logo

కేతు విశ్వనాథరెడ్డి సేవలు మరువలేనివి

సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్ర సలహామండలి సభ్యుడిగా బ్రౌన్‌ గ్రంథాలయానికి ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి చేసిన సేవలు మరువలేనివని.

Published : 01 Jun 2023 04:42 IST

కడప ఎన్‌జీవో కాలనీ, న్యూస్‌టుడే: సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్ర సలహామండలి సభ్యుడిగా బ్రౌన్‌ గ్రంథాలయానికి ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి చేసిన సేవలు మరువలేనివని.. ఆయన మృతి సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రానికి తీరనిలోటని వైవీయూ ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్‌ పేర్కొన్నారు. నగరంలోని సీపీ బ్రౌన్‌ కేంద్రంలో బుధవారం ప్రసిద్ధ కథా రచయిత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ... కేతు కథకునిగా, విద్యావేత్తగా, పరిశోధకునిగా నిరంతర సృజనశీలిగా సుప్రసిద్ధులన్నారు. ఆయన జిల్లా వాసి కావడం మనందరి అదృష్టమన్నారు. ఆయన చేసిన పరిశోధనలు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకమైన అనేక నిఘంటువుల రూపకల్పనకు దారితీసిందన్నారు. రిజిస్ట్రార్‌ వైపీ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ... తాను పుట్టిన నేల, పెరిగిన సమాజం రెండింటిని ప్రధాన వస్తువుగా చేసుకుని అద్భుతమైన కథలు రాశారని.. జిల్లాలో ఉన్న సామాన్యుల జీవితాల్లో సంభవించే అన్ని కోణాలను తనదైన మార్క్సిస్టు దృక్పథంతో ఆవిష్కరించారన్నారు. అనంతరం కేతు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బ్రౌన్‌ సంచాలకులు ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి, సహాయ పరిశోధకులు భూతపురి గోపాలకృష్ణశాస్త్రి, చింతకుంట శివారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని