ఆకాశాన్నంటిన బహుళంతస్తుల అక్రమాలు
వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లోని నగర, పురపాలక సంస్థల పరిధిలో బహుళంతస్తుల నిర్మాణాల అక్రమాలు ఆకాశాన్నంటుతున్నాయి.
చర్యలు చేపట్టని పట్టణ ప్రణాళిక విభాగం
న్యూస్టుడే, ప్రొద్దుటూరు పట్టణం
ప్రొద్దుటూరులో నోటీసులిచ్చిన భవనం
వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లోని నగర, పురపాలక సంస్థల పరిధిలో బహుళంతస్తుల నిర్మాణాల అక్రమాలు ఆకాశాన్నంటుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు నిర్మిస్తున్నా సచివాలయ వార్డు ప్లానింగ్ కార్యదర్శులు నోటీసులకే పరిమితమవుతున్నారు. ఇలాంటి నిర్మాణాలకు పట్టణ ప్రణాళిక విభాగంలోని కీలకాధికారులు, పాలనాధికారులు, అధికార పార్టీలోని కొందరు నాయకులు ప్రోత్సాహం అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైయస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు పట్టణంలో బహుళంతస్తుల నిర్మాణాలు ఇష్టానుసారంగా జరుగుతున్నాయి. వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు నోటీసులిచ్చినా నిర్మాణాలు ఆగకపోవడం గమనార్హం. రహదారి విస్తీర్ణాన్ని బట్టి బహుళంతస్తులను నిర్మించాలన్న నిబంధన క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. 18 మీటర్ల ఎత్తులో నిర్మాణాలు జరిపితే ఎయిర్పోర్టు అథారిటీ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని టౌన్ప్లానింగ్ అధికారులు తెలిపారు. అదనపు నిర్మాణానికి భవన యజమాని ప్రయత్నించినా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలకు భవన క్రమబద్ధీకరణ పథకం (బీపీఎస్) కింద దరఖాస్తు చేయమని టౌన్ప్లానింగ్ అధికారులే ఆ భవన యజమానులకు సూచిస్తుండడం గమనార్హం. ఇక్కడ వైఎంఆర్కాలనీ సాయికుటీర్ రోడ్డు, 4వ సచివాలయ పరిధిలో, మడూరుకాలువ దారిలో ఓ నిర్మాణంలో నిర్దేశించిన ప్లానింగ్ కన్నా ఒక అంతస్తును అధికంగా నిర్మిస్తున్నారు. వీటికి నోటీసులను జారీ చేసినట్లు ఆ వార్డు ప్లానింగ్ కార్యదర్శి తెలిపారు. వైఎంఆర్కాలనీలో సాయిబాబా దేవాలయం సమీపంలో అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నా టౌన్ప్లానింగ్ అధికారులు ఎందుకు చర్యలు చేపట్టలేదని ఇటీవల జరిగిన ప్రొద్దుటూరు కౌన్సిల్ సభా భవనంలో పట్టణ ప్రణాళికాధికారిని సభ్యులు ప్రశ్నించారు. సెట్బ్యాక్ లేని వాటికి అదనపు అంతస్తు నిర్మిస్తున్నా ఎందుకు చర్య చేపట్టలేదని కౌన్సిల్ సైతం ప్రశ్నించింది. ఇదే అంశంపై ఇటీవల జరిగిన సమావేశంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారని పట్టణ ప్రణాళికాధికారిని ప్రశ్నించగా నోటీసులు జారీ చేశామని జవాబిచ్చారు. ఈ అదనపు అంతస్తుకు భవన యజమాని విజయ వాడ టౌన్ప్లానింగ్ అధికారులకు టీడీఆర్కు దరఖాస్తు చేసుకున్నట్లు ఓ అధికారి చెప్పారు.
* అన్నమయ్య జిల్లా మదనపల్లె పురపాలక సంఘంలో సొసైటీ కాలనీ, రామిరెడ్డిలేఅవుట్, రెడ్డప్పనాయుడు కాలనీ తదితర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా బహుళంతస్తులు నిర్మిస్తున్నారు. ఈ పురపాలకలో అన్ని నిర్మాణాలను కలిపి 150 మందికి నోటీసులను జారీ చేశారు. కడప నగర పాలక సంస్థలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
నిబంధనల మేరకే నిర్మించాలి
- దేవికుమారి, ఆర్జేడీ, పట్టణ ప్రణాళిక విభాగం, అనంతపురం
బహుళంతస్తుల భవన నిర్మాణాలు నిబంధనల మేరకు చేపట్టాలి. 300 చదరపు మీటర్ల స్థలంలోపు రెండంతస్తుల కట్టడం ఉండాలి. అదనంగా భవనాన్ని నిర్మించకూడదు. ప్రస్తుతం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ విభాగాధికారులు ఈ నిబంధనలను పరిశీలిస్తున్నారు. ఆ అధికారులు, కమిషనర్లు నోటీసులిచ్చినా నిర్మిస్తుంటే వాటిని తొలగించాలి. బీపీఎస్ పథకం ప్రస్తుతం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
[ 20-04-2024]
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
జనంపై జగనాసురుడి దండయాత్ర!
[ 20-04-2024]
జగన్ అయిదేళ్ల పాలనలో ఊరికో అసురుడు తయారయ్యాడు... కనిపించిన భూములన్నింటికీ కబ్జా చేశారు... సహజ వనరులను ఇష్టారీతిన కొల్లగొట్టారు... తమ ఆగడాలపై ప్రశ్నించినవారిపై దాడులకు తెగబడ్డారు... హత్యలకు సైతం వెనకాడలేదు. -
హామీలకు మంగళం... ఖాకీలకు ద్రోహం!
[ 20-04-2024]
జిల్లా వ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు సబ్ డివిజన్లు ఉన్నాయి. -
నేడు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నామినేషన్
[ 20-04-2024]
పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈమె ఉదయం 8 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి కడప నగరం ఐటీఐ సర్కిల్కు 9.15 గంటలకు చేరుకుని ర్యాలీ ప్రారంభిస్తారు. -
తెదేపా రాజంపేట నియోజకవర్గ పరిశీలకుడిగా దుర్గాప్రసాద్
[ 20-04-2024]
రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంపై తెదేపా అధిష్ఠానం ప్రత్యేక దృష్టిసారించింది. కడపకు చెందిన కీలక నేత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుధా దుర్గాప్రసాద్ను పరిశీలకుడిగా నియమించింది. -
ఏం చేశావ్ మేలు... కౌలు రైతు కుదేలు..!
[ 20-04-2024]
జిల్లాలో 4,88,672 మంది రైతులుండగా, పంటలు సాగు చేసే నికర భూమి 2,70,985 హెక్టార్లు ఉంది. సొంత పొలం లేని 50 వేల మందికి పైగా కౌలురైతులు సొంతూర్లు, ఇతర ప్రాంతాల్లో మిగతా సాగు దారులకు చెందిన భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. -
సింహ వాహనంపై సీతాపతి
[ 20-04-2024]
ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు శుక్రవారం రాత్రి సింహ వాహనంపై సీతాపతి ఊరేగారు. -
అశ్వవాహనంపై శ్రీరాముడు
[ 20-04-2024]
వాల్మీకిపురంలో తితిదే ఆధ్వర్యంలోని పట్టాభిరాముడి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అశ్వవాహనంపై శ్రీరాముడు అధిరోహించి తిరుమాడవీధుల్లో ఊరేగారు. -
మామయ్యనంటూ ఊదరగొట్టేశావ్.. చిన్నారుల భద్రతను గాలికొదిలేశావ్..!
[ 20-04-2024]
జగన్ మామయ్య మాయమాటలకు చిన్నారులూ మోసపోయారు. పిల్లలకు మేనమామనని ఊదరగొట్టి వారి భద్రతను పూర్తిగా గాలికొదిలేశారు. -
అరాచక పాలన పోవాలంటే తెదేపా రావాలి
[ 20-04-2024]
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన పోవాలంటే తెదేపా అధికారంలోకి రావాలని ప్రొద్దుటూరు శాసనసభ తెదేపా అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. -
చిన్నారులతో రాజకీయ ప్రచారం?
[ 20-04-2024]
అధికార పార్టీ ఉల్లంఘనలకు కాదేదీ అనర్హం అన్నట్లు ప్రచారంలోనూ నాయకులు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. చిన్నారుల చేతికి జెండాలిచ్చి ప్రచారం చేయించుకుంటున్నారు. -
వేడుకగా ఊంజల్ సేవ
[ 20-04-2024]
రామయ్య క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం కల్యాణ మండపంలో ఊంజల్ సేవ నిర్వహించారు. -
పాలకుల నిర్లక్ష్యం... ప్రజలకు శాపం
[ 20-04-2024]
పురపాలక హోదా కల్గి పద్దెనిమిదేళ్లు కావస్తున్నా ఇంకా బద్వేలులో పలువార్డులు కనీస సౌకర్యాలకు నోచుకోలేదు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
తెదేపాలో చేరిన పగిడాల దస్తగిరి
[ 20-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. -
ప్రభుత్వ స్థలం... రాచమల్లు పరం
[ 20-04-2024]
వైకాపా ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు, స్థానిక సంస్థల భూములను అధికార పార్టీ నేతలు తమ ఆధీనంలో పెట్టేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, వారి అనుయాయులు, పార్టీ నేతలు, ఓ మోస్తరు నాయకులు, కార్యకర్తలు సైతం మున్సిపల్ స్థలాలపై కన్నేసి వాటిని తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు. -
నిందితుల అరెస్టు
[ 20-04-2024]
బాలఓబిగారి వీధిలో ఈ నెల 17న రాత్రి ఓ మహిళ విషయంలో యువకుల మధ్య జరిగిన ఘర్షణ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఒకటో పట్టణ ఠాణా సీఐ శ్రీకాంత్ తెలిపారు.