హంద్రీనీవా పూడ్చేసి... మట్టినంతా దోచేసి!
వేలు కాదు... లక్షలు కాదు... కోట్ల రూపాయలు ఖర్చు చేసి తవ్విన హంద్రీనీవా కాలువను కొందరు అక్రమార్కులు తమ వ్యక్తిగత పనులకు అడ్డగోలుగా తవ్వేస్తున్నారు.
కాలువగట్టు మీదుగా అడ్డగోలుగా రవాణా
కొరవడిన అధికార యంత్రాంగం పర్యవేక్షణ
న్యూస్టుడే, మదనపల్లె పట్టణం, గ్రామీణ
గుట్టను తవ్వేసి చదును చేయడానికి తరలించిన మట్టి
వేలు కాదు... లక్షలు కాదు... కోట్ల రూపాయలు ఖర్చు చేసి తవ్విన హంద్రీనీవా కాలువను కొందరు అక్రమార్కులు తమ వ్యక్తిగత పనులకు అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. కరవు ప్రాంతమైన రాయల సీమను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం రూ.3 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి ఈ ప్రాంతానికి హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణాజలాలు తరలించింది. కొంతమంది స్వార్థపరులు పది మందికి ఉపయోగపడే కాలువను ఎక్కడపడితే అక్కడ తవ్వేసి లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు.
హంద్రీనీవా కాలువ మదనపల్లె మండలం కాట్లాటపల్లె వద్ద ప్రవేశించి పట్టణ శివారు ప్రాంతం చిప్పిలి, అంకిశెట్టిపల్లె, కొత్తపల్లెను ఆనుకుని బసినికొండ పక్కగా వెళుతుంది. బసినికొండ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో 150వ మైలురాయి సమీపంలో అటవీ ప్రాంతంలో కాలువను కొందరు అక్రమార్కులు తవ్వేశారు. కాలువను తవ్వే సమయంలో అధికారులు కొన్ని సాంకేతికపరమైన జాగ్రత్తలు పరిగణనలోకి తీసుకుని నిర్మాణం చేపట్టారు. ఇలాంటి కాలువను తవ్వేసి వాహనాలు అటువైపు నుంచి ఇటువైపునకు వెళ్లే విధంగా కాలువకు అడ్డంగా రహదారి ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం కాలువ దయనీయ దుస్థితికి చేరుకుంది. వర్షాలొస్తే కాలువ మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. కాలువ పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి రహదారిని నిర్మించుకుని అక్కడ నుంచి మట్టిని యంత్రాలతో తవ్వేసి భారీ టిప్పర్లతో రవాణా చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరపరాదని కఠిన నిబంధనలున్నప్పటికీ దాన్ని పక్కనపెట్టి మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. ప్రశ్నించే వారు లేకపోవడంతో కొంతమంది ప్రకృతి వనరులను నాశనం చేస్తున్నారు.
హంద్రీనీవా కాలువను పూడ్చి గుట్టలోకి నిర్మించిన రహదారి
నిర్వహణపై నిర్లక్ష్యం
హంద్రీనీవా సుజల స్రవంతి కాలువను పూర్తి చేసి మూడుసార్లు ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు తరలించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఒకసారి నీటిని తీసుకురాగా. అనంతరం కాలువ పూర్తి నిరాదరణకు గురైంది. నీళ్లు విడుదల సమయంలో మాత్రమే అధికారులు కాలువ నిర్వహణపై ఆసక్తి చూపుతున్నారు. మిగిలిన సమయంలో పట్టించుకోవడంలేదు. దీంతో అక్రమార్కులు కాలువను ధ్వంసం చేసి తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు.
ఎలాంటి అనుమతుల్లేవు
- రాజగోపాల్, ఎస్ఈ, హంద్రీనీవా
హంద్రీనీవా కాలువ తవ్వుకుని రహదారి నిర్మించుకోవడానికి ఎలాంటి అనుమతులివ్వలేదు. కాలువను ఎవరైనా తవ్వినట్లయితే చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మట్టి తవ్వకాలకు అనుమతులిచ్చేది లేదు. డీఈతో క్షేత్రస్థాయిలో విచారణ చేయించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మామయ్యనంటూ ఊదరగొట్టేశావ్.. చిన్నారుల భద్రతను గాలికొదిలేశావ్..!
[ 20-04-2024]
జగన్ మామయ్య మాయమాటలకు చిన్నారులూ మోసపోయారు. పిల్లలకు మేనమామనని ఊదరగొట్టి వారి భద్రతను పూర్తిగా గాలికొదిలేశారు. -
అరాచక పాలన పోవాలంటే తెదేపా రావాలి
[ 20-04-2024]
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన పోవాలంటే తెదేపా అధికారంలోకి రావాలని ప్రొద్దుటూరు శాసనసభ తెదేపా అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. -
చిన్నారులతో రాజకీయ ప్రచారం?
[ 20-04-2024]
అధికార పార్టీ ఉల్లంఘనలకు కాదేదీ అనర్హం అన్నట్లు ప్రచారంలోనూ నాయకులు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. చిన్నారుల చేతికి జెండాలిచ్చి ప్రచారం చేయించుకుంటున్నారు. -
వేడుకగా ఊంజల్ సేవ
[ 20-04-2024]
రామయ్య క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం కల్యాణ మండపంలో ఊంజల్ సేవ నిర్వహించారు. -
పాలకుల నిర్లక్ష్యం... ప్రజలకు శాపం
[ 20-04-2024]
పురపాలక హోదా కల్గి పద్దెనిమిదేళ్లు కావస్తున్నా ఇంకా బద్వేలులో పలువార్డులు కనీస సౌకర్యాలకు నోచుకోలేదు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
తెదేపాలో చేరిన పగిడాల దస్తగిరి
[ 20-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. -
ప్రభుత్వ స్థలం... రాచమల్లు పరం
[ 20-04-2024]
వైకాపా ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు, స్థానిక సంస్థల భూములను అధికార పార్టీ నేతలు తమ ఆధీనంలో పెట్టేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, వారి అనుయాయులు, పార్టీ నేతలు, ఓ మోస్తరు నాయకులు, కార్యకర్తలు సైతం మున్సిపల్ స్థలాలపై కన్నేసి వాటిని తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు. -
నిందితుల అరెస్టు
[ 20-04-2024]
బాలఓబిగారి వీధిలో ఈ నెల 17న రాత్రి ఓ మహిళ విషయంలో యువకుల మధ్య జరిగిన ఘర్షణ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఒకటో పట్టణ ఠాణా సీఐ శ్రీకాంత్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?