పర్యవేక్షణ లోపంతో భక్తులకు అవస్థలు
కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని తితిదే, జిల్లా అధికారులు తరచూ సమీక్ష సమావేశాలు, క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఒంటిమిట్ట, న్యూస్టుడే : కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని తితిదే, జిల్లా అధికారులు తరచూ సమీక్ష సమావేశాలు, క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మునుపటి లోపాలు పునరావృతం కారాదు. గత తప్పిదాలు ఈసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నత స్థాయిలో మార్గనిర్దేశం చేశారు. అయినా అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయ లోపం, పర్యవేక్షణ లేమితో సామాన్య భక్తులకు అవస్థలు తప్పడం లేదు. అధికార యంత్రాంగం తీరును సాధారణ సందర్శకులు తప్పు పడుతున్నారు. ఆలయ దర్శనం కోసం వచ్చే వారిని దక్షిణ గోపురం ద్వారం నుంచి లోపలికి క్యూలైన్ల ద్వారా పంపించాలని ప్రణాళికను రూపొందించారు. వీవీఐపీ, వీఐపీలను మాత్రమే తూర్పు గోపురం నుంచి తీసుకురావాలని నిర్ణయించారు. అయితే చాలామంది రాజగోపురం నుంచి రాములోరి సన్నిధిలోకి ప్రవేశించారు. అడ్డగోలుగా లోపలికి వస్తున్నా పెద్దగా నియంత్రించలేదు. తితిదే పరిపాలన, విజిలెన్సు, పోలీస్, జిల్లా అధికారుల మధ్య సమన్వయం కనిపించడంలేదు. మజ్జిగ, తాగునీరు పొట్లాలను బస్తాలకొద్దీ తెప్పించినా భక్తులకు సక్రమంగా అందజేయలేదు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమరనాథ్రెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వేర్వేరుగా వచ్చినప్పుడు అనుచరులు, అధికారులు భారీ సంఖ్యలో వారిని అనుసరించారు. మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులు, వారి బంధువులు, మిత్రులు రావడంతో నేరుగా పంపిచారు. ఇలా చేయడంతో మిగతా వారంతా అసౌకర్యానికి గురయ్యారు. గతంలో అంకురార్పణ చేసిన మరుసటి రోజు శ్రీరామనవమి, ధ్వజారోహణం, పోతన జయంతి కార్యక్రమాలు జరిగేవి. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఒకరోజు నవమి, తర్వాత ధ్వజారోహణం నిర్వహించడంపై భక్తులు పెదవివిరుస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
[ 25-04-2024]
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
[ 25-04-2024]
సీఎం జగన్ వైకాపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు గురువారం పులివెందుల రానున్నారు. -
మీ బిడ్డనని గారాలు... నీ గడ్డపైనే ఘోరాలు!
[ 25-04-2024]
రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా నరేగా నుంచి రూ.26.02 కోట్లతో 349 మట్టి పనులను వైకాపా నేతలకు పంచిపెట్టారు. -
ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం
[ 25-04-2024]
మాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు -
నేడు రాజంపేట, రైల్వేకోడూరులో ప్రజాగళం
[ 25-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరు పర్యటనకు రానున్నారు -
అక్రమాలకు పాల్పడకుండా గెలిచే సత్తా మీకుందా?
[ 25-04-2024]
అక్రమాలకు పాల్పడకుండా పులివెందులలో గెలిచే సత్తా మీకుందా? అని తెదేపా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి సీఎం జగన్కు సవాల్ విసిరారు -
నీళ్లు గరళం... పారిశుద్ధ్యం అధ్వానం
[ 25-04-2024]
నియోజకవర్గ కేంద్రాలు ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు పట్టణ ప్రాంతాల్లోని కాలనీల ప్రజలు కనీస వసతులకు నోచుకోలేక తల్లడిల్లుతున్నారు -
జగన్ పాలనలో పర్యాటకాభివృద్ధి శూన్యం
[ 25-04-2024]
పర్యాటకుల నుంచి ఛార్జీలు, పన్నులు తదితరాల పేరుతో ఆదాయం వస్తున్నా ఆ రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. -
జగనన్న హామీలు...నీటి మూటలు
[ 25-04-2024]
ఆరునూరైనా అభివృద్ధి చేసి తీరుతాం.. మైదుకూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామంటూ జగన్ ప్రభుత్వంలో పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా