ఐపీఎల్.. బెట్టింగ్ల సవాల్
అందరూ ఎదురు చూస్తున్న ఐపీఎల్-16 సీజన్ ఘనంగా ప్రారంభం అయింది. 12 వేదికలు..58 రోజులు..74 మ్యాచ్లతో హోరాహోరీగా సాగనుంది.
రాజకీయ నేతలే క్రికెట్ బుకీలు
ప్రత్యేక స్థావరాలు...జోరుగా పందేలు
ప్రొద్దుటూరు కేంద్రంగా రూ.కోట్లల్లో టర్నోవర్
పోలీసుశాఖ నిఘా వైఫల్యంపై విమర్శలు
అందరూ ఎదురు చూస్తున్న ఐపీఎల్-16 సీజన్ ఘనంగా ప్రారంభం అయింది. 12 వేదికలు..58 రోజులు..74 మ్యాచ్లతో హోరాహోరీగా సాగనుంది. అభిమానుల సందడి ఒక ఎత్తయితే.. ధనార్జనే ధ్యేయంగా ఆడిస్తున్న క్రికెట్ పందేలు మరో ఎత్తు. పోలీసుల కంట పడకుండా భారీ ఎత్తున బెట్టింగ్ నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన బుకీలు ప్రత్యేక స్థావరాలు ఏర్పాటు చేసుకుని తమ దందాను సాగించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు బుకీల కదలికలపై నిఘా ఉంచారు. అయితే యాప్ల ద్వారా పందేలు జరుగుతుండటంతో బుకీలను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారుతోంది.
ఈనాడు డిజిటల్, కడప, న్యూస్టుడే - ప్రొద్దుటూరు నేర వార్తలు
క్రికెట్ పందేల నిర్వహణలో రాయలసీమకే ప్రధాన కేంద్రంగా ప్రొద్దుటూరు నిలుస్తోంది. ఇక్కడ అనేక మంది బెట్టింగ్ దందాను సాగిస్తున్నారు. జిల్లాలో ఏ ప్రాంతంలో బెట్టింగ్ జరిగినా అందుకు సంబంధించిన మూలాలు, టర్నోవర్ చివరకు వచ్చి చేరేది ప్రొద్ద్దుటూరుకు చెందిన ప్రధాన బుకీల వద్దకే. ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో పందేల నిర్వహణపై బుకీలు ప్రత్యేక దృష్టి సారించారు. బెట్టింగ్ ఆన్లైన్లో నిర్వహించేందుకు పలువురు వ్యక్తులు ప్రత్యేక సాప్ట్వేర్ను రూపొందించారు. ఆ సాప్ట్వేర్ను రాష్ట్రంలోని పలువురు బుకీలకు ఇస్తున్నారు. పందేల నిర్వాహకులు ఇప్పటికే అనేక మంది యువకులను బెట్టింగ్ వ్యవహారంలోకి లాగినట్లు సమాచారం. 20 ఓవర్లకు జరిగే మ్యాచ్లో బంతి బంతికి పందేలు జరిగే అవకాశం ఉంటుంది. గెలుపు, ఓటములతో పాటు ఒక్కో ఓవర్లో ఎన్ని పరుగులు వస్తాయి, సిక్సర్లు, ఫోర్లు, వికెట్లు తదితర వాటిపైనా ప్రధానంగా పందేలు జరగనున్నాయి.
సిరిపురే... పుట్టినిల్లు
క్రికెట్్ పందేలకు పుట్టినిల్లయిన ప్రొద్దుటూరులో రాజకీయ నేతలే బుకీలుగా అవతారమెత్తారు. అందులో అధికార పార్టీకి చెందిన వారే అధికంగా ఉన్నారు. దీంతో వారిపై పోలీసులు దాడులు చేయలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేరణకుమార్ బాధ్యతలు చేపట్టిన కొత్తలో బెట్టింగ్ రాయుళ్లపై ప్రత్యేక నిఘా ఉంచారు. గతంలో కేసులున్న బుకీలను బైండోవర్ చేశారు. సబ్ డివిజన్లో సుమారు 40 మందికి కౌన్సిలింగ్ ఇచ్చి తహసీల్దార్ ఎదుట హాజరుపర్చారు. వీరిలో అధికార పార్టీకి చెందిన నేతలూ ఉన్నారు. ఒకటో ఠాణా, రెండో ఠాణాల పరిధిలోని అధికార పార్టీ కౌన్సిలర్లును స్టేషన్లకు పిలిపించిన పోలీసులు క్రికెట్ పందేల విషయంలో కౌన్సిలింగ్ నిర్వహించి హెచ్చరించి పంపారు. తర్వాత వారిపై పోలీసులు నిఘా ఉంచలేదన్న ఆరోపణలున్నాయి.
రూ.వంద కోట్ల వరకూ జూదం
ప్రొద్దుటూరులో సుమారు 30 మందికి పైగా ప్రధాన పందేల నిర్వాహకులు, మరో 70 మంది వరకూ సబ్ బుకీలు ఉంటారు. వీరిలో కొందరు బుకీలు తెలంగాణ, బెంగళూరు, గోవా, చెన్నై, తిరుపతి ప్రాంతాల్లో, మరికొందరు స్థానికంగానే ఉంటూ లాడ్జిలు, ఇళ్లు బాడుగకు తీసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఐపీఎల్ సీజన్ మొత్తానికి ప్రొద్దుటూరుకు చెందిన బుకీల వద్ద సుమారు రూ.100 కోట్ల టర్నోవర్ ఉంటుందనే అంచనాలున్నాయి. ఇక్కడున్న పందెం రాయుళ్లకు వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లోని పులివెందుల, కడప, జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి, ఎర్రగుంట్ల, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, ప్రకాశం తదితర ప్రధాన ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని అనేక మంది జూదగాళ్లతో సంబంధాలు ఉన్నాయి. వారికి రాజకీయ నేతల అండదండలు పుష్కలంగా ఉండటంతో ఏళ్ల కాలంగా క్రికెట్ పందేలు నిర్వహిస్తున్నారు.
అప్పుల పాలవుతున్న యువత
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి జల్సా చేయాలన్న ఆలోచనతో అనేక మంది యువకులు తమ జీవితాలను అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. క్రికెట్ బెట్టింగ్ వలలో పడి అప్పుల పాలవుతున్నవారెందరో ఉన్నారు. చేసిన తప్పు మళ్లీ చేస్తూ నష్టపోతున్న యువత దొంగతనాలకు సైతం పాల్పడుతోంది. ఇతరత్రా వ్యసనపరులుగా మారి తప్పుదోవ పడుతున్నారు. కొందరు యువకులు ద్విచక్రవాహనాలు, బంగారం తాకట్టు పెట్టి మరీ బెట్టింగ్ ఆడుతున్నారు. ప్రొద్దుటూరు పట్టణం మట్టిమసీదు వీధిలో అన్నదమ్ములతో పాటు విజయనగరం వీధి, రామేశ్వరం, ఆర్ట్స్ కాలేజీరోడ్డుకు చెందిన బుకీలు బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. జిన్నారోడ్డుకు చెందిన మరో ఇద్దరు అన్నదమ్ములు పెద్ద ఎత్తున పందేలు జరుపుతున్నారు. వీరందరికీ ప్రముఖ రాజకీయ నేతల మద్దతు ఉంది. దీంతో తమకేమీ కాదన్న ధైర్యంతో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీ బిడ్డనని గారాలు... నీ గడ్డపైనే ఘోరాలు!
[ 25-04-2024]
రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా నరేగా నుంచి రూ.26.02 కోట్లతో 349 మట్టి పనులను వైకాపా నేతలకు పంచిపెట్టారు. -
ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం
[ 25-04-2024]
మాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు -
నేడు రాజంపేట, రైల్వేకోడూరులో ప్రజాగళం
[ 25-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరు పర్యటనకు రానున్నారు -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
[ 25-04-2024]
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
పులివెందులలోనూ పరదాల వీరుడే
[ 25-04-2024]
సీఎం జగన్ వైకాపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు గురువారం పులివెందుల రానున్నారు. -
అక్రమాలకు పాల్పడకుండా గెలిచే సత్తా మీకుందా?
[ 25-04-2024]
అక్రమాలకు పాల్పడకుండా పులివెందులలో గెలిచే సత్తా మీకుందా? అని తెదేపా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి సీఎం జగన్కు సవాల్ విసిరారు -
నీళ్లు గరళం... పారిశుద్ధ్యం అధ్వానం
[ 25-04-2024]
నియోజకవర్గ కేంద్రాలు ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు పట్టణ ప్రాంతాల్లోని కాలనీల ప్రజలు కనీస వసతులకు నోచుకోలేక తల్లడిల్లుతున్నారు -
జగన్ పాలనలో పర్యాటకాభివృద్ధి శూన్యం
[ 25-04-2024]
పర్యాటకుల నుంచి ఛార్జీలు, పన్నులు తదితరాల పేరుతో ఆదాయం వస్తున్నా ఆ రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. -
జగనన్న హామీలు...నీటి మూటలు
[ 25-04-2024]
ఆరునూరైనా అభివృద్ధి చేసి తీరుతాం.. మైదుకూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామంటూ జగన్ ప్రభుత్వంలో పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం