పనులకు హైరానా... ఆపై జరిమానా
ఎమ్మెల్సీ ప్రస్తావనతో పంచాయతీరాజ్శాఖ ఇంజినీరింగ్ విభాగం సైతం స్పందించింది. పెద్దముడియంకు చెందిన గుత్తేదారుకు నోటీసులివ్వడంతోపాటు భారీ మొత్తంలో జరిమానా సైతం విధించింది.
పులివెందులలో చేతులెత్తేసిన గుత్తేదారు
జాప్యానికి రూ.25లక్షలు కట్టాలంటూ ఆదేశం
అభివృద్ధికి నోచుకోని బిదినంచెర్ల - బోనాల రహదారి
ఈనాడు డిజిటల్, కడప: ఎమ్మెల్సీ ప్రస్తావనతో పంచాయతీరాజ్శాఖ ఇంజినీరింగ్ విభాగం సైతం స్పందించింది. పెద్దముడియంకు చెందిన గుత్తేదారుకు నోటీసులివ్వడంతోపాటు భారీ మొత్తంలో జరిమానా సైతం విధించింది. చివరకు గుత్తేదారు పనులు చేస్తానంటూ ముందుకొచ్చారు. ఇంతకీ పనులు చేస్తారనే నమ్మకం ఇంజినీరింగ్ అధికారులకు కలగడంలేదు. గత అనుభవాలతో సాధారణ ఎన్నికల ముందు పనులు చేయడానికి ఎవరూ సాహసించడంలేదు. బిల్లుల భయం వెంటాడుతోంది. తెదేపా హయాంలో పనులు చేపట్టిన గుత్తేదారులకు చాలా మందికి బిల్లులు చెల్లింపులు జరగలేదు. దీంతో ఎన్నికల ముందు పనులు చేయాలంటే చాలా మంది భయపడుతున్నారు. బిల్లుల విషయంలో ఇంజినీరింగ్ అధికారులు అభయమిస్తున్నా నమ్మని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో నిబంధనల మేరకు అధికారులు గుత్తేదారుపై కొరడా ఝళిపించారు.
* పులివెందుల నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్ధిలో భాగంగా రెండు ప్యాకేజీలు కింద 15 రహదారులకు టెండర్లు పిలిచారు. ప్యాకేజీ-58 కింద 8 రహదారులకు రూ.30.20 కోట్లు, ప్యాకేజీ- 59 కింద ఏడు రహదారులకు రూ.17.20 కోట్ల అంచనాలతో టెండర్లు పిలవగా జిల్లాకు చెందిన గుత్తేదారే పనులు దక్కించుకున్నారు. అందులోనూ సంతృప్తికరమైన ధరలతోనే టెండర్లు చేజిక్కించుకున్నారు. ఈ రెండు ప్యాకేజీల కింద లింగాల, సింహాద్రిపురం మండలాల రహదారులున్నాయి. ఆరు నెలలుగా గుత్తేదారు ఒక్క పని కూడా చేపట్టలేదు. కనీసం యంత్రాలు, మెటీరియల్ సరఫరాలాంటివి చేర్చలేదు. ఈ వ్యవహారంపై జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంలో దుమారం లేవడంతో పీఆర్ ఎస్ఈ శ్రీనివాసరెడ్డి స్పందించి నోటీసులివ్వడంతో పాటు ప్యాకేజీ-58కి రూ.10 లక్షలు, ప్యాకేజీ-59కి రూ.15 లక్షలు వంతున మొత్తం రూ.25 లక్షల జరిమానా విధించారు. ఇదే గుత్తేదారు పులివెందుల నియోజకవర్గం చక్రాయపేటలో రహదారులపై కంకర పరిచేసి తారు వేయకుండా వదిలేశారు. ఫలితంగా నెలల తరబడి ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈఏపీ నిధుల కింద రహదారులను 6 మీటర్ల వెడల్పుతో చేపట్టాల్సి ఉంది. సంబంధిత గుత్తేదారు బ్యాంకు గ్యారంటీ కింద రూ.74 లక్షలు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. టెండరు నిబంధనలు మేరకు పనులు వదులుకోవాలంటే దాదాపు రూ.2 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. స్వయానా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో పరిస్థితిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యమంత్రి జగన్ ఇలాకా పులివెందులలో పనులు సక్రమంగా జరగడంలేదు. టెండర్లు పిలిచి నెలలు గడుస్తున్నా పనులేవీ చేపట్టలేదు. ఇక్కడే ఇలాంటి పరిస్థితి ఉంటే బయట ప్రాంతాల్లో ఎలా ఉంటుంది. రహదారులు అధ్వానంగా ఉన్నాయి. ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. పనులు చేయని గుత్తేదారుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు.
ఇటీవల జరిగిన జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంలో తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్రెడ్డి నిలదీత
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసురుడికి పగ్గాలు.. కన్నీళ్లలో చేనేత మగ్గాలు!
[ 24-04-2024]
‘నేను ఉన్నాను... నేను విన్నాను’ అంటూ సీఎం జగన్ చేనేత కార్మికులను నమ్మించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నట్టేట ముంచారు. గత ప్రభుత్వాల హయాంలో అమలు చేసిన పథకాలకు మంగళం పాడేశారు. -
ఉన్నవి రద్దు చేసి... పక్క జిల్లాలకు సర్దేసి..!
[ 24-04-2024]
‘జాబ్ క్యాలెండరు విడుదల చేసి ఏటా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తాం, డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తాం’ అంటూ హామీలిచ్చి గద్దెనెక్కిన సీఎం జగన్ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. -
రేపు రాజంపేట, రైల్వేకోడూరుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాక
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరుకు రానున్నారు. -
రథంపై దాశరథి... మురిసిన భక్తజన హృది!
[ 24-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం రథోత్సవం కనులపండువగా జరిగింది. -
పెద్దిరెడ్డి కాళ్ల కింద పీలేరు ఆత్మగౌరవం!
[ 24-04-2024]
పీలేరు ఆత్మగౌరవాన్ని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్ల కింద పెట్టారని, ఆయన చేతిలో కీలుబొమ్మగా మారారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, తెదేపా పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిశోర్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. -
గోప్యంగా సునీత ప్రచారం!
[ 24-04-2024]
మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఎన్నికల ప్రచారాన్ని గోప్యంగా నిర్వహిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నేతలను కలుస్తూ మద్దతు కూడగడుతున్న ఆమె.. -
వంతెనకేదీ మోక్షం... జగన్ పాలనే సాక్ష్యం!
[ 24-04-2024]
కడప - తాడిపత్రి జాతీయ రహదారిలో పాపఘ్ని నదిపై వంతెన నిర్మాణం పూర్తికాకపోవడంతో రాకపోకలకు ఇక్కట్లు తప్పడం లేదు. 2021, నవంబరు 20న వరద ప్రవాహనికి ఇక్కడ పాత వంతెన కూలి పోయింది. -
కడపలో చెడ్డీగ్యాంగ్ కలకలం
[ 24-04-2024]
జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ సంచారంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయిదు రోజుల కిందట కడప నగరంలోని ఓ శివారు ప్రాంతంలోని బహుళ అంతస్తు భవనంలోకి ఈ గ్యాంగ్ ప్రవేశించినట్లు సీసీ పుటేజీల ద్వారా తెలిసింది. -
అభ్యర్థుల ఆస్తిపాస్తులివే
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల పర్వం నడుస్తోంది. మంగళవారం పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అఫిడవిట్లు దాఖలు చేస్తూ అందులో ఆస్తులు, కేసుల వివరాలు పేర్కొన్నారు. -
వైకాపా నేత... మార్కెట్ మేత
[ 24-04-2024]
అవినీతి లేని పాలన అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా పసిడిపురి ప్రొద్దుటూరులో తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఏర్పాటు వ్యవహారమంతా ప్రజాప్రతినిధి వర్గీయులకు ఆదాయ వనరుగా మారిందనేది బహిరంగ రహస్యం. -
అయిదేళ్లు జగన్కు అధికారం... ఆవిరైంది జనానికి ఆహ్లాదం..!
[ 24-04-2024]
వైకాపా పాలనలో ఉద్యానవనాలు అంతులేని నిర్లక్ష్యానికి గురయ్యాయి. నిర్వహణను గాలికొదిలేయడంతో పార్కుల పరిస్థితి దయనీయంగా మారింది. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు వచ్చే జనం కూర్చోడానికి కనీసం బల్లల్లేని దుస్థితి నెలకొంది. -
సమస్యలు అనేకం... ప్రభుత్వానిదే పాపం
[ 24-04-2024]
-
పడకేసిన ప్రగతి... జగన్ పాలనలో అథోగతి
[ 24-04-2024]
పురపాలక ఆరో వార్డులోని కొత్తకొట్టాలు, వాసవీనగర్లో సమస్యలు వేధిస్తున్నాయి. ప్రధానంగా కొత్తకొట్టాలు, చిన్నమసీదు వీధుల మధ్య ప్రవహించే ఎర్రచెరువు అలుగువంక స్థానికులకు మురుగుకాలువగా ఉపయోగపడుతోంది. -
ఏఎస్పీ కేశప్పపై ఎంసీసీ అధికారుల విచారణ
[ 24-04-2024]
ఏఎస్పీ కేశప్పపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు అధికారులు, ఎంపీడీవో భానుప్రసాద్ మంగళవారం విచారణ చేపట్టారు. మదనపల్లె మండలం బొమ్మనచెరువులో ఆదివారం -
ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
[ 24-04-2024]
సీఎం జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డిపై వీరపునాయునిపల్లెకు చెందిన నాగప్రసాద్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.