నిర్లక్ష్యం ఖరీదు రూ.9 లక్షలు!
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ప్రతి రూపాయి దుర్వినియోగం కాకుండా కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేక చట్టాలతో నిర్వహిస్తోంది.
ప్రజా ధనంపై బాధ్యతారాహిత్యం
గడ్డకట్టిన 200 సిమెంటు బస్తాలు
న్యూస్టుడే, చాపాడు
ఎన్.ఓబాయపల్లె పాఠశాల గదిలో గడ్డ కట్టిన సిమెంటు బస్తాలు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ప్రతి రూపాయి దుర్వినియోగం కాకుండా కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేక చట్టాలతో నిర్వహిస్తోంది. ఏటా వెచ్చించే నిధులకు జవాబుదారీ కోసం సామాజిక తనిఖీ నిర్వహణకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో బయటపడిన దుర్వినియోగ నిధులపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం వారి పనితీరుకు అద్దం పడుతోంది. ప్రజాధనంపై బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం గమనార్హం. ఇటీవల చాపాడు మండలంలో నిర్వహించిన సామాజిక తనిఖీలో నిధుల దుర్వినియోగం వెలుగుచూసింది. నాలుగేళ్ల క్రితం రామసుబ్బమ్మకొట్టాలుకు వెళ్లే దారిలో పంచాయతీరాజ్ కింద సిమెంటు రహదారి పనులు చేపట్టారు. ఆ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. అంతలోనే పీఎంఎస్వై నిధులతో తారురోడ్డు నిర్మాణం చేపట్టారు. సిమెంటు రోడ్డు పేరుతో ప్రారంభించిన పనికి ఉపాధిహామీలో గతేడాది రూ.8.94 లక్షలు బిల్లులు చేసినట్లు సామాజిక తనిఖీలో తేలింది. పనులకు సంబంధించి ఎలాంటి రికార్డులు తమకు చూపలేదని, వర్కు ఐడీ వేరుగా ఉందని, పని ఫొటోలు లేవని డీఆర్పీ అధికారుల ఎదుట ప్రస్తావించారు. సంబంధిత పనులకు సామాజిక తనిఖీ పూర్తి కాకుండానే, దానిపై తారు రోడ్డు ఎలా వేస్తారని పీడీ యదుభూషణ్రెడ్డి పంచాయతీరాజ్ ఏఈని ప్రశ్నించారు. అంతేకాకుండా పూర్తిగా రికవరీకి సిఫారసు చేస్తున్నట్లు రాశారు.
బాధ్యత నాదికాదంటే నాదికాదు
ఎన్.ఓబాయపల్లె పంచాయతీలో సిమెంటు రోడ్ల నిర్మాణానికి ఉపాధి హామీలో 200 బస్తాలు సిమెంటు తోలారు. స్థానిక ప్రాథమిక పాఠశాల గదిలో భద్రపరిచారు. చాలా రోజులు కావడంతో గడ్డకట్టి పనికిరాకుండా పోయాయి. మార్కెట్లో బస్తా సిమెంటు రూ.350 ధర పలుకుతోంది. వేరొక పనికి వినియోగించి ఉంటే నష్టం జరిగేది కాదని పీడీ సభలో ప్రస్తావించారు. దీనిపై పంచాయతీరాజ్ ఎస్ఈకి నివేదిస్తున్నానని, అక్కడే సంజాయిషీ ఇచ్చుకోమని ఆయన ఏఈకి సూచించారు. సిమెంటు బస్తాల విషయమై ఏఈ ఈశ్వరయ్యను వివరణ కోరగా ఆ సమయంలో తాను ఇక్కడ ఇంజినీరుగా పనిచేయలేదని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాలి
[ 25-04-2024]
మండలంలోని శంకవరంలో గురువారం రాత్రి భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోశన్న కుమారుడు బొజ్జా కార్తీక్, తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
తిరుగుబాటు మొదలైంది.. జగన్ ఇంటికి పోవడం ఖాయం: చంద్రబాబు
[ 25-04-2024]
రాయలసీమలో తిరుగుబాటు మొదలైందని.. జగన్ ఇంటికి పోవడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
వైకాపాని పాతాళానికి తొక్కేద్దాం.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం: పవన్
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దాం.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
[ 25-04-2024]
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
[ 25-04-2024]
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
[ 25-04-2024]
సీఎం జగన్ వైకాపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు గురువారం పులివెందుల రానున్నారు. -
మీ బిడ్డనని గారాలు... నీ గడ్డపైనే ఘోరాలు!
[ 25-04-2024]
రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా నరేగా నుంచి రూ.26.02 కోట్లతో 349 మట్టి పనులను వైకాపా నేతలకు పంచిపెట్టారు. -
ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం
[ 25-04-2024]
మాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు -
నేడు రాజంపేట, రైల్వేకోడూరులో ప్రజాగళం
[ 25-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరు పర్యటనకు రానున్నారు -
అక్రమాలకు పాల్పడకుండా గెలిచే సత్తా మీకుందా?
[ 25-04-2024]
అక్రమాలకు పాల్పడకుండా పులివెందులలో గెలిచే సత్తా మీకుందా? అని తెదేపా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి సీఎం జగన్కు సవాల్ విసిరారు -
నీళ్లు గరళం... పారిశుద్ధ్యం అధ్వానం
[ 25-04-2024]
నియోజకవర్గ కేంద్రాలు ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు పట్టణ ప్రాంతాల్లోని కాలనీల ప్రజలు కనీస వసతులకు నోచుకోలేక తల్లడిల్లుతున్నారు -
జగన్ పాలనలో పర్యాటకాభివృద్ధి శూన్యం
[ 25-04-2024]
పర్యాటకుల నుంచి ఛార్జీలు, పన్నులు తదితరాల పేరుతో ఆదాయం వస్తున్నా ఆ రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. -
జగనన్న హామీలు...నీటి మూటలు
[ 25-04-2024]
ఆరునూరైనా అభివృద్ధి చేసి తీరుతాం.. మైదుకూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామంటూ జగన్ ప్రభుత్వంలో పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM