జిల్లా నేతలకు లోకేశ్ క్లాస్
తెదేపా జిల్లా నేతలకు నారా లోకేశ్ క్లాస్ తీసుకున్నారు. పార్టీపై ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నా... అదే వేగంతో జనంలోకి ఆశించినంతగా చొచ్చుకెళ్లడంలేదని అభిప్రాయపడ్డారు.
ఈనాడు డిజిటల్, కడప: తెదేపా జిల్లా నేతలకు నారా లోకేశ్ క్లాస్ తీసుకున్నారు. పార్టీపై ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నా... అదే వేగంతో జనంలోకి ఆశించినంతగా చొచ్చుకెళ్లడంలేదని అభిప్రాయపడ్డారు. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారనే ఎదురు చూసే ధోరణి సరికాదని.. మీరు స్వతహాగా అధికార పార్టీపై పోరాడే విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ప్రొద్దుటూరు వ్యవహారంలో నేతలు ముందుగా తగువిధంగా స్పందించి ఉంటే వైకాపా ఫ్లెక్సీలు వెలిసేవి కావని, అనంతరం కూడా గట్టిగా ఎదుర్కోలేదనే నేతల వద్ద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన రెండు దఫాలుగా నేతలతో సమావేశమై నేతల పనితీరుపై సమీక్షించారు. విశ్వనాథపురం విడిది కేంద్రంలో పార్టీ జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలు చూస్తున్న మాజీ మంత్రులు అమర్నాథరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి తదితరులతో భేటీ అయ్యారు. శనివారం రాత్రి పాదయాత్ర ముగింపు సందర్భంగా భూమయ్యగారిపల్లె వద్ద మరోమారు నేతలు కలవగా పలు అంశాలపై లోకేశ్ మాట్లాడారు. పాదయాత్రకు జిల్లాలో విశేష స్పందనను మీరే చూస్తున్నారు..కదా అంటూ జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరులో బహిరంగ సభలు విజయవంతం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే తీరుపై జనం తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, బాధితుల తరఫున పోరాడుతూ మన్ననలు పొందాలని సూచించారు. మీరూ.. సందర్భాన్ని బట్టి అధికార పార్టీ అరాచకాలను ఎత్తి చూపాలని.. అందరూ స్వరాన్ని పెంచాలని ఆదేశించారు. పార్టీ అధికారంలోకి వచ్చే విషయంలో ఎలాంటి సందేహం లేదని, కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని.. ఇకపై తరచూ నేతల పనితీరును సమీక్షించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తాను ఉన్నంత వరకే హడావుడి చేసి వెళ్లకుండా పాదయాత్ర అనంతరం కూడా అదే ఒరవడిని కొనసాగించాలని సూచించారు. జిల్లాలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడానికి వ్యూహ రచన చేయాలని, ఇందుకు తన వంతు అన్ని రకాలుగా అండగా ఉంటాననే భరోసా ఇచ్చారు. జిల్లా అభివృద్ధి, ప్రజల కోసం చేపట్టనున్న వివిధ కార్యక్రమాలను జిల్లా సరిహద్దులు దాటకముందే రూట్మ్యాప్ ఇస్తానని, దీన్ని జనంలోకి తీసుకెళ్లాలనే సంకేతాలిచ్చారు. యువతకు ప్రాధాన్యమిస్తామన్నట్లుగానే జమ్మలమడుగు నుంచి భూపేష్రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు సూత్రప్రాయంగా తెలిపారు. ప్రొద్దుటూరు నుంచి ప్రవీణ్కుమార్రెడ్డికి అవకాశం ఇస్తున్నట్లుగానే చెబుతూ మరింతగా పనితీరు మెరుగుపర్చుకోవడం, ప్రజల విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని గట్టిగా సూచించారు. మైదుకూరు అభ్యర్థిగా పుట్టా సుధాకర్యాదవ్ పేరును ఇది వరకే పార్టీ అధినేత చంద్రబాబు అంతర్గతంగా ఖరారు చేశారు. కమలాపురం విషయంలోనూ పుత్తా నరసింహారెడ్డిపై పార్టీ సానుకూలంగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. కడపపై కూడా త్వరలో స్పష్టత ఇచ్చే దిశగా పార్టీ కసరత్తు చేస్తోంది. పాదయాత్ర అనంతరం అభ్యర్థులందరూ నిత్యం ప్రజల్లో ఉండాలని, మేం పడుతున్న కష్టాన్ని తెలుసుకుని ఆ మేరకు మీ స్థాయిలో చొరవ తీసుకోవాలని లోకేశ్ స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు పనితీరు కొలమానంగా ఉంటుందని తేల్చి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
[ 28-03-2024]
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
[ 28-03-2024]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
కరవు సీమగా మార్చేసిన పాపం జగన్దే
[ 28-03-2024]
‘నేను రాయలసీమ వాసిని. చిత్తూరు జిల్లాలో పుట్టాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమను రత్నాలసీమగా మారిస్తే, నేడు సాగు, తాగునీరు లేక కరవు సీమగా మార్చేసిన పాపం సీఎం జగన్దే’ అని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. -
సీఎం ఇలాకా.... కుర్చీలు ఖాళీగా!
[ 28-03-2024]
సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సుయాత్ర... అందులోనూ ప్రారంభం అదిరేపోయేలా ఉండాలనుకున్న వైకాపా నేతలు... సీఎం ఇలాకాలోని ఐదు నియోజకవర్గాల మీదుగా సాగే యాత్రలో ప్రత్యేకించి ప్రొద్దుటూరులో కడప పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల నుంచి జనసమీకరణ... -
వైకాపా సేవకు బస్సులు... ప్రయాణికులకు ఇక్కట్లు
[ 28-03-2024]
సీఎం జగన్ బహిరంగ సభలకు జిల్లా నుంచి నాలుగు రోజులపాటు 6 డిపోల నుంచి 90 ఆర్టీసీ బస్సులను తరలించడంతో గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
ముడిపట్టు రాయితీకి మంగళం!
[ 28-03-2024]
వేలాది చేనేత కుటుంబాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. బడుగు జీవుల వెతలు, కన్నీటి ఘోషను పాలకులు ఆలకించడం లేదు. -
భాజపా జమ్మలమడుగు అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి
[ 28-03-2024]
భాజపా జమ్మలమడుగు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, బద్వేలు నియోజకవర్గ అభ్యర్థిగా బొజ్జా రోషన్నకు టిక్కెట్లు లభించాయి. -
సీ విజిల్ ఫిర్యాదులకు సత్వర పరిష్కారం : కలెక్టర్
[ 28-03-2024]
రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి జిల్లాలో సీ విజిల్, ఎన్ కోర్, ఈ ఎస్ఎంఎస్ల ద్వారా అందిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరిస్తున్నామని ఎన్నికల అధికారి, కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. -
అనుమతులతో పనేంటి... తవ్వేద్దాం
[ 28-03-2024]
ఒంటిమిట్ట చెరువులో గత మూడు రోజులుగా అడ్డగోలుగా మట్టి తవ్వేస్తున్నారు. -
ఇళ్లు ధ్వంసం చేయడం సిగ్గుచేటు
[ 28-03-2024]
బద్వేలు పట్టణంలో ఇళ్లు లేని నిరుపేదలైన దివ్యాంగులు దరఖాస్తులు చేసుకుని విసిగి వేసారిపోయారని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మండిపడ్డారు. -
‘రాయలసీమను ఎడారిగా మార్చిన ప్రభుత్వాలు’
[ 28-03-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోగా, అటు 400 స్థానాలు వస్తాయని, ఇటు 175 స్థానాలు వస్తాయని చెబుతూ మభ్యపెడుతున్నారని రాకపా రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్రెడ్డి ఆరోపించారు. -
అనర్హులకు మూల్యంకన విధులపై విచారణ
[ 28-03-2024]
‘సస్పెండైనవారు... పది జవాబుపత్రాలు దిద్దుతారంట’ శీర్షికన బుధవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై పదోతరగతి పరీక్షల జిల్లా పరిశీలకులు వెంకటకృష్ణారెడ్డి స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు