భలే మంచి చౌక బేరము!
‘వేలంపాట ద్వారా కనీసం రూ.45 లక్షల ఆదాయమొస్తే గానీ కడప నగరపాలక సంస్థ క్రీడామైదానంలో ఎగ్జిబిషన్కు అనుమతి ఇవ్వం’ ఇదీ గతేడాది ఎగ్జిబిషన్ వేలంపాటపై నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం.
రూ.15.75 లక్షలకు ఎగ్జిబిషన్ వేలం పాట ఖరారు
భారీగా ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు
న్యూస్టుడే, కడప నగరపాలక
కడప నగరపాలక క్రీడామైదానం
‘వేలంపాట ద్వారా కనీసం రూ.45 లక్షల ఆదాయమొస్తే గానీ కడప నగరపాలక సంస్థ క్రీడామైదానంలో ఎగ్జిబిషన్కు అనుమతి ఇవ్వం’ ఇదీ గతేడాది ఎగ్జిబిషన్ వేలంపాటపై నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం. ఏడాది అనంతరం తాజాగా అదే నగరపాలక సంస్థ క్రీడామైదానంలో రూ.15.75 లక్షలకే వేలం పాటను ఖరారు చేశారు.! మరీ ఇంత చౌక బేరమా ?అని నగర వాసులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ బేరంలో రూ.50 లక్షల వరకు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. ఎవరేమనుకున్నా తగ్గేదేలా అంటూ నగరపాలక సంస్థ అధికారులు ఈ అంశాన్ని శుక్రవారం జరిగిన స్టాండింగ్ కౌన్సిల్ అజెండాలో చేర్చగా ఆమోదం సైతం పొందడం గమనార్హం.
ఎగ్జిబిషన్ ప్రక్రియ చేపట్టిన ప్రతిసారి భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయన్న అంశం తెరపైకి వస్తోంది. రెండేళ్ల కిందట నామమాత్రపు వేలంపాట నిర్వహించి ఎగ్జిబిషన్ను గుత్తను ఖరారు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. అధికార పార్టీకి చెందిన ఓ యవ నాయకుడికి లబ్ది చేకూర్చడానికి సుమారు రూ.12 లక్షలకే హక్కులు కట్టబెట్టారు. దీనిని ప్రారంభించకముందే ఆయన మృతిచెందడంతో సాంకేతికంగా వేలంపాట గుత్త రద్దయినట్టే. ఎగ్జిబిషన్ నిర్వహణకు తిరిగి కొత్తగా వేలం పాట నిర్వహించాల్సి ఉన్నా నగరపాలక సంస్థ నిర్వహించకుండా గుంటూరుకు చెందిన ఓ సంస్థకు అనుమతులిచ్చింది. ఎగ్జిబిషన్ నిర్వహణకు ఆ సంస్థకు ఇచ్చిన గడువు రెండు నెలలు కాగా, దాదాపుగా 4 నెలలపాటు వినియోగించుకున్నారు. ఈ వ్యవహారంపై నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో పలువురు కార్పొరేటర్లు అధికారులను నిలదీసినా వారు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో 2022లో తిరిగి వేలంపాట నిర్వహించగా హెచ్చుపాట సుమారు రూ.20 లక్షల వద్ద నిలిచిపోయింది. ఈ వేలంపాట పూర్తయిన అనంతరం కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సూర్యసాయిప్రవీణ్చంద్ ఆమోదించలేదు. సంస్థ ఇంజినీరింగ్ అధికారులతో సమాలోచనలు చేసిన అనంతరం వేలంపాట కనీస ధర రూ.45 లక్షలుగా నిర్ణయించారు.
నాటకీయ పరిణామాల నడుమ
2023లో ఎగ్జిబిషన్ నిర్వహణకు మే 17న టెండరు/వేలంపాట నిర్వహించామని అధికారులు చెబుతున్నారు. అత్యంత వివాదాస్పదమైన ఎగ్జిబిషన్ వేలంపాటకు సంబంధించిన ప్రకటనలను గోప్యంగా ఉంచారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందస్తుగా నిర్ణయించినవారే వేలం పాటలో పాల్గొనే విధంగా పరిమిత ప్రచారం చేశారని సమాచారం. వేలంపాట పూర్తయిన అంశాన్ని ఎక్కడా కూడా బయటకు పొక్కనివ్వలేదు. కమిషనర్ సెలవులో ఉండగా ఇన్ఛార్జి కమిషనర్ ఆధ్వర్యంలో శుక్రవారం స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. తృతీయ శ్రేణి పురపాలక సంఘం కంటే తక్కువకు వేలంపాట పాడినా దాన్ని ఖరారు చేశారు. సాధారణంగా నగరపాలక సంస్థ స్థాయీ సంఘం సమావేశాన్ని నెలకొకసారి నిర్వహిస్తారు. మే 16వ తేదీన స్థాయీ సంఘం సమావేశాన్ని నిర్వహించి 17 రోజుల వ్యవధిలోనే తిరిగి స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహిండం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంజినీరింగ్ విభాగం అధికారులకు రూ.50 లక్షల వరకు ముడుపులు అందినట్లు నగరపాలక సంస్థ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై బడా నేతల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వచ్చినందునే తక్కువ ధరకే వేలంపాటను ఖరారు చేయాల్సివచ్చిందని కొందరు అధికారులు చెబుతున్నట్లు సమాచారం.
ప్రొద్దుటూరులో రూ కోటి ఆదాయం
కొన్ని నెలల కిందట ప్రొద్దుటూరు పురపాలక సంఘం ఎగ్జిబిషన్ ఏర్పాటుకు నిర్వహించిన వేలంపాట రూ.కోటి పలికింది. అక్కడ అధిక ధర రావడానికి దసరా ఉత్సవాలు సెలవులు తదితర కారణాలను అధికారులు చూపారు. సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు ఎగ్జిబిషన్ నిర్వహించినా ప్రొద్దుటూరుతో పోల్చుకుంటే కడప నగరంలో పెద్దసంఖ్యలో జనాలొస్తారు. ప్రవేశ రుసుం మొదలుకుని లోపల ఉన్న ప్రతి అంశంలోనూ అక్కడి కంటే కాస్త అధిక ధరలనే వసూలు చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి వచ్చిన ఆదాయంలో కనీసం సగం అంటే రూ.50 లక్షలైనా రావాలని కడప నగరపాలక సంస్థ అధికారులు అంచనా వేయడంలో తప్పులేదు. మరి అలాంటప్పుడు కడపలో రూ.15.75 లక్షలకే ఎగ్జిబిషన్ హక్కులు కట్టబెట్టడం విశేషం.
అన్నీ పద్ధతి ప్రకారమే చేశాం
- రత్నరాజు, ఎస్ఈ, కడప నగరపాలక సంస్థ
ఎగ్జిబిషన్ వేలంపాటకు ప్రచారం చేశాం. పద్ధతి ప్రకారమే నిర్వహించగా ఇద్దరే పాల్గొన్నారు. వేసవి సెలవులు అయిపోతుండడంతో రూ.15.75 లక్షలకే పాట పాడారు. గుత్తే దారు 45 రోజులపాటు ఎగ్జిబిషన్ నిర్వహించుకోవచ్చు. నగరపాలక సంస్థ ఆదాయం కోసమే వేలంపాట ధరను ఆమోదించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
[ 28-03-2024]
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
[ 28-03-2024]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
కరవు సీమగా మార్చేసిన పాపం జగన్దే
[ 28-03-2024]
‘నేను రాయలసీమ వాసిని. చిత్తూరు జిల్లాలో పుట్టాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమను రత్నాలసీమగా మారిస్తే, నేడు సాగు, తాగునీరు లేక కరవు సీమగా మార్చేసిన పాపం సీఎం జగన్దే’ అని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. -
సీఎం ఇలాకా.... కుర్చీలు ఖాళీగా!
[ 28-03-2024]
సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సుయాత్ర... అందులోనూ ప్రారంభం అదిరేపోయేలా ఉండాలనుకున్న వైకాపా నేతలు... సీఎం ఇలాకాలోని ఐదు నియోజకవర్గాల మీదుగా సాగే యాత్రలో ప్రత్యేకించి ప్రొద్దుటూరులో కడప పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల నుంచి జనసమీకరణ... -
వైకాపా సేవకు బస్సులు... ప్రయాణికులకు ఇక్కట్లు
[ 28-03-2024]
సీఎం జగన్ బహిరంగ సభలకు జిల్లా నుంచి నాలుగు రోజులపాటు 6 డిపోల నుంచి 90 ఆర్టీసీ బస్సులను తరలించడంతో గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
ముడిపట్టు రాయితీకి మంగళం!
[ 28-03-2024]
వేలాది చేనేత కుటుంబాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. బడుగు జీవుల వెతలు, కన్నీటి ఘోషను పాలకులు ఆలకించడం లేదు. -
భాజపా జమ్మలమడుగు అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి
[ 28-03-2024]
భాజపా జమ్మలమడుగు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, బద్వేలు నియోజకవర్గ అభ్యర్థిగా బొజ్జా రోషన్నకు టిక్కెట్లు లభించాయి. -
సీ విజిల్ ఫిర్యాదులకు సత్వర పరిష్కారం : కలెక్టర్
[ 28-03-2024]
రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి జిల్లాలో సీ విజిల్, ఎన్ కోర్, ఈ ఎస్ఎంఎస్ల ద్వారా అందిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరిస్తున్నామని ఎన్నికల అధికారి, కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. -
అనుమతులతో పనేంటి... తవ్వేద్దాం
[ 28-03-2024]
ఒంటిమిట్ట చెరువులో గత మూడు రోజులుగా అడ్డగోలుగా మట్టి తవ్వేస్తున్నారు. -
ఇళ్లు ధ్వంసం చేయడం సిగ్గుచేటు
[ 28-03-2024]
బద్వేలు పట్టణంలో ఇళ్లు లేని నిరుపేదలైన దివ్యాంగులు దరఖాస్తులు చేసుకుని విసిగి వేసారిపోయారని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మండిపడ్డారు. -
‘రాయలసీమను ఎడారిగా మార్చిన ప్రభుత్వాలు’
[ 28-03-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోగా, అటు 400 స్థానాలు వస్తాయని, ఇటు 175 స్థానాలు వస్తాయని చెబుతూ మభ్యపెడుతున్నారని రాకపా రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్రెడ్డి ఆరోపించారు. -
అనర్హులకు మూల్యంకన విధులపై విచారణ
[ 28-03-2024]
‘సస్పెండైనవారు... పది జవాబుపత్రాలు దిద్దుతారంట’ శీర్షికన బుధవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై పదోతరగతి పరీక్షల జిల్లా పరిశీలకులు వెంకటకృష్ణారెడ్డి స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
వరంగల్ జకోటియా షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు