రామగోపాల్రెడ్డి అనే నేను...!
శాసనమండలి సభ్యుడిగా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తానని భూమిరెడ్డి రామగోపాల్రెడ్డి అన్నారు.
ప్రమాణ స్వీకారం అనంతరం శాసనమండలి అధ్యక్షుడు మోషేన్ రాజుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్రెడ్డి
ఈనాడు డిజిటల్, కడప : శాసనమండలి సభ్యుడిగా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తానని భూమిరెడ్డి రామగోపాల్రెడ్డి అన్నారు. పులివెందుల వాసిగా తనేమిటో నిరూపించుకుని.. తెదేపా బలోపేతానికి, ప్రజానీకానికి సేవలు అందిస్తానన్నారు. శాసనమండలి అధ్యక్షుడు మోషేన్రాజు ఛాంబర్లో ఎమ్మెల్సీగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రామగోపాల్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘2024లో తెదేపా జైత్రయాత్ర ఎమ్మెల్సీ ఎన్నికలతోనే ప్రారంభమైంది. రాయలసీమ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి అధికార పార్టీని ఓడించారు. అన్ని విధాలుగా రెచ్చగొట్టాలని చూసినా ప్రజలు నమ్మకుండా పట్టం కట్టారు’ అని సంతోషం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతానికి సీఎం జగన్ చేస్తున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు. తెదేపా అధికారంలోకి రాగానే రైతుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తెదేపా అధినేత చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని