logo

విభజన హామీల అమలుకు డిమాండు

కేంద్రంలో నరేంద్రమోదీ, రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను నయ వంచనకు గురి చేస్తున్నారని అందులో భాగంగానే విభజన హామీల్లో ఉన్న కడప ఉక్కు పరిశ్రమ,

Published : 28 May 2023 04:22 IST

మారుతీనగర్‌, న్యూస్‌టుడే: కేంద్రంలో నరేంద్రమోదీ, రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను నయ వంచనకు గురి చేస్తున్నారని అందులో భాగంగానే విభజన హామీల్లో ఉన్న కడప ఉక్కు పరిశ్రమ, కేంద్ర విశ్వవిద్యాలయాలకు సంబంధించిన నిధులు అరకొరగా కేటాయిస్తూ మభ్య పెడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. నగరంలో జరుగుతున్న అఖిల భారత విద్యార్థి సమాఖ్య శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విభజన హామీలు సాధించుకోవడానికి విద్యార్థులు నడుం బిగించి పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి, వలరాజు, చలపతి, పవన్‌కుకుమార్‌, శివశంకర్‌, అరుణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని