ఉప్పు, మసాలా తగ్గిస్తే..దీర్ఘాయుష్మాన్భవ
ఎండ కారణంగా దీర్ఘకాలిక రోగులకు సైతం ఇక్కట్లు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికరక్తపోటు, మధుమేహంతో పాటు కిడ్నీ బాధితులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఎండ కారణంగా దీర్ఘకాలిక రోగులకు సైతం ఇక్కట్లు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికరక్తపోటు, మధుమేహంతో పాటు కిడ్నీ బాధితులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
* సాధారణంగా వేసవిలో 5-6 లీటర్ల నీరు తాగాలి. ఏసీ లేదా చల్లని వాతావరణంలో ఉన్నా సరే ఎక్కువ నీళ్లు తాగుతుండాలి. లేదంటే డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. చాలా మంది కూల్డ్రింక్, జ్యూస్లు తాగుతుంటారు. వాటిలో ఎక్కువ ఫాస్పేట్ ఉండటం వల్ల శరీరంలోని నీటిని గ్రహించి మరింత డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. కిడ్నీ రోగుల పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుందని గుర్తించాలి. ముఖ్యంగా డయాలసిస్పై ఉన్న రోగులు జాగ్రత్తలు పాటించాలి.
* హీమోడయాలసిస్ రోగులు ఎక్కువ నీళ్లు తాగకూడదు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకుంటే రక్తపోటు పెరిగిపోయి అది ఇతర సమస్యలకు దారి తీస్తుంది. ఇలాంటి వారు కొంచెం కొంచెం రోజులో 1.5 నుంచి 2 లీటర్లు మాత్రమే నీటిని తీసుకోవాలి. ఒకసారి 200-300 మిల్లీలీటర్ల కంటే ఎక్కువగా తీసుకోకూడదు. దీనికి బదులు దాహం వేసినప్పుడు ఐస్ ముక్క నోట్లో పెట్టుకుంటే దాహం తీరిపోతుంది. ఇంటి వద్ద పెరిటోనియల్ డయాలసిస్ చేసుకునేవారు వైద్యుల సూచనలతో సాధారణంగా నీళ్లు తాగొచ్చు.
* డయాలసిస్ రోగులు ఉప్పు, మసాలాలు ఎక్కువగా ఉన్న పదార్థాలకు దూరంగా ఉండాలి. వాటిని తినడానికి, జీర్ణం చేయడానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. దీంతో మాటిమాటికి దాహం వేస్తుంది. అప్పుడు నీళ్లు తాగాలని అన్పిస్తుంది. దీంతో చాలామంది నీళ్లు ఎక్కువగా తాగి అనారోగ్యం బారిన పడుతుంటారు.
* డయాలసిస్ రోగులు మామిడి, కర్బూజ, అరటి తదితర పొటాషియం అధికంగా ఉండే పండ్లు కూడా తినకూడదు. దీనివల్ల కిడ్నీలపై భారం పడుతుంది. ఆపిల్, బొప్పాయి లాంటి పొటాషియం లేని పండ్లను తగిన మోతాదులో తీసుకోవచ్చు.
* ఎక్కువగా చల్లటి వాతావరణంలో ఉండేటట్లు చూసుకోవాలి. మధ్య మధ్యలో చల్లటి వస్త్రంతో శరీరాన్ని తడుపుకొంటూ ఉంటే మాటిమాటికి దాహం వేయదు. వీరు భోజనం చేస్తూ నీళ్లు తాగకూడదు. చివరిలో మాత్రమే తాగాలి. ఆ సమయంలోనే ఔషధాలు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా కిడ్నీ వైఫల్య బాధితులు ఎండలో తిరగకుండా చూసుకోవాలి. చల్లని ప్రదేశంలో నీడపాటున ఉండేటట్లు చూసుకుంటూ ఆరోగ్యం కాపాడుకోవాలి.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనానికి ‘జగన్’ షాక్
[ 19-04-2024]
‘విద్యుత్తు రేట్లను పూర్తిగా తగ్గించేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా’.. అంటూ 2019, మే 30న ప్రమాణ స్వీకారం అనంతరం.. అదే వేదికపై నుంచి మొదటి ప్రసంగంలో తానిచ్చిన మాటను సీఎం జగన్మోహన్రెడ్డి తప్పారు. -
తొలి రోజు పది నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం నామినేషన్ల ప్రక్రియ అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లాలో తొలిరోజు పది మంది అభ్యర్థులు 15 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
మాటల వంతెన.. చేతల వంచన!
[ 19-04-2024]
ప్రజల క్షేమమే లక్ష్యం.. వారి కష్టాలు తీరుస్తాం.. అండగా నిలుస్తామని పాదయాత్రలో జగన్ హామీలు ఇచ్చారు. ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు. అయిదేళ్లు గడిచాయి. ఒక్క సమస్యా పరిష్కరించలేదు. -
బండేపల్లి.. బాధలు పట్టేదెవరికి?
[ 19-04-2024]
కనుపూరు కాలువ పరిధిలోని బండేపల్లి బ్రాంచి కెనాల్ ఆయకట్టు కింద సుమారు 25వేల ఎకరాలకుపైనే సాగు ఉండగా- ఆయకట్టు చెరువులకు సాగునీరందక ఏటా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి. -
సమన్వయంతో పనిచేయండి: ఎస్పీ
[ 19-04-2024]
జిల్లాలో పోలీసులు, సెబ్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో అక్రమ మద్యం, నగదును ఇతర ప్రలోభాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ ఆదేశించారు. -
జగన్.. మహిళా మార్టులు ఏవీ!
[ 19-04-2024]
స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు మండలానికో చేయూత మహిళా మార్టు ఏర్పాటు చేస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసింది. -
జగనన్నా.. హామీ మరిచావా!
[ 19-04-2024]
కావలిలో నాన్న హయాంలో నిలిచిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించే బాధ్యత నాదని సీఎం జగన్ హామీ ఇచ్చిరు. ఇందుకు రూ.80 కోట్ల వరకు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈప్రాంతంలోని వారంతా సంతోషించారు. -
రూ.5 కోట్ల బంగారు, వెండి ఆభరణాల పట్టివేత
[ 19-04-2024]
వైయస్ఆర్ జిల్లా గోపవరం మండలంలోని పీపీకుంట చెక్పోస్టు వద్ద గురువారం రూ.5 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్, బద్వేలు గ్రామీణ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
[ 19-04-2024]
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పాలకా.. మా బాధలు కనవా!
[ 19-04-2024]
పట్టణంలోని సంతోష్నగర్లో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. కాలనీలో 700 కుటుంబాలు ఉన్నాయి. రోడ్లు, కాలువలు సక్రమంగా లేవు. చిరుజల్లులు పడినా కుంటలను తలపించేలా నీరు నిలుస్తోంది. -
ఇటు చేరికలు.. అటు ప్రచారం
[ 19-04-2024]
మండల పరిధి విరువూరు, కృష్ణంరాజుపల్లె, కొండాయపాలెం, పంచాయతీల్లో తెదేపా మండల కన్వీనర్ చండ్రా మధుసూదన్రావు ఆధ్వర్యంలో గురువారం తెదేపా అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారం నిర్వహించారు. -
మెము రైలులో దోపిడీ దొంగల బీభత్సం
[ 19-04-2024]
విజయవాడ-గూడూరు మెము రైల్లో ముగ్గురు దుండగులు ప్రయాణికుల వద్ద చరవాణులు, నగదు లాక్కొని దౌర్జన్యానికి దిగిన ఘటన కొండూరుసత్రం వద్ద జరిగింది. -
కోడ్ పట్టని మద్యం దుకాణం ఉద్యోగి
[ 19-04-2024]
ఎన్నికల నిబంధనలను ప్రభుత్వ ఉద్యోగులు కొందరు ఉల్లంఘిస్తున్నారు. స్థానిక మద్యం దుకాణం సెల్స్మెన్ ఆయుబ్ రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయటంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. -
ఆటో బోల్తా- 14 మంది కూలీలకు గాయాలు
[ 19-04-2024]
మండలంలోని తెట్టు రహదారిపై గురువారం ఉదయం ఆటో బోల్తా పడి 14 మందికి గాయాలయ్యాయి. బోగోలు మండలం వెంకటేశ్వరపురం, కావలి మండలం అన్నగారిపాలెం గ్రామాల కూలీలు వలేటివారిపాలెంలో మిరపకాయల కోతకు ఆటోలో వస్తున్నారు. -
24లోగా ఓటర్ల తుది జాబితా
[ 19-04-2024]
జిల్లాలో పెండింగ్లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఈనెల 24వ తేదీ లోగా పరిష్కరించి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!