభుత్వ పశువైద్య కళాశాలకు వెళ్లే రోడ్డు పక్కన జియో ఫిజికల్ ఫీల్డ్ పార్టీ-04 (చెన్నె) పేరు మీదుగా తాత్కాలిక క్యాంపు ఆఫీసును ఏర్పాటు చేశారు. ఇక్కడ సాంకేతిక నిపుణుల బృందం, గుత్తేదారు సిబ్బంది ఉన్నారు..రాజుపాళెం, దువ్వూరు, జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం మండలాల పరిధిలో భూకంప సర్వే కోసం మొత్తం 51 గ్రామాలకు సంబంధిత జాబితాలను తహసీల్దారు కార్యాలయాలకు అంద జేశారు. ఈ విషయమై జమ్మలమడుగు ఆర్డీవో శ్రీనివాసులు మాట్లాడుతూ జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్లోని అయిదు మండలాల్లో ఆయిల్, సహజ వాయుల నిక్షేపాలను గుర్తించ డానికి ఓన్జీసీ చేపడుతున్న సర్వే వివరాలను తహసీల్దార్లకు అందజేశామని, డ్రిల్లింగ్ పనులకు రెవెన్యూ అధికారులు, సిబ్బంది సహకరిస్తారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాలి
[ 25-04-2024]
మండలంలోని శంకవరంలో గురువారం రాత్రి భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోశన్న కుమారుడు బొజ్జా కార్తీక్, తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
తిరుగుబాటు మొదలైంది.. జగన్ ఇంటికి పోవడం ఖాయం: చంద్రబాబు
[ 25-04-2024]
రాయలసీమలో తిరుగుబాటు మొదలైందని.. జగన్ ఇంటికి పోవడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
వైకాపాని పాతాళానికి తొక్కేద్దాం.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం: పవన్
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దాం.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
[ 25-04-2024]
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
[ 25-04-2024]
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
[ 25-04-2024]
సీఎం జగన్ వైకాపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు గురువారం పులివెందుల రానున్నారు. -
మీ బిడ్డనని గారాలు... నీ గడ్డపైనే ఘోరాలు!
[ 25-04-2024]
రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా నరేగా నుంచి రూ.26.02 కోట్లతో 349 మట్టి పనులను వైకాపా నేతలకు పంచిపెట్టారు. -
ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం
[ 25-04-2024]
మాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు -
నేడు రాజంపేట, రైల్వేకోడూరులో ప్రజాగళం
[ 25-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరు పర్యటనకు రానున్నారు -
అక్రమాలకు పాల్పడకుండా గెలిచే సత్తా మీకుందా?
[ 25-04-2024]
అక్రమాలకు పాల్పడకుండా పులివెందులలో గెలిచే సత్తా మీకుందా? అని తెదేపా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి సీఎం జగన్కు సవాల్ విసిరారు -
నీళ్లు గరళం... పారిశుద్ధ్యం అధ్వానం
[ 25-04-2024]
నియోజకవర్గ కేంద్రాలు ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు పట్టణ ప్రాంతాల్లోని కాలనీల ప్రజలు కనీస వసతులకు నోచుకోలేక తల్లడిల్లుతున్నారు -
జగన్ పాలనలో పర్యాటకాభివృద్ధి శూన్యం
[ 25-04-2024]
పర్యాటకుల నుంచి ఛార్జీలు, పన్నులు తదితరాల పేరుతో ఆదాయం వస్తున్నా ఆ రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. -
జగనన్న హామీలు...నీటి మూటలు
[ 25-04-2024]
ఆరునూరైనా అభివృద్ధి చేసి తీరుతాం.. మైదుకూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామంటూ జగన్ ప్రభుత్వంలో పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?