కోళ్ల దాణా సంచుల్లో బీటీ విత్తనాలు
భారత్లో నిషేధించిన బీటీ-3 పత్తి విత్తనాలను రైతులకు దొడ్డిదారిన విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.
అయిదు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న ముఠా
ఇద్దరి అరెస్టు.. పరారీలో ప్రధాన నిందితుడు
2.2 టన్నుల విత్తనాలు, కారు స్వాధీనం: రాచకొండ సీపీ
మాట్లాడుతున్న కమిషనర్ డీఎస్ చౌహాన్, డీసీపీలు మురళీధర్, సాయిశ్రీ, ఏసీపీ వెంకన్న,
ఇన్స్పెక్టర్ సుధాకర్. చిత్రంతో నిందితులు రవీంద్ర, ప్రన్నకుమార్ (మాస్కు ధరించిన వ్యక్తులు)
ఈనాడు- హైదరాబాద్: భారత్లో నిషేధించిన బీటీ-3 పత్తి విత్తనాలను రైతులకు దొడ్డిదారిన విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలకు కోళ్ల దాణా మాటున ఈ విత్తనాలను చేరవేస్తున్న ముఠాలోని ఇద్దరిని బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.70 లక్షల విలువైన 2.2 టన్నుల బీటీ-3 విత్తనాలు, కారు, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అసలు సూత్రధారి అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన నరసింహులు పరారీలో ఉన్నాడు. ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, ఎస్వోటీ డీసీపీ మురళీధర్, ఏసీపీ వెంకన్న నాయక్, ఇన్స్పెక్టర్ సుధాకర్తో కలిసి రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ గురువారం ఎల్బీనగర్లో కేసు వివరాలు వెల్లడించారు.
సంపాదన కోసం అడ్డదారి..
కృష్ణా జిల్లా మైలవరంవాసి రావి ప్రసన్నకుమార్ (42) 20 ఏళ్ల క్రితం నల్గొండ జిల్లా (ప్రస్తుతం యాదాద్రి- భువనగిరి) చౌటుప్పల్కు వలస వచ్చారు. పదేళ్ల క్రితం నవత ఆగ్రో డివిజిన్ పేరుతో చౌటుప్పల్లోనే ఎరువులు, విత్తనాల దుకాణం ప్రారంభించాడు. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడుకు చెందిన గడ్డం రవీంద్రబాబు (42) ఎనిమిదేళ్ల క్రితం మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లా కుహి గ్రామానికి వలస వెళ్లాడు. స్థానికంగా 60 ఎకరాల భూమి లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయంతో పాటు నిషేధిత బీటీ పత్తి విత్తనాలు కొనుగోలు చేసి.. విక్రయించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే చౌటుప్పల్లో ఎరువుల దుకాణం నిర్వహించే ప్రసన్నకుమార్తో పరిచయం ఏర్పడింది. రవీంద్రబాబు ద్వారా విత్తనాలు తెప్పించి.. ఇక్కడి స్థానిక రైతులకు విడిగా విక్రయించేవాడు.
పైన దాణా.. లోపల నకిలీ
ఈ నకిలీ విత్తనాలకు ప్రధాన సూత్రధారి అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన నరసింహులు. గత అయిదేళ్లుగా ఈ నకిలీ దందా నడిపిస్తున్నాడు. ఇతని నుంచే రవీంద్రబాబు నకిలీ విత్తనాలు కొని నాగ్పూర్కు తీసుకెళ్లేవాడు. నరసింహులు పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులకు అనుమానం రాకుండా విత్తనాలను ప్రీమియం చికెన్ ఫీడ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బస్తాల్లో నింపి అయిదు రాష్ట్రాలకు సరఫరా చేస్తాడు. పత్తి సాగు సీజన్ మొదలవ్వగానే రాత్రివేళ సరకు రవాణా చేయిస్తాడు. రైతులకు రెట్టింపు ధరకు అమ్ముతారు.
రెండు రాష్ట్రాల్లో పోలీసుల వేట
చౌటుప్పల్ సహా కొన్ని ప్రాంతాల్లో భారీగా నిషేధిత విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నట్లు ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులకు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ సుధాకర్ బృందం ముఠా కోసం వెతికినప్పుడు కేవలం 24 కిలోలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. దీని వెనుక పెద్ద ముఠా ఉందని అనుమానంతో నిఘా పెట్టిన వారు ఉమ్మడి చిత్తూరు జిల్లా, నాగ్పూర్లో రెండు బృందాలు కొన్నిరోజులు రహస్యంగా ఆరా తీశాయి. ఈ క్రమంలోనే చౌటుప్పల్కు 2,200 కిలోల నకిలీ విత్తనాలు వచ్చినట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. బుధవారం సాయంత్రం ఓ గోదాంలో తనిఖీలు చేశారు. తొలుత చికెన్ ఫీడ్ అని నిందితులు నమ్మించినా వ్యవసాయ శాఖ అధికారులతో పరిశీలన చేయించగా.. అవన్నీ బీటీ విత్తనాలని తేలింది. వెంటనే గడ్డం రవీంద్రబాబు, రావి ప్రసన్నకుమార్లను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న నరసింహులు కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని కమిషనర్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాయంచపై రాములోరి రాజసం
[ 19-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు గురువారం రాత్రి రాయంచపై రాములోరి విహారం కనులపండువగా సాగింది. -
మొదలైన నామినేషన్ల సందడి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ గురువారం మొదలైంది. కలెక్టర్ విజయ రామరాజు ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం కలెక్టరేట్లోని తన ఛాంబరులో నామపత్రాల స్వీకరణను ఆయన ప్రారంభించారు. -
జగన్ను నమ్మాం... నిండా మునిగాం!
[ 19-04-2024]
‘నేను ఉన్నానన్నావ్... నేను విన్నానన్నావ్... నిజమే అనుకున్నాం... నీ మాటలు విని మా బాధలు తెలుసుకుంటావని, పరిష్కారం చూపుతావని ఎంతో ఆశతో నిన్ను గెలిపించాం... తీరా చూస్తే నువ్వు ఉన్నావు... కానీ వినే ఓపికే లేకుండా పోయింది. -
షర్మిలకు మద్దతుగా పులివెందులలో సునీత ప్రచారం
[ 19-04-2024]
కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల తరఫున మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత దంపతులు గురువారం నుంచి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. -
బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మరథం
[ 19-04-2024]
బ్రహ్మాండ నాయకుడైన శ్రీరాముడి రథోత్సవం గురువారం వాల్మీకి క్షేత్రంలో వైభవంగా జరిగింది. ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
మరో వైకాపా ఫ్యానుపై వేటు
[ 19-04-2024]
వృత్తి ఉద్యోగమైనా... నిబంధనలు ఉల్లంఘించి అత్యుత్సాహంతో ముఖ్యమంత్రి జగన్కు ఊడిగం చేసే వారికి తగిన శాస్తి జరుగుతుందనడానికి నిదర్శనమే... ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై వేటు. -
పెద్దిరెడ్డి కుటుంబ దోపిడీని ఓటుతో అడ్డుకోండి
[ 19-04-2024]
రాజంపేట పార్లమెంట్ పరిధిలో పెద్దిరెడ్డి దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ముఖ్యమంత్రి, భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. -
జగన్ బాటలో బస్సులు.. జనానికి ‘ముప్పు’తిప్పలు!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో పల్లెలకు బస్సులు దూరమయ్యాయి... కొత్త బస్సులు రాకపోగా, ఉన్న బస్సులు మరమ్మతులకు గురయ్యాయి... పల్లె బస్సులు రద్దయ్యాయి. అవీ ఎప్పుడొస్తాయో తెలియదు. -
బ్రహ్మోత్సవ శోభ... ఆధ్యాత్మిక ప్రభ
[ 19-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రామయ్య క్షేత్రంలో రెండో రోజు గురువారం ఉదయం యాగశాలలో తితిదే ఆగమ సలహాదారు కల్యాణపురం రాజేష్ భట్టార్ ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు. -
జగనన్న చెప్పాడంటే చెయ్యడంతే
[ 19-04-2024]
మైకు పట్టుకుని రాజకీయ నాయకులేం చెబుతారో ఎన్నికల తర్వాత ఆ పని చేయకపోతే రాజీనామా చేసిపోయే పరిస్థితి రావాలన్నావు. నీ మాటలు నమ్మి ప్రశ్నిస్తే.. కేసులు పెట్టిస్తున్నావ్.. నీ అనునాయులతో ఉరికించి ఉరికించి కొట్టిస్తున్నావ్.. చెప్పిన మాటకు కట్టుబడక పోతే ఎలాగన్నా. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి
[ 19-04-2024]
కేంద్రం, రాష్ట్రంలో తమ ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే చేనేత కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తామని కడప ఎంపీ తెదేపా అభ్యర్థి భూపేష్రెడ్డి, జమ్మలమడుగు అసెంబ్లీ భాజపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డి హామీ ఇచ్చారు. -
జిల్లాకు చేరుకున్న కేంద్ర ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై పర్యవేక్షణకు కేంద్ర ఎన్నికల పరిశీలకులు గురువారం జిల్లాకు చేరుకున్నారు. తొలుత కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, ఎస్పీ కృష్ణారావు, ఇతర జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. -
రాజంపేట వైకాపాలో ముసలం
[ 19-04-2024]
రాజంపేట వైకాపాలో ముసలం పుట్టింది. నియోజకవర్గానికి చెందిన వైకాపా నాయకులు, కార్యకర్తలు ఇటీవల తెదేపాలో చేరారు. ఈ క్రమంలో హైదరాబాద్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో బుధవారం జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు, తెదేపా నాయకుడు పోలి సుబ్బారెడ్డి, సుగవాసి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో నందలూరు, రాజంపేట మండలాలకు చెందిన వైకాపా నేతలు పార్టీలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’