విశ్వవిద్యాలయం అభివృద్ధిలో బోధనేతర సిబ్బంది పాత్ర కీలకం
విశ్వవిద్యాలయం కుటుంబసభ్యులంతా నిజాయతీ, నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేస్తే యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే మొదటి స్థానానికి తీసుకెళతానని ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్ పేర్కొన్నారు.
యోవేవి ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్
మాట్లాడుతున్న ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్, పక్కన రిజిస్ట్రార్ వెంకటసుబ్బయ్య
వైవీయూ (కడప), న్యూస్టుడే: విశ్వవిద్యాలయం కుటుంబసభ్యులంతా నిజాయతీ, నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేస్తే యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే మొదటి స్థానానికి తీసుకెళతానని ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్ పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంలో పనిచేసే బోధనేతర సిబ్బందితో గురువారం ఆయన సమావేశమయ్యారు. విశ్వవిద్యాలయం అభివృద్ధిలో బోధనేతర సిబ్బంది పాత్ర కీలకమని, వీరిలో 80 శాతం మంది డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ వంటి అర్హత గలవారుండడం శుభపరిణామన్నారు. సమావేశంలో కులసచివులు ఆచార్య వైపీ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రధానాచార్యులకు అభినందనలు... యోవేవి విద్యార్థుల సమగ్ర ప్రగతికి కృషి చేస్తానని యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రధానాచార్యులు ఆచార్య ఎస్.రఘునాథరెడ్డి పేర్కొన్నారు. వైవీయూ పీజీ కళాశాల ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు గురువారం ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్, కులసచివులు వైపీ వెంకటసుబ్బయ్య, పూర్వ ప్రధానాచార్యులు కె.కృష్ణా రెడ్డి, పాలకమండలి సభ్యురాలు ఆచార్య పద్మ, సీఈ ఎన్.ఈశ్వర్రెడ్డి, ఐటీ సెల్ డైరెక్టర్ ఆచార్య ఎంవీ.శంకర్ పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.
దూరవిద్య సంచాలకుడిగా ఆచార్య కృష్ణారెడ్డి .. యోగి వేమన విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం సంచాలకుడిగా భౌతికశాస్త్ర శాఖ ఆచార్యులు కె.కృష్ణారెడ్డిని నియమించారు. ఈ మేరకు వర్సిటీ ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్, కులసచివులు ఆచార్య వైపీ వెంకటసుబ్బయ్యల నుంచి గురువారం నియామక ఉత్తర్వులను అందుకున్నారు.గతంలో ఈ స్థానంలో పనిచేసిన వృక్షశాస్త్రశాఖ ఆచార్యులు పీఎస్ షావలీఖాన్ విధుల నుంచి రిలీవ్ అయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరవు సీమగా మార్చేసిన పాపం జగన్దే
[ 28-03-2024]
‘నేను రాయలసీమ వాసిని. చిత్తూరు జిల్లాలో పుట్టాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమను రత్నాలసీమగా మారిస్తే, నేడు సాగు, తాగునీరు లేక కరవు సీమగా మార్చేసిన పాపం సీఎం జగన్దే’ అని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. -
సీఎం ఇలాకా.... కుర్చీలు ఖాళీగా!
[ 28-03-2024]
సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సుయాత్ర... అందులోనూ ప్రారంభం అదిరేపోయేలా ఉండాలనుకున్న వైకాపా నేతలు... సీఎం ఇలాకాలోని ఐదు నియోజకవర్గాల మీదుగా సాగే యాత్రలో ప్రత్యేకించి ప్రొద్దుటూరులో కడప పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల నుంచి జనసమీకరణ... -
వైకాపా సేవకు బస్సులు... ప్రయాణికులకు ఇక్కట్లు
[ 28-03-2024]
సీఎం జగన్ బహిరంగ సభలకు జిల్లా నుంచి నాలుగు రోజులపాటు 6 డిపోల నుంచి 90 ఆర్టీసీ బస్సులను తరలించడంతో గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
ముడిపట్టు రాయితీకి మంగళం!
[ 28-03-2024]
వేలాది చేనేత కుటుంబాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. బడుగు జీవుల వెతలు, కన్నీటి ఘోషను పాలకులు ఆలకించడం లేదు. -
భాజపా జమ్మలమడుగు అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి
[ 28-03-2024]
భాజపా జమ్మలమడుగు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, బద్వేలు నియోజకవర్గ అభ్యర్థిగా బొజ్జా రోషన్నకు టిక్కెట్లు లభించాయి. -
సీ విజిల్ ఫిర్యాదులకు సత్వర పరిష్కారం : కలెక్టర్
[ 28-03-2024]
రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి జిల్లాలో సీ విజిల్, ఎన్ కోర్, ఈ ఎస్ఎంఎస్ల ద్వారా అందిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరిస్తున్నామని ఎన్నికల అధికారి, కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. -
అనుమతులతో పనేంటి... తవ్వేద్దాం
[ 28-03-2024]
ఒంటిమిట్ట చెరువులో గత మూడు రోజులుగా అడ్డగోలుగా మట్టి తవ్వేస్తున్నారు. -
ఇళ్లు ధ్వంసం చేయడం సిగ్గుచేటు
[ 28-03-2024]
బద్వేలు పట్టణంలో ఇళ్లు లేని నిరుపేదలైన దివ్యాంగులు దరఖాస్తులు చేసుకుని విసిగి వేసారిపోయారని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మండిపడ్డారు. -
‘రాయలసీమను ఎడారిగా మార్చిన ప్రభుత్వాలు’
[ 28-03-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోగా, అటు 400 స్థానాలు వస్తాయని, ఇటు 175 స్థానాలు వస్తాయని చెబుతూ మభ్యపెడుతున్నారని రాకపా రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్రెడ్డి ఆరోపించారు. -
అనర్హులకు మూల్యంకన విధులపై విచారణ
[ 28-03-2024]
‘సస్పెండైనవారు... పది జవాబుపత్రాలు దిద్దుతారంట’ శీర్షికన బుధవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై పదోతరగతి పరీక్షల జిల్లా పరిశీలకులు వెంకటకృష్ణారెడ్డి స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్