logo

భరత్‌కుమార్‌ యాదవ్‌కు 14 రోజుల రిమాండు

పులివెందుల పట్టణంలో ఈ నెల 28న భరత్‌కుమార్‌ యాదవ్‌ తుపాకీతో జరిపిన కాల్పుల్లో దిలీఫ్‌ మృతి చెందగా, మహబూబ్‌బాషా తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.

Published : 31 Mar 2023 01:38 IST

పులివెందుల, న్యూస్‌టుడే : పులివెందుల పట్టణంలో ఈ నెల 28న భరత్‌కుమార్‌ యాదవ్‌ తుపాకీతో జరిపిన కాల్పుల్లో దిలీఫ్‌ మృతి చెందగా, మహబూబ్‌బాషా తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దిలీఫ్‌ భార్య భాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడు భరత్‌కుమార్‌ యాదవ్‌ను అరెస్టు చేసి స్థానిక కోర్టులో గురువారం హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు భరత్‌కుమార్‌ యాదవ్‌కు ఏప్రిల్‌ 13వ తేదీ వరకు రిమాండ్‌ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని కడప కేంద్ర కారాగారానికి తరలించినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని