పేదల ఆశలను చిదిమేసిన రాచబాట
ఒంటిమిట్ట మండలంలో సొంతిల్లు లేని పేదలు ఇంటి స్థలాలివ్వాలని ఆరేళ్ల కిందట రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు చేసుకున్నారు.
అయిదేళ్ల కిందట ఇంటి పట్టాల పంపిణీ
అనంతరం జాతీయ రహదారికి అప్పగింత
ప్రత్యామ్నాయ స్థలాలివ్వని యంత్రాంగం
అధికారుల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణ
కడప - రేణిగుంట జాతీయ రహదారి నిర్మాణానికి కేటాయించిన ఇంటి స్థలాలు
సొంత గూడు లేని నిరుపేదలకు అయిదేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం ఇంటి పట్టాలు పంపిణీ చేసింది. పక్కాగృహాలు మంజూరు చేస్తామని ప్రజాప్రతినిధులు వాగ్దానం చేశారు. సొంతింటి కల సాకారం చేయనున్నట్లు అధికారులు సైతం ప్రకటించడంతో గూడు గోడు నుంచి ఉపశమనం లభిస్తుందని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. కేటాయించిన స్థలంలో నూతనంగా జాతీయ రహదారి నిర్మిస్తారని తెలియడంతో లబ్ధిదారుల నోట మాట రాలేదు. ప్రత్యామ్నాయంగా స్థలాలిస్తామని మూడేళ్ల కిందట అధికారులు ప్రకటించినా ఇంతవరకు అతీగతీ లేదు.
న్యూస్టుడే, కడప: ఒంటిమిట్ట మండలంలో సొంతిల్లు లేని పేదలు ఇంటి స్థలాలివ్వాలని ఆరేళ్ల కిందట రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పరిశీలించి అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. ఒంటిమిట్ట రెవెన్యూ గ్రామ పరిధిలోని నర్వకాటిపల్లె-కొత్తమాధవరం గ్రామాల సరిహద్దులో ప్రభుత్వ భూమి సర్వే సంఖ్య 2049లో 428.36 ఎకరాలు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ పేదలకు ఇంటి జాగాలివ్వాలని నిర్ణయించారు. ఒక్కో లబ్ధిదారుకు తొలుత రెండు సెంట్లు ఇవ్వాలని అనుమతి ఇచ్చి అనంతరం ఒకటిన్నర సెంటుకే పరిమితం చేశారు. రహదారుల నిర్మాణానికి 1.77 ఎకరాలు, ఇంటి స్థలాలకు 3.69 ఎకరాలివ్వడానికి ముందుకొచ్చి మొత్తం 246 ప్లాట్లు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్టలో 93 మంది, చెంచుగారిపల్లెలో ఏడుగురు, నర్వకాటిపల్లెలో 30 మంది, కొత్తమాధవరంలో 66, కొండమాచు పల్లెలో 27 మందికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉందని తేల్చారు. మొత్తం 223 మంది లబ్ధిదారులకు 2018లో అప్పటి ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేశారు. ఇంటి పట్టాలొచ్చాయన్న ఆనందం మున్నాళ్ల ముచ్చటగా మారింది.
అదిగో... ఇదిగో అంటూ కాలయాపన: కడప-రేణిగుంట మార్గంలో నూతనంగా నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో పేదలకు ఇచ్చిన 96 ప్లాట్లలో కొత్తగా రాచబాట వేయాలని ప్రతిపాదించారు. ఇక్కడ సర్వే చేసి రహదారి నిర్మాణానికి ఇవ్వాలని ఎన్.హెచ్ఏఐ. ఇంజినీర్ల నుంచి మూడేళ్ల కిందటే ప్రతిపాదనలందాయి. రెవెన్యూ అధికారులు మాత్రం ప్రత్యామ్నాయంపై దృష్టిసారించ లేదు. అప్పటి నుంచి ఇతర ప్రాంతంలో పట్టాలివ్వాలని పేదలు అడుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదు. ఇదిగో...అదిగో కాలయాపన చేస్తున్నారు.
జగనన్న కాలనీ లబ్ధిదారులపై ఉదారత: సర్వే సంఖ్య-2049లో జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. ఇక్కడ సుమారు 183 మందికి ఇంటి స్థలాలు కేటాయించి పక్కాగృహాలను మంజూరు చేయాలని మూడేళ్ల కిందట నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 2020లో పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఈ ప్రాంతంలోనూ జాతీయ రహదారి నిర్మాణంలో 100 ప్లాట్లు కోల్పోవాల్సి వస్తుందని గుర్తించిన అధికారులు వెంటనే ప్రత్యామ్నాయంగా సమీపంలో 2218 సర్వే సంఖ్యలో 2.90 ఎకరాలు కేటాయించి జగనన్న కాలనీ లబ్ధిదారులపై ఉదారత చూపారు. ఇక్కడ ప్రస్తుతం పక్కాగృహాలు నిర్మిస్తున్నారు. అదే 2018లో పట్టాలు ఇచ్చిన వారిలో జాతీయ రహదారి నిర్మాణంలో స్థలాలు కోల్పోతున్న వారికి ఇంతవరకు స్థలాలు చూపకపోవడంపై పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యామ్నాయంగా కేటాయిస్తాం
కడప-రేణిగుంట జాతీయ రహదారి నిర్మాణంలో స్థలాలు కోల్పోయేవారికి ప్రత్యామ్నాయంగా స్థలాలు ఇవ్వడానికి చర్యలు తీసుకొంటాం. ఎంతమంది నష్టపోతారనే సమాచారం సేకరించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు న్యాయం చేస్తాం.
పి.ధర్మచంద్రారెడ్డి, ఆర్డీవో, కడప
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
[ 20-04-2024]
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
జనంపై జగనాసురుడి దండయాత్ర!
[ 20-04-2024]
జగన్ అయిదేళ్ల పాలనలో ఊరికో అసురుడు తయారయ్యాడు... కనిపించిన భూములన్నింటికీ కబ్జా చేశారు... సహజ వనరులను ఇష్టారీతిన కొల్లగొట్టారు... తమ ఆగడాలపై ప్రశ్నించినవారిపై దాడులకు తెగబడ్డారు... హత్యలకు సైతం వెనకాడలేదు. -
హామీలకు మంగళం... ఖాకీలకు ద్రోహం!
[ 20-04-2024]
జిల్లా వ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు సబ్ డివిజన్లు ఉన్నాయి. -
నేడు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నామినేషన్
[ 20-04-2024]
పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈమె ఉదయం 8 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి కడప నగరం ఐటీఐ సర్కిల్కు 9.15 గంటలకు చేరుకుని ర్యాలీ ప్రారంభిస్తారు. -
తెదేపా రాజంపేట నియోజకవర్గ పరిశీలకుడిగా దుర్గాప్రసాద్
[ 20-04-2024]
రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంపై తెదేపా అధిష్ఠానం ప్రత్యేక దృష్టిసారించింది. కడపకు చెందిన కీలక నేత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుధా దుర్గాప్రసాద్ను పరిశీలకుడిగా నియమించింది. -
ఏం చేశావ్ మేలు... కౌలు రైతు కుదేలు..!
[ 20-04-2024]
జిల్లాలో 4,88,672 మంది రైతులుండగా, పంటలు సాగు చేసే నికర భూమి 2,70,985 హెక్టార్లు ఉంది. సొంత పొలం లేని 50 వేల మందికి పైగా కౌలురైతులు సొంతూర్లు, ఇతర ప్రాంతాల్లో మిగతా సాగు దారులకు చెందిన భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. -
సింహ వాహనంపై సీతాపతి
[ 20-04-2024]
ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు శుక్రవారం రాత్రి సింహ వాహనంపై సీతాపతి ఊరేగారు. -
అశ్వవాహనంపై శ్రీరాముడు
[ 20-04-2024]
వాల్మీకిపురంలో తితిదే ఆధ్వర్యంలోని పట్టాభిరాముడి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అశ్వవాహనంపై శ్రీరాముడు అధిరోహించి తిరుమాడవీధుల్లో ఊరేగారు. -
మామయ్యనంటూ ఊదరగొట్టేశావ్.. చిన్నారుల భద్రతను గాలికొదిలేశావ్..!
[ 20-04-2024]
జగన్ మామయ్య మాయమాటలకు చిన్నారులూ మోసపోయారు. పిల్లలకు మేనమామనని ఊదరగొట్టి వారి భద్రతను పూర్తిగా గాలికొదిలేశారు. -
అరాచక పాలన పోవాలంటే తెదేపా రావాలి
[ 20-04-2024]
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన పోవాలంటే తెదేపా అధికారంలోకి రావాలని ప్రొద్దుటూరు శాసనసభ తెదేపా అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. -
చిన్నారులతో రాజకీయ ప్రచారం?
[ 20-04-2024]
అధికార పార్టీ ఉల్లంఘనలకు కాదేదీ అనర్హం అన్నట్లు ప్రచారంలోనూ నాయకులు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. చిన్నారుల చేతికి జెండాలిచ్చి ప్రచారం చేయించుకుంటున్నారు. -
వేడుకగా ఊంజల్ సేవ
[ 20-04-2024]
రామయ్య క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం కల్యాణ మండపంలో ఊంజల్ సేవ నిర్వహించారు. -
పాలకుల నిర్లక్ష్యం... ప్రజలకు శాపం
[ 20-04-2024]
పురపాలక హోదా కల్గి పద్దెనిమిదేళ్లు కావస్తున్నా ఇంకా బద్వేలులో పలువార్డులు కనీస సౌకర్యాలకు నోచుకోలేదు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
తెదేపాలో చేరిన పగిడాల దస్తగిరి
[ 20-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. -
ప్రభుత్వ స్థలం... రాచమల్లు పరం
[ 20-04-2024]
వైకాపా ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు, స్థానిక సంస్థల భూములను అధికార పార్టీ నేతలు తమ ఆధీనంలో పెట్టేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, వారి అనుయాయులు, పార్టీ నేతలు, ఓ మోస్తరు నాయకులు, కార్యకర్తలు సైతం మున్సిపల్ స్థలాలపై కన్నేసి వాటిని తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు. -
నిందితుల అరెస్టు
[ 20-04-2024]
బాలఓబిగారి వీధిలో ఈ నెల 17న రాత్రి ఓ మహిళ విషయంలో యువకుల మధ్య జరిగిన ఘర్షణ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఒకటో పట్టణ ఠాణా సీఐ శ్రీకాంత్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి