అంతటా అన్యాయం.. కావాలి మీ సాయం
ఇలాంటి సమస్యలు కోకొల్లలుగా యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ ఎదుట బాధితులు ప్రస్తావించి బోరుమన్నారు. వీరిని ఓదార్చి ఆదుకుంటామనే భరోసా ఇచ్చి ముందుకు సాగారు.
పాదయాత్రలో లోకేశ్తో బాధితుల నివేదన
సావధానంగా వింటూ ఓదార్చిన యువ నేత
గ్రామాల్లో అడుగడుగునా మహిళలు హారతులు
ఈనాడు డిజిటల్, కడప, న్యూస్టుడే జమ్మలమడుగు, పెద్దముడియం
జమ్మలమడుగు నగర పంచాయతీ రెవెన్యూ సెక్షన్లో పన్నులు వసూలు చేసే విభాగంలో 20 ఏళ్లుగా పొరుగుసేవల కింద పని చేస్తున్నాను.. వయసురీత్యా మూడేళ్ల కింద ఉద్యోగాన్ని నా కుమారుడికి ఇచ్చారు. గతంలో పులివెందులలో నాగమ్మ హత్య కేసులో న్యాయం చేయాలని దళిత సంఘాలు చేపట్టిన నిరసనలో నేను పాల్గొన్నానని నా కుమారుడిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఎమ్మెల్యే సుధీర్రెడ్డిని కలిసి అన్యాయం గురించి చెబితే వైకాపా కండువా వేసుకుని దళిత ఉద్యమాల్లో పాల్గొనకుండా ఉంటే ఉద్యోగం ఇస్తామన్నారు. నేను ఆ పని చేయకపోవడంతో నా కుమారుడుని ఉద్యోగంలో చేర్చుకోలేదు.
బిర్రు నెల్సన్ కుమార్, జమ్మలమడుగు
గండికోట ప్రాజెక్టు కింద నిర్వాసితులకు కాలనీలు ఏర్పాటు చేశారు. మ్యాపింగ్లో పేర్లు లేవని కొందరికి స్థలాలివ్వలేదు. అందులో మిగిలిన ప్లాట్లు సర్పంచి లక్ష్మీనారాయణరెడ్డి విక్రయించుకున్నారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెట్టిస్తానని బెదిస్తున్నారు. నాకున్న 15 ఎకరాల భూమి ముంపునకు గురైంది. మూడెకరాల్లో వరి నాటాను. చేతికి వచ్చిన పంటను కోసుకుంటామన్నా అధికారులు అంగీకరించడంలేదు. రూ.3 లక్షలు విలువ చేసే మోటారు, పైపులు, సామగ్రిని ముంపు నీటిలో కోల్పోయాను. మాకు చెప్పకుండా నీళ్లు వదలడంతో పంటతో పాటు మోటార్లు మునిగిపోయాయి.
రామసుబ్బారెడ్డి, ఎర్రగుడి, కొండాపురం మండలం
నీరు-చెట్టు కింద తెదేపా హయాంలో చెక్ డ్యాంలు, కాలువల్లో పూడికతీతకు సుమారు రూ.కోటి విలువైన పనులు చేశాను. రూ.60 లక్షలు వరకు బిల్లులొచ్చాయి, ఇంకా రూ.40 లక్షలు పెండింగ్ పెట్టి వైకాపా ప్రభుత్వం వేధిస్తోంది. 12 శాతం వడ్డీతో బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించినా స్పందన లేదు. రూ.2 వడ్డీకి తెచ్చి పనులు చేశాను. అప్పు తీర్చడానికి 8 ఎకరాల భూమిని అమ్మాను. లావనూరులో దుకాణ సముదాయాన్ని సైతం విక్రయించాను, ఇప్పుడు పిల్లల్ని సైతం చదివించలేకపోతున్నాను.
నాగిరెడ్డి, లావనూరు, కొండాపురం మండలం
ఇలాంటి సమస్యలు కోకొల్లలుగా యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ ఎదుట బాధితులు ప్రస్తావించి బోరుమన్నారు. వీరిని ఓదార్చి ఆదుకుంటామనే భరోసా ఇచ్చి ముందుకు సాగారు. పల్లె ప్రాంతాల్లో పేరుకుపోయిన సమస్యలను ప్రజలు ప్రత్యేకించి మహిళలు ప్రస్తావించారు. ఎక్కడ చూసినా తండోపతండాలుగా లోకేశ్కు ఎదురేగి రాతపూర్వకంగా విన్నవించారు. గురువారం ఉదయం పెద్దముడియం మండలం ఎన్.కొట్టాలపల్లె శివారులో విడిది కేంద్రం నుంచి ప్రారంభమైన పాదయాత్ర పెద్దపసుపుల మీదుగా జమ్మలమడుగు బైపాస్ రోడ్డుకు చేరుకుంది. పెద్దపసుపుల గ్రామంలో జనం రహదారుల వెంబడి బారులు తీరడమే కాక భవనాలపై నిలబడి యువనేతకు అభివాదం చేశారు. పెద్దపసుపుల ఎస్సీ కాలనీలో ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాదయాత్ర దారిలో వివిధ గ్రామాల ప్రజలు, ఎస్సీలు, మైనార్టీలు యువనేతను కలిసి సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. మరో ఏడాదిలో రానున్న చంద్రబాబు ప్రభుత్వం అందరి సమస్యలు పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చి ముందుకు సాగారు. 110వ రోజు యువనేత లోకేశ్ 12.3 కి.మీ.,నడిచారు. ఈ నెల 30న జమ్మలమడుగులో బహిరంగ సభ జరగనుంది. అనంతరం ప్రొద్దుటూరు నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించ నుంది. పాదయాత్రలో లోకేశ్న కలిసిన ప్రజలు.. పెద్దముడియంలో జూనియర్ కళాశాల, కల్యాణ మండపం, మైనార్టీలకు షాదీఖానా నిర్మించాలని కోరారు. పెద్దపసుపుల చావిడి వద్ద గ్రామస్థులు లోకేశ్తో మాట్లాడుతూ గ్రామంలో తాగునీరు, డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని, శనగ రైతులకు మద్దతు ధర క్వింటాకు రూ.6,500 ఇప్పించాలని, పంట కాలువలు పూడికతో నిండిపోయాయని, చెరువు చుట్టూ రక్షణ గోడ నిర్మించాలని, జమ్మలమడుగు నుంచి పెద్దపసుపుల వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలన్నారు. జమ్మలమడుగు బైపాస్లో మైనార్టీలు లోకేశ్ను కలిసి సమస్యలను విన్నవించారు. పేద మైనార్టీల కమ్యూనిటీ హాళ్లు నిర్మించాలని కోరారు. ప్రత్యేక శ్మశానవాటిక, ఉర్దూ పాఠశాల నిర్మించాలని, దుల్హన్ పథకాన్ని అందరికీ అందించాలన్నారు. బీడీ కార్మికులకు కాలనీలు ఏర్పాటు చేసి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించాలని కోరారు. ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేసి వడ్డీలేని రుణాలు ఇప్పించాలన్నారు.
దుల్హన్ పథకంలో షరతులన్నీ తొలగిస్తాం
వైకాపా ప్రభుత్వంలో మైనార్టీలు వివక్షకు గురవుతున్నారని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీలకు చెందాల్సిన రూ.5,400 కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించడం, రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ బోర్డు ఆస్తులను వైకాపా నాయకులు అన్యాక్రాంతం చేస్తున్నారని విమర్శించారు. నరసరావుపేటలో మసీదు స్థలం కబ్జాను అడ్డుకున్న ఇబ్రహీంను దారుణంగా నరికి చంపారని ఆరోపించారు. పేద ముస్లింల వివాహానికి కానుకగా ఇచ్చే దుల్హన్ పథకాన్ని అడ్డగోలు నిబంధనలతో నీరుగారుస్తున్నారని, తెదేపా హయాంలో 32,722 మందికి రూ.163.61 కోట్లు అందజేస్తే వైకాపా ప్రభుత్వంలో ఊరికి ఒకరిద్దరు కూడా అర్హత సాధించలేకపోతున్నారని విమర్శించారు. ‘తెదేపా అధికారంలోకి రాగానే దుల్హన్ పథకంలో వైకాపా పెట్టిన షరతులన్నీ తొలగిస్తాం. ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేసి మైనార్టీలకు ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తాం. జమ్మలమడుగు మైనార్టీలకు కమ్యూనిటీ హాలు, ఉర్దూ పాఠశాల, ప్రత్యేక శ్మశానవాటిక నిర్మిస్తాం. అర్హత ఉన్న బీడీ కార్మికులకు ఉచితంగా పక్కా ఇళ్లను కట్టించి ఇస్తాం. రాజోలి ప్రాజెక్టును 2.95 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించి నిర్వాసితులకు పరిహారం ఇస్తాం. రైతులు పండించే ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం’ అని హామీలు ఇచ్చారు. పాదయాత్రలో నేతలు శ్రీనివాసరెడ్డి, లింగారెడ్డి, భూపేష్రెడ్డి, పుత్తా నరసింహారెడ్డి, పుత్తా చైతన్యరెడ్డి, రితీష్రెడ్డి, గోవర్థన్రెడ్డి, హరిప్రసాద్, ప్రవీణ్కుమార్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, నరసింహులునాయుడు, అమరనాథ్రెడ్డి, సీఎం సురేష్, శివనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుగుబాటు మొదలైంది.. జగన్ ఇంటికి పోవడం ఖాయం: చంద్రబాబు
[ 25-04-2024]
రాయలసీమలో తిరుగుబాటు మొదలైందని.. జగన్ ఇంటికి పోవడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
వైకాపాని పాతాళానికి తొక్కేద్దాం.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం: పవన్
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దాం.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
[ 25-04-2024]
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
[ 25-04-2024]
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
[ 25-04-2024]
సీఎం జగన్ వైకాపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు గురువారం పులివెందుల రానున్నారు. -
మీ బిడ్డనని గారాలు... నీ గడ్డపైనే ఘోరాలు!
[ 25-04-2024]
రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా నరేగా నుంచి రూ.26.02 కోట్లతో 349 మట్టి పనులను వైకాపా నేతలకు పంచిపెట్టారు. -
ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం
[ 25-04-2024]
మాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు -
నేడు రాజంపేట, రైల్వేకోడూరులో ప్రజాగళం
[ 25-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరు పర్యటనకు రానున్నారు -
అక్రమాలకు పాల్పడకుండా గెలిచే సత్తా మీకుందా?
[ 25-04-2024]
అక్రమాలకు పాల్పడకుండా పులివెందులలో గెలిచే సత్తా మీకుందా? అని తెదేపా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి సీఎం జగన్కు సవాల్ విసిరారు -
నీళ్లు గరళం... పారిశుద్ధ్యం అధ్వానం
[ 25-04-2024]
నియోజకవర్గ కేంద్రాలు ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు పట్టణ ప్రాంతాల్లోని కాలనీల ప్రజలు కనీస వసతులకు నోచుకోలేక తల్లడిల్లుతున్నారు -
జగన్ పాలనలో పర్యాటకాభివృద్ధి శూన్యం
[ 25-04-2024]
పర్యాటకుల నుంచి ఛార్జీలు, పన్నులు తదితరాల పేరుతో ఆదాయం వస్తున్నా ఆ రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. -
జగనన్న హామీలు...నీటి మూటలు
[ 25-04-2024]
ఆరునూరైనా అభివృద్ధి చేసి తీరుతాం.. మైదుకూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామంటూ జగన్ ప్రభుత్వంలో పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత