ప్రొద్దుటూరు.. పసుపుదండు హుషారు!
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 112వ రోజు బుధవారం ఉత్సాహంగా సాగింది. దారిపొడవునా మహిళలు, యువకులు, వృద్ధులు యువనేతకు నీరాజనాలు పట్టారు.
నారా లోకేశ్కు నాయకులు, కార్యకర్తల ఘన స్వాగతం
దారి పొడవునా నీరాజనాలు పలికిన మహిళలు, యువత
సమస్యలు పరిష్కరించాలని వివిధ వర్గాల నుంచి వినతులు
ఈనాడు డిజిటల్, కడప, న్యూస్టుడే, ప్రొద్దుటూరు, ప్రొద్దుటూరు గ్రామీణ, ప్రొద్దుటూరు వైద్యం
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 112వ రోజు బుధవారం ఉత్సాహంగా సాగింది. దారిపొడవునా మహిళలు, యువకులు, వృద్ధులు యువనేతకు నీరాజనాలు పట్టారు. పార్టీ నేతలు, కార్యకర్తలు గజమాలతో సత్కరించి ఆనందంతో కేరింతలు కొట్టారు. దేవగుడి సుంకులాంబ ఆలయం వద్ద విడిది కేంద్రం ప్రాంగణంలో చేనేత కార్మికులతో సమావేశమైన లోకేశ్ వారి సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రారంభించిన పాదయాత్ర చౌడూరు వద్ద ప్రొద్దుటూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఇక్కడ తెదేపా జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రవీణ్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులురెడ్డి, వీరశివారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, నాయకులు సీఎం సురేష్, ప్రభాకర్రెడ్డి, సుధాకర్రెడ్డి యువనేతకు ఎదురేగి స్వాగతం పలికారు. వివిధ సామాజిక వర్గాల నుంచి సమస్యలపై ఆయనకు వినతులు సమర్పించారు. పత్తిపంట విత్తనాలు నాణ్యత లేక దిగుబడులు పడిపోవడంతో తీవ్రంగా నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. దీనిపై స్పందించిన లోకేష్ తెదేపా అధికారంలోకి వచ్చాక పత్తి రైతుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కమీషన్ల కోసం నాసిరకం విత్తనాల మాఫీయాలో అధికార పార్టీ నాయకులు భాగస్వాములుగా ఉన్నారన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే నాసిరకం విత్తనాలు, పురుగు మందుల మాఫీయాపై ఉక్కుపాదం మోపి ఏపీ సీడ్స్ ద్వారా నాణ్యమైన విత్తనాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.
చేనేత కార్మికుల నుంచి సమస్యల వెల్లువ... శంకరాపురం చేనేత కార్మికులు వృత్తి పరమైన సమస్యలను పరిష్కరించాలని యువగళం పాదయాత్ర చేస్తున్న లోకేశ్కు వినతిపత్రం సమర్పించారు. గత తెదేపా పాలనలో అమలైన వివిధ సంక్షేమ పథకాలు, రాయితీలు, రుణాలు ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయడంతో అర్ధాకలికి గడుపుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలు కొనుగోలు, ఉత్పత్తులపై జీఎస్టీ తొలగించాలన్నారు. వైకాపా పాలనలో బీసీలపై అనేక దాడులు జరుగుతున్నాయని, నందం సుబ్బయ్య దారుణంగా హత్య చేసినట్లు గుర్తు చేశారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి చేనేతలను ఆదుకోవాలని వారంతా విన్నవించారు.
ఇసుక దందాపై ఫిర్యాదులు... పెద్దశెట్టిపల్లెలోని పెన్నానది నుంచి పెద్ద ఎత్తున తవ్వేస్తున్న ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలించి అధికార పార్టీ నాయకులు అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు స్థానికులు వినతిపత్రం అందజేశారు. దీంతో ప్రొద్దుటూరు, రాజుపాళెం మండలాల్లోని పలు గ్రామాలకు నీటి ఎద్దడి నెలకొందన్నారు. నరసింహాపురం వద్దకు చేరిన లోకేశ్ను పలువురు ఎమ్మార్పీఎస్ నేతలు కలిసి ఎస్సీ వర్గీకరణ, సంక్షేమ, ఆర్థిక అభివృద్ధి కోసం న్యాయం చేయాలంటూ వినతిపత్రం అందజేశారు.
తెదేపా శ్రేణుల్లో జోష్... ప్రొద్దుటూరులోకి అడుగు పెట్టిన నారా లోకేశ్ యువగళం పాదయాత్ర...తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. మండల పరిధిలోని ఆయా గ్రామాల నాయకులు తమ వర్గీయులతో వెళ్లి బ్రహ్మరథం పట్టారు. శంకరాపురం, పెద్దశెట్టిపల్లెలో మహిళలు మంగళహారతులు ఇచ్చారు. పాదయాత్రలో తితిదే పాలక మండలి మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్యాదవ్, నాయకులు బోడేల బాబుల్రెడ్డి, కోగటం వీరప్రతాప్రెడ్డి, మధుసూదన్, ఆసం రఘురామిరెడ్డి, నంద్యాల కొండారెడ్డి, మల్లేల లక్ష్మీప్రసన్న, చెమికల పురుషోత్తమరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చూసిన కనులదే భాగ్యం!
[ 23-04-2024]
జగదభిరాముడి కల్యాణానికి జగమే ఊయలూగింది. సర్వమంగళ స్వరూపుడు శ్రీరాముడు, సకల జన శుభధాత్రి సీతాదేవి మూడు ముళ్లబంధంతో ఒక్కటైన వేళ భక్తజనం ఆనందంతో పులకించిపోయారు. -
జగన్ను నమ్మినందుకు నట్టేట ముంచారు!
[ 23-04-2024]
సీఎం జగన్ సొంత జిల్లాలో వైకాపా నుంచి పలువురు కీలక నేతలు వరుసగా జారుకుంటున్నారు. ఏళ్ల తరబడి పార్టీలో సేవలందించి.. సొంత ఆస్తుల్ని అమ్ముకున్న వారు... ఇప్పుడు ఆ పార్టీపై, అగ్రనేతలపై విశ్వాసం కోల్పోయి బయటకొచ్చేస్తున్నారు. -
జగన్ పాలన ఫలితమిది!
[ 23-04-2024]
పదోతరగతి ఫలితాల్లో 86.67 ఉత్తీర్ణత శాతంతో జిల్లా రాష్ట్రంలో 17వ స్థానంలో నిలిచింది. బాలురు 83.65, బాలికలు 89.71 ఉత్తీర్ణత శాతం నమోదుతో బాలికలు పైచేయి సాధించారు. -
బద్వేలులో వైకాపాకు భంగపాటు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల తరుణంలో బద్వేలు నియోజకవర్గ వైకాపాలో విభేదాలు రోడ్డెక్కాయి. -
వాలంటీర్ల కోసం వెతుకులాట!
[ 23-04-2024]
తాము రాజీనామా చేసేందుకు ససేమిరా అంటూ గ్రామ/ వార్డు వాలంటీర్లు వైకాపా నేతలకు కంట కనిపించకుండా తిరుగుతున్నారు. -
బాలికలదే పైచేయి!
[ 23-04-2024]
పదోతరగతి ఫలితాల్లో 92.10 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో జిల్లా మూడో స్థానంలో నిలిచింది. -
స్వామిభక్తిని చాటుకున్న పోలీసులు
[ 23-04-2024]
పోలీసులు పక్షపాత ధోరణిని వీడడంలేదు. వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్ల సందర్భంగా వివక్ష చూపిస్తున్నారు. -
కడపలో ఏకమవుతున్న తెదేపా నేతలు
[ 23-04-2024]
కడపలో తెదేపా నేతలందరూ ఏకతాటిపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
అయిదేళ్ల వైకాపా పాలనలో... సాగునీటి ప్రాజెక్టులకు ఒక్క పైసా విదల్చలేదు
[ 23-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు ఒక్క పైసా విదల్చలేదని భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి విమర్శించారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం... నిధులు నిరుపయోగం
[ 23-04-2024]
జిల్లాలో తొలి చెత్త సంపద మండల కేంద్రం రాజుపాళెంలో నిర్మించి గత ప్రభుత్వంలో జిల్లాకు ఆదర్శంగా ఇక్కడ కంపోస్టు ఎరువులు చేసిన ఘణత ఉంది. -
కూటమి అభ్యర్థుల గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి
[ 23-04-2024]
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉమ్మడి పార్టీల అభ్యర్థులను గెలిపించాలని ఎన్డీఏ అభ్యర్థులు, పార్టీల నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. -
‘పది’లో విద్యార్థుల ప్రతిభ
[ 23-04-2024]
జిల్లాలో సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. -
శాసనసభ స్థానాలకు నామపత్రాల దాఖలు
[ 23-04-2024]
ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఆయా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ నామపత్రాలను సమర్పించారు. -
జగన్ పాలన... అభివృద్ధికి ఆమడ దూరాన
[ 23-04-2024]
బద్వేలు పురపాలకలోని శివారు వార్డులు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. -
ఆర్టీపీపీలో ఉద్యోగోన్నతికి అడ్డదారులు
[ 23-04-2024]
డాక్టర్ ఎంవీఆర్ తాప విద్యుదుత్పత్తి కేంద్రం (ఆర్టీపీపీ)లో కొందరు ఉద్యోగులు ఉద్యోగోన్నతికి అడ్డదారులు తొక్కుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి