పూజలు చేస్తూ ప్రాణాలొదిలి...
తాను నిర్మించిన గుడిలో పూజలు చేస్తుండగా విద్యుదాఘాతంతో గంజికుంట చౌడమ్మ (54) మృతి చెందిన ఘటన జమ్మలమడుగు మండలం పొన్నతోట సమీపంలోని జగనన్న కాలనీలో శనివారం చోటుచేసుకుంది.
తాను నిర్మించిన గుడిలోనే విద్యుదాఘాతంతో మహిళ మృతి
గంజికుంట చౌడమ్మ (పాతచిత్రం)
జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్టుడే : తాను నిర్మించిన గుడిలో పూజలు చేస్తుండగా విద్యుదాఘాతంతో గంజికుంట చౌడమ్మ (54) మృతి చెందిన ఘటన జమ్మలమడుగు మండలం పొన్నతోట సమీపంలోని జగనన్న కాలనీలో శనివారం చోటుచేసుకుంది. జమ్మలమడుగు పట్టణంలోని నాగులకట్ట వీధిలో నివాసం ఉంటున్న గంజికుంట చౌడమ్మ, కృష్ణయ్యలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హరికృష్ణకు ఉద్యోగం వస్తే నరసింహస్వామి గుడి నిర్మిస్తానని చౌడమ్మ మొక్కుకున్నారు. కొద్దిరోజుల్లోనే హరికృష్ణకు కోల్కత్తాలో బ్యాంకు ఉద్యోగం వచ్చింది. దీంతో పొన్నతోట సమీపంలోని జగనన్న కాలనీ వద్ద నరసింహస్వామి ఆలయాన్ని నిర్మించి మొక్కు తీర్చుకున్నారు. వారంలో మూడు రోజులు ఆలయాన్ని శుభ్రం చేసి స్వామివారికి పూజలు చేసి సాయంత్రానికి ఇంటికి వచ్చేవారు. శనివారం కూడా ఆలయాన్ని శుభ్రం చేసి స్వామివారికి పూజలు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందారు. సీఐ సదాశివయ్య, ఎస్సై సుబ్బారావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కూలీల ఆటోను ఢీకొన్న కారు
ఒకరి మృతి బీ 18 మందికి గాయాలు
ప్రమాదంలో నుజ్జయిన ఆటో
దువ్వూరు, న్యూస్టుడే : కడప-కర్నూలు జాతీయ రహదారిపై కానగూడూరు సమీపంలో శనివారం ఆటోను కారు ఢీకొన్న ఘటనలో దూదేకుల సుబ్బమ్మ(45) మృతి చెందగా, 18 మందికి గాయాలయ్యాయి. వివరాలు.. చాగలమర్రి మండలం గొడిగెనూరుకు చెందిన కూలీలు దువ్వూరు మండలం బుక్కాయపల్లెలో పనికి వెళ్లి ఆటోలో తిరిగొస్తుండగా మార్గంమధ్యలో కానగూడూరు వద్ద తిరుపతి నుంచి హైదరాబాద్కు వెళుతున్న కారు ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 18 మందిని 108 వాహనంలో చాగలమర్రి కేరళ హాస్పిటల్, ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో జి.లక్ష్మిదేవి, మహబూబ్బీ, బొంతల లక్ష్మిదేవి తీవ్రంగా గాయపడగా మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదేశాలకు పాతర.. ఇసుకాసురుల జాతర!
[ 29-03-2024]
పర్యావరణ అనుమతుల్లేకుండా ఇసుక తవ్వకాలు జరపొద్దని హైకోర్టు స్పష్టం చేసినా అధికార పార్టీ నేతలు ఖాతరు చేయడం లేదు. నిబంధనలను అతిక్రమిస్తే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తీర్పు వెల్లడించినా పోలీసు అధికారులు సైతం వాటిని పట్టించుకోకుండా వైకాపా నేతలకు వత్తాసు పలుకుతున్నారు. -
కీలక నేతలతో చంద్రబాబు భేటీ!
[ 29-03-2024]
మదనపల్లెలో బుధవారం రాత్రి, గురువారం ఉదయం తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ కీలక నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు -
రాయచోటిపై తెదేపా ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
రాయచోటి నియోజకవర్గంపై తెదేపా ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలను పిలిపించుకుని గెలుపు వ్యూహాలపై చర్చించారు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథరెడ్డితో చంద్రబాబు పలుమార్లు మాట్లాడారు -
రెండో రోజూ ప్రయాణికులకు తిప్పలే
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభలకు జిల్లా నుంచి బస్సులు కేటాయించడంతో వరుసగా రెండోరోజూ గురువారం ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. -
ఒంటిమిట్టలో ఆదర్శ పోలింగ్ కేంద్రం
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒంటిమిట్ట ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఆదర్శ పోలింగ్ (పీఎస్-47) కేంద్రం ఏర్పాటు చేశారు. ఉద్యోగుల విధుల నిర్వహణ, ఓటర్లతో మాట్లాడాల్సిన తీరు, ఈవీఎంల పనితీరుపై వీఆర్వోలు, వీఆర్ఏలు, బీఎల్వోలు, సిబ్బందికి అవగాహన కల్పించారు -
దాహమో.... రఘురామ!
[ 29-03-2024]
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది సీఎం జగన్ సొంత ఇలాకాలోని మైదుకూరు పురపాలక సంఘం ప్రజల పరిస్థితి -
మైనార్టీ విద్యకు గ్రహణం!
[ 29-03-2024]
కేంద్ర ప్రాయోజిత నిధులతో నిర్మించతలపెట్టిన ముస్లిం, దూదేకులు, దళిత క్రిస్టియన్ల పిల్లలకు 6 నుంచి 10వ తరగతి వరకు గురుకుల పాఠశాలలు, వసతిగృహ సముదాయాలు ప్రతిపాదనలకే పరిమిత మయ్యాయి -
‘దోషులను వెంట పెట్టుకుంది జగనే’
[ 29-03-2024]
శామాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిని వెంటపెట్టుని తిరుగుతున్నది సీఎం జగనే అని మాజీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు సనసభ తెదేపా అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి ఆరోపించారు -
వివేకా హత్య కేసులో నిందితుడు అవినాష్ ఎంపీ టికెట్టా?
[ 29-03-2024]
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడు వై.ఎస్.అవినాష్రెడ్డిని పక్కన పెట్టుకుని, తన చిన్నాన్నను ఎవరో చంపేశారని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని భాజపా జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్రెడ్డి అన్నారు. -
తాగునీటి గండం..విద్యార్థులకు శాపం
[ 29-03-2024]
దేశ సరిహద్దులో భద్రత ఏర్పాట్లు చూసే సైనికులు... పశువైద్య విజ్ఞానాన్ని అవపోశన పడుతున్న విద్యార్థులను తాగునీటి సమస్య విపరీతంగా వేధిస్తోంది.