logo

ఇదేనా పేదలపై ప్రభుత్వానికున్న ప్రేమ?

కాలనీల్లో నివసించే పేద ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని జనసేన పార్టీ రాయల, దక్షిణ కోస్తా పార్లమెంటరీ సమన్వయకర్త మైఫోర్స్‌ మహేశ్‌ అన్నారు.

Published : 03 Jun 2023 02:33 IST

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : కాలనీల్లో నివసించే పేద ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని జనసేన పార్టీ రాయల, దక్షిణ కోస్తా పార్లమెంటరీ సమన్వయకర్త మైఫోర్స్‌ మహేశ్‌ అన్నారు. ఇంటింటికీ పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా వారం రోజులుగా మదనపల్లె మండలం బీకే పల్లెలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేశారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి కాలనీలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి జనసేన పార్టీ పేద ప్రజల సంక్షేమం కోసం చేపట్టే సంక్షేమ పథకాలను గురించి వివరించారు. అలాగే కాలనీలో నెలకున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, మురుగు కాలువలు, వీధి దీపాలు వంటి కనీస సౌకర్యాల కల్పనలో ఏ పాలక ప్రభుత్వం దయ చూపలేదని స్థానికులు మహేశ్‌ ఎదుట వాపోయారు. 2004లో ఏర్పడిన ఈ కాలనీకి నేటికీ రోడ్లు లేకపోవడం చాలా బాధాకరమన్నారు. బీకే పల్లెలోని సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, అవసరమైతే జనసేన పార్టీ ఆధ్వర్యంలో పోరాటం సాగించి పేదప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని మహేశ్‌ తెలిపారు. జనసైనికులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని