రెవెన్యూలో బదిలీలలు!
సాధారణ ఎన్నికల్లో క్రియాశీలకమైన రెవెన్యూశాఖలో భారీ ఎత్తున బదిలీలు జరిగాయి. వైయస్ఆర్ జిల్లాలో 36 మండలాలుండగా ఏకంగా 21 చోట్ల తహసీల్దార్ల బదిలీలు జరిగాయి.
ఈనాడు డిజిటల్, కడప
సాధారణ ఎన్నికల్లో క్రియాశీలకమైన రెవెన్యూశాఖలో భారీ ఎత్తున బదిలీలు జరిగాయి. వైయస్ఆర్ జిల్లాలో 36 మండలాలుండగా ఏకంగా 21 చోట్ల తహసీల్దార్ల బదిలీలు జరిగాయి. మరికొన్ని చోట్ల ఉప తహసీల్దార్లను బదిలీ చేశారు. ఇటీవల రెండు దశల్లో కొన్ని బదిలీలు జరగ్గా, మరోసారి తాజాగా చోటుచేసుకున్నాయి. ఏడాది కాలంలోనే మూడుసార్లు బదిలీకి లోనైన అధికారులూ ఉన్నారు. ఎన్నికల తరుణంలో జిల్లాలో అధికార వైకాపా ప్రజాప్రతినిధులు, నేతలు కార్యకలాపాలు ముమ్మరం చేశారు. ప్రభుత్వ భూముల పందేరం, అసైన్మెంట్ కమిటీల ద్వారా లబ్ధిదారుల ప్రతిపాదనలు, గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దే ప్రయత్నాల్లో చెప్పినట్లుగా వినని అధికారులను బదిలీ చేయించుకున్నారు. కొందరు అధికారులు ఎన్నికల తరుణంలో ఇష్టారాజ్యంగా పనులు చేయడానికి ఒప్పుకోవడం లేదు. ప్రభుత్వం మారే పక్షంలో తలెత్తే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ససేమిరా అంటున్నారు. కమలాపురం మండలానికి ఏడాదిలో నలుగురు తహసీల్దార్లు పనిచేయాల్సి వచ్చింది. విజయకుమార్ స్థానంలో అమరేశ్వరి, ఆ తరువాత నారాయణరెడ్డి, తాజాగా అలీఖాన్ నియమితులయ్యారు. కమలాపురం నుంచి మూడు నెలల వ్యవధిలోనే తహసీల్దారు అమరేశ్వరి వల్లూరు మండలానికి బదిలీ జరుగగా, తాజాగా బద్వేలు ఆర్డీవో కార్యాలయానికి బదిలీ చేశారు. ఏడాదిలోనే మూడు స్థానాలు మారాల్సి వచ్చింది. భూదందాలు, ఇసుక వ్యవహరాల్లో సహాయ సహకారాలు అందించనందునే బదిలీలు జరిగినట్లు సమాచారం. ఏడాది తిరక్క ముందే సిద్దవటం తహసీల్దారు బదిలీ కోసం ఉన్నతాధికారులను వేడుకోవడంతో వల్లూరుకు బదిలీ అయ్యారు. మండలంలో నాలుగు వరుసల జాతీయ రహదారి భూసేకరణలో గతంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. వీటిని సరిదిద్దే క్రమంలో సహకరించనందున తహసీల్దారుపై ఒత్తిళ్లు పెరిగిపోవడంతో బదిలీ అనివార్యమైందనే విమర్శలున్నాయి. బ్రహ్మంగారిమఠం మండలంలో పనిచేస్తున్న ఉప తహసీల్దారు కిషోర్కుమార్రెడ్డి ఇప్పటికి ఏడాదిలోపే మూడుసార్లు బదిలీ జరిగింది. అసైన్డ్ భూముల విషయంలో ఇటీవల వైకాపా నేతలు అధికారిపై దౌర్జాన్యానికి దిగారు. ఈ అధికారిని తిరిగి బద్వేలు ఆర్డీవో కార్యాలయానికి బదిలీ చేశారు. బి.కోడూరులో పని చేసిన మధురవాణి వేధింపులు తట్టుకోలేక దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. ఈ స్థానంలో ఉపతహసీల్దారు విద్యాసాగర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. డీటీగా పనిచేస్తున్న జాన్సన్ అనతి కాలంలోనే సీకే దిన్నె, బద్వేలు, బద్వేలు ఆర్డీవో కార్యాలయం. తాజాగా బి.మఠం మండలానికి నియమితులయ్యారు. వేముల మండలంలో పనిచేస్తున్న డీటీ త్రిభువనరెడ్డిని రాజకీయపరంగా లింగాల మండలానికి బదిలీ చేశారు. ఖాజీపేట మండల తహసీల్దారు విషయంలో రాజకీయ బదిలీ జరిగింది. ఇక్కడ వంద ఎకరాల ప్రభుత్వ భూములను కాజేసే యత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందుకు అనుకూలంగా బదిలీలు చేపట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని మండలాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు దీర్ఘకాలికంగా ఒకేస్థానంలో పని చేస్తుండగా వారిని కదిలించకపోవడం విశేషం. అన్నమయ్య జిల్లాలోనూ బదిలీలకు కసరత్తు జరుగుతోంది. ఇక్కడ ఇటీవల కొన్ని బదిలీలు జరిగాయి. తహసీల్దార్లను పక్కన పెట్టి చాలా చోట్ల డీటీలకు బాధ్యతలు అప్పగించారు. డీటీల ద్వారా పనులు చక్కబెట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా కుతంత్రాలు నడుస్తున్నాయి. మరిన్ని బదిలీలు త్వరలో జరిగే అవకాశాలున్నాయి. ఇదే తరహాలో ఎంపీడీవోలు, ఇతరత్రా అధికారుల బదిలీలు చోటుచేసుకుంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాలి
[ 25-04-2024]
మండలంలోని శంకవరంలో గురువారం రాత్రి భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోశన్న కుమారుడు బొజ్జా కార్తీక్, తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
తిరుగుబాటు మొదలైంది.. జగన్ ఇంటికి పోవడం ఖాయం: చంద్రబాబు
[ 25-04-2024]
రాయలసీమలో తిరుగుబాటు మొదలైందని.. జగన్ ఇంటికి పోవడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
వైకాపాని పాతాళానికి తొక్కేద్దాం.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం: పవన్
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దాం.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
[ 25-04-2024]
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
[ 25-04-2024]
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
[ 25-04-2024]
సీఎం జగన్ వైకాపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు గురువారం పులివెందుల రానున్నారు. -
మీ బిడ్డనని గారాలు... నీ గడ్డపైనే ఘోరాలు!
[ 25-04-2024]
రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా నరేగా నుంచి రూ.26.02 కోట్లతో 349 మట్టి పనులను వైకాపా నేతలకు పంచిపెట్టారు. -
ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం
[ 25-04-2024]
మాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు -
నేడు రాజంపేట, రైల్వేకోడూరులో ప్రజాగళం
[ 25-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరు పర్యటనకు రానున్నారు -
అక్రమాలకు పాల్పడకుండా గెలిచే సత్తా మీకుందా?
[ 25-04-2024]
అక్రమాలకు పాల్పడకుండా పులివెందులలో గెలిచే సత్తా మీకుందా? అని తెదేపా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి సీఎం జగన్కు సవాల్ విసిరారు -
నీళ్లు గరళం... పారిశుద్ధ్యం అధ్వానం
[ 25-04-2024]
నియోజకవర్గ కేంద్రాలు ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు పట్టణ ప్రాంతాల్లోని కాలనీల ప్రజలు కనీస వసతులకు నోచుకోలేక తల్లడిల్లుతున్నారు -
జగన్ పాలనలో పర్యాటకాభివృద్ధి శూన్యం
[ 25-04-2024]
పర్యాటకుల నుంచి ఛార్జీలు, పన్నులు తదితరాల పేరుతో ఆదాయం వస్తున్నా ఆ రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. -
జగనన్న హామీలు...నీటి మూటలు
[ 25-04-2024]
ఆరునూరైనా అభివృద్ధి చేసి తీరుతాం.. మైదుకూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామంటూ జగన్ ప్రభుత్వంలో పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM