నిబంధనాలు... సామాన్యులే సమిధలు
మదనపల్లె - బెంగళూరు ప్రధాన రహదారిలో రాకపోకలు సాగించే ప్రైవేటు బస్సులు కనీస నిబంధనలు పాటించడం లేదు. వీటిపై అధికారులు దృష్టి సారించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
వరుస రహదారి ప్రమాదాలతో బెంబేలు
భద్రతా చర్యలు పాటించని ప్రైవేటు వాహనదారులు
ఇటీవల మదనపల్లె మండలం కూకటిమానుగడ్డ వద్ద బోల్తా పడిన ప్రైవేటు బస్సు
న్యూస్టుడే, మదనపల్లె నేరవార్తలు, పట్టణం : మదనపల్లె - బెంగళూరు ప్రధాన రహదారిలో రాకపోకలు సాగించే ప్రైవేటు బస్సులు కనీస నిబంధనలు పాటించడం లేదు. వీటిపై అధికారులు దృష్టి సారించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్క బస్సులో నిబంధనల ప్రకారం కాకుండా 80 నుంచి 90 మంది ప్రయాణికులను ఎక్కిస్తున్నారు. వీటిపై సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. మదనపల్లెకు చెందిన ఓ ప్రైవేటు బస్సు పోలీసులు ఏర్పాటు చేసిన వన్ వే నిబంధనలు సైతం పాటించకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సాధరణంగా 50 నుంచి 55 మందిని మాత్రమే ఎక్కించాల్సి ఉండగా మదనపల్లె -బెంగళూరు రహదారిలో వెళ్తున్న వాహనాలు ఇవేవీ పాటించడం లేదు. దీంతో ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రాణనష్టంతోపాటు పెద్ద సంఖ్యలో క్షతగాత్రులవుతున్నారు.
జిల్లాలో 108 బ్లాక్స్పాట్లు
గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా పోలీసు అధికారులు ఇటీవల జిల్లావ్యాప్తంగా సర్వే నిర్వహించి అత్యధికంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి వాటిని బ్లాక్స్పాట్లుగా నిర్ణయించారు. జాతీయ రహదారులపై 69, రాష్ట్ర రహదారులపై 39 ప్రమాదకర ప్రాంతాలున్నట్లు గుర్తించారు. వీటిలో ఒక్క మదనపల్లె డివిజన్లో 30కి పైగా బ్లాక్స్పాట్లు ఉండడం గమనార్హం. మదనపల్లె డివిజన్లో ఎక్కువ సంఖ్యలో మలుపులు ఉండటం కూడా ప్రమాదాలకు ప్రధాన కారణం.
* మదనపల్లె మండల పరిధిలోని నవోదయ పాఠశాల సమీపంలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే మినీ ప్రైవేటు బస్సు బోల్తాపడి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో 22 మంది గాయపడ్డారు. బస్సు డ్రైవరు తాను నడపకుండా కండక్టరుకు బస్సును ఇవ్వడం, అతను బస్సును వేగంగా నడపడంతో ప్రమాదం జరిగిందని అధికారుల విచారణలో తేలింది.
* గతేడాది డిసెంబరులో శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకుని తిరిగి హిందూపురానికి వెళ్తున్న ప్రైవేటు బస్సు మదనపల్లె మండలం తట్టివారిపల్లె బైపాస్ రోడ్డులో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో బస్సు డ్రైవరు దుర్మరణం పాలవ్వగా, 28 మంది గాయాలపాలయ్యారు. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి రెఫర్ చేశారు. డ్రైవర్ వాహనాన్ని వేగంగా నడుపుతూ నిద్రపోవడంతోనే ప్రమాదం జరిగింది.
* మదనపల్లె మండలం బెంగళూరు రోడ్డులోని కూకటిమానుగడ్డ వద్ద ప్రైవేటు బస్సు కారును ఢీకొట్టి రోడ్డుపక్కన లోతట్టు ప్రాంతంలోకి పడిపోయింది. ప్రమాదంలో 63 మంది ప్రయాణికులు ప్రమాదానికి గురయ్యారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించగా వీరిలో ఏడుగురు తీవ్ర గాయాలపాలవ్వగా, మిగిలినవారికి రక్తగాయాలయ్యాయి. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమైంది.
పైప్రమాదాలన్నీ అతివేగం, వాహన డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే జరిగాయి. రెండేళ్లలో 8 చోట్ల బస్సు ప్రమాదాలు జరగ్గా అందులో 120 మంది వరకు క్షతగాత్రులయ్యారు. ఆరుగురు మృత్యువాతపడ్డారు.
ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
మదనపల్లె డివిజన్లో ఇటీవల పలు ప్రమాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో పోలీసు, రవాణా, రోడ్లు భవనాలశాఖలతో కలిసి ప్రమాదాలకు గల కారణాలపై సర్వే నిర్వహించారు. ప్రమాదాల నివారణకు ఐరన్ సైడ్ వాల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రమాదకర మలుపుల్లో పొదలను తొలగించడంతో పాటు సూచికలు ఏర్పాటు చేస్తున్నాం. నిబంధనలకు మించి ప్రయాణికులను తరలించే వారిపై తనిఖీలు నిర్వహించి అవసరమైతే వాహనాలను జప్తు చేయడంతో పాటు పర్మిట్లు రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తరచూ బెంగళూరు, పుంగనూరు రోడ్డులోనే ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేశాం. ఎవరైనా నిబంధనలు పాటించకుంటే కఠినంగా వ్యవహరిస్తాం.
కేశప్ప, డీఎస్పీ, మదనపల్లె
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
[ 25-04-2024]
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
[ 25-04-2024]
సీఎం జగన్ వైకాపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు గురువారం పులివెందుల రానున్నారు. -
మీ బిడ్డనని గారాలు... నీ గడ్డపైనే ఘోరాలు!
[ 25-04-2024]
రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా నరేగా నుంచి రూ.26.02 కోట్లతో 349 మట్టి పనులను వైకాపా నేతలకు పంచిపెట్టారు. -
ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం
[ 25-04-2024]
మాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు -
నేడు రాజంపేట, రైల్వేకోడూరులో ప్రజాగళం
[ 25-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరు పర్యటనకు రానున్నారు -
అక్రమాలకు పాల్పడకుండా గెలిచే సత్తా మీకుందా?
[ 25-04-2024]
అక్రమాలకు పాల్పడకుండా పులివెందులలో గెలిచే సత్తా మీకుందా? అని తెదేపా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి సీఎం జగన్కు సవాల్ విసిరారు -
నీళ్లు గరళం... పారిశుద్ధ్యం అధ్వానం
[ 25-04-2024]
నియోజకవర్గ కేంద్రాలు ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు పట్టణ ప్రాంతాల్లోని కాలనీల ప్రజలు కనీస వసతులకు నోచుకోలేక తల్లడిల్లుతున్నారు -
జగన్ పాలనలో పర్యాటకాభివృద్ధి శూన్యం
[ 25-04-2024]
పర్యాటకుల నుంచి ఛార్జీలు, పన్నులు తదితరాల పేరుతో ఆదాయం వస్తున్నా ఆ రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. -
జగనన్న హామీలు...నీటి మూటలు
[ 25-04-2024]
ఆరునూరైనా అభివృద్ధి చేసి తీరుతాం.. మైదుకూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామంటూ జగన్ ప్రభుత్వంలో పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత