logo

శేషవాహనంపై పట్టాభిరాముడు

వాల్మీకిపురంలో నిర్వహిస్తున్న శ్రీపట్టాభిరాముడి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన గురువారం శేషవాహనంపై శాంతి స్వరూపుడైన శ్రీరాముడు...

Published : 31 Mar 2023 01:47 IST

వాల్మీకిపురంలో నిర్వహిస్తున్న శ్రీపట్టాభిరాముడి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన గురువారం శేషవాహనంపై శాంతి స్వరూపుడైన శ్రీరాముడు అధిరోహించి తన తేజస్సుతో వాల్మీకి క్షేత్రంలోని తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తలకు దర్శనభాగ్యం కల్పించారు. అంతకుముందు ఆలయంలో విశేష పూజలు అనంతరం ఉదయం 9 గంటలకు సర్వభూపాల వాహనంపై సీతారాములు అధిరోహించి మాడవీధుల్లో ఊరేగారు. తదుపరి సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామికి స్నపన తిరుమంజనం నిర్వహించారు.

న్యూస్‌టుడే, వాల్మీకిపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని