మైదుకూరు ఎమ్మెల్యే... ఓ భూ కబ్జాకోరు!
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కడప గడ్డపై స్వరం పెంచారు. అధికార వైకాపాపై పదునైన విమర్శలు, ఆరోపణలతో పాటు సవాళ్లు విసిరారు. అధికార పార్టీ అరాచకాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
అధికారంలోకి రాగానే భూములను వెనక్కి తీసుకుంటాం
యువగళం పాదయాత్రలో నారా లోకేశ్
ఈనాడు డిజిటల్, కడప, న్యూస్టుడే, మైదుకూరు
బహిరంగ సభకు హాజరైన జనం
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కడప గడ్డపై స్వరం పెంచారు. అధికార వైకాపాపై పదునైన విమర్శలు, ఆరోపణలతో పాటు సవాళ్లు విసిరారు. అధికార పార్టీ అరాచకాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యువగళం పాదయాత్ర 115వ రోజు శనివారం మైదుకూరు నియోజకవర్గంలో సాగింది. యువనేత పాదయాత్రకు మైదుకూరు పట్టణం జనసంద్రంలా మారింది. మైదుకూరు శివారు విశ్వనాథపురం నుంచి ప్రారంభమైన పాదయాత్ర మైదుకూరు పట్టణానికి చేరుకుంది. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. పట్టణ వీధుల్లో యువనేతకు వివిధ వర్గాల ప్రజలు భారీగా ఎదురేగి హారతులు పట్టి అపూర్వ స్వాగతం పలికారు. మైదుకూరు నియోజకవర్గం, పురపాలక సంఘం పరిధిలో సమస్యలను ప్రజలు లోకేశ్ దృష్టికి తెచ్చారు. మరో ఏడాదిలో రానున్న చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలు పరిష్కరిస్తుందంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగారు.
పాదయాత్రలో ప్రజలకు అభివాదం చేస్తున్న నారా లోకేశ్
ఎమ్మెల్యేపై ఆరోపణాస్త్రాలు
మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఓ భూ కబ్జాకోరు అని నారా లోకేశ్ ఆరోపించారు. అభివృద్ధిని పట్టించుకోకపోగా ఆయన మైదుకూరును భూకబ్జాలు, కమీషన్లు, ఇసుక దందాకు చిరునామాగా మార్చేశాడని విమర్శించారు. దువ్వూరు మండలం చింతకుంటలో సర్వే నంబరు 1396-2లో 80 ఎకరాల భూమిని ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కలిసి కాజేశారని ఆరోపించారు. దువ్వూరు మండలం ఎర్రబెల్లికి చెందిన అక్బర్ బాషా భూమిని నకిలీ పత్రాలతో సృష్టించి ఆక్రమించేయగా బాధితుడు సెల్ఫీ వీడియోతో ఆత్మహత్యాయత్నం చేశాడని వివరించారు. ఎర్రబల్లెకు చెందిన పాశం లక్ష్మీ నరసింహకు చెందిన సర్వే 612లో రెండెకరాల విస్తీర్ణాన్ని ఎమ్మెల్యే బామ్మర్ది నారాయణరెడ్డి పేరుపై తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. బాధితుడికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చినా ఇప్పటివరకు ఆ భూమిని తిరిగి అప్పగించలేదని వివరించారు. ఖాజీపేట, మైదుకూరు, చాపాడు మండలాల్లో అసైన్మెంట్ కమిటీల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా భూములు కొట్టేయడానికి వ్యూహ రచన చేశారని విమర్శించారు. రాజోలి ఆనకట్ట ఎత్తిపోతల పథకం తదితర పనులకు దక్కించుకున్న గుత్తేదారుల నుంచి భారీగా కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. చివరకు ఆటవీ భూముల్ని సైతం కాజేశారని.. వీటిపై పుట్టా సుధాకర్ యాదవ్ న్యాయ పోరాటం చేశారని ప్రశంసించారు. నంద్యాలంపేటలో సర్వే నంబరు 506బిలో 104 ఎకరాల భూమి అక్రమంగా ఆక్రమించి ఇనుప కంచె వేశారని, న్యాయస్థానంలో విచారణ అనంతరం ఆరు నెలల్లోపు భూమిని స్వాధీనం చేసుకోలేదన్నారు. చాపాడు మండలం వెదురూరులో 12 ఎకరాల్లో ఇసుక తవ్వకానికి అనుమతులు తీసుకుని వైకాపా నేతలు వంద ఎకరాల్లో ఇసుక తవ్వేశారన్నారు. మైదుకూరుకు సీఎం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నారు.
నిరుద్యోగ భృతిపై పాదయాత్రలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న యువకులు
లోకేశ్ ఎదుట సమస్యల వెల్లువ
* గతేడాది 8 ఎకరాలు అరటితోట సాగు చేశా. రూ.12 లక్షలు పెట్టుబడి అయింది. గెలలు మాత్రం చెట్లకే ఉన్నాయి. ధర లేకపోవడంతో కోస్తే ఖర్చులకు కూడా రావని వదిలేశా. ఇల్లు కట్టుకోవడానికి ఇసుక కూడా అందుబాటులో ఉండటం లేదు’ అని చాపాడుకు చెందిన చెన్నారెడ్డి వివరించారు.
* మైదుకూరుకు చెందిన షేక్ హబీదా మాట్లాడుతూ ‘నాలుగు నెలల కింద నా కూతురికి వివాహం చేశా. దుల్హన్ కింద ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేశాను. అప్పును తీర్చేందుకు చీటీలు కడుతున్నా. నాకు భర్త లేడు. కనీసం తండ్రి లేని కూతుళ్లకైనా నిబంధనలు సడలించి దుల్హన్ అమలు చేస్తే బాగుంటుందని కోరారు.
* వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ..‘నేను పాత ఇనుము కొనుగోలు చేసి వ్యాపారం చేస్తుంటా. రెండేళ్ల కింద వైకాపా నేతలు వచ్చి నా దుకాణం తొలగించారు. నేను కొనుగోలు చేయని ఇనుమును కొనుగోలు చేశానని బెదిరించారు. అవసరమైతే సీసీ కెమెరాలు చెక్ చేసుకోండని చెప్తే.. ఏంట్రా చూసేదని దౌర్జన్యం చేశారు.వైకాపా నేతలు కాలువల్లో పూడిక తీయకుండా బిల్లులు తీసుకున్నారు. దాన్ని ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టినందుకు నా కాలు విరగ్గొట్టారు. నాపై దాడి జరిగిందని పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు పెడితే.. తిరిగి నాపైనే కేసు పెట్టి జైల్లో పెట్టారు’ అని విలపించారు.
* విమల మాట్లాడుతూ ‘పింఛను ఇవ్వకుండా ఇచ్చినట్లు రాసుకున్నారు. నా భర్త చనిపోయి మూడేళ్లయింది. నాకు రేషన్ కార్డు లేదు. పింఛను రెండేళ్లుగా వస్తున్నట్లుగా పుస్తకంలో రాశారు. నాకు ఇంటి పట్టా కూడా ఇవ్వలేదు. సెంటు స్థలం పట్టా వచ్చిందని సచివాలయం పుస్తకంలో రాశారు’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు.
నేటి పాదయాత్ర కార్యక్రమాలు : మైదుకూరు నియోజకవర్గంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు భూమయ్యగారిపల్లి విడిది కేంద్రంలో బలిజ సామాజిక వర్గ ప్రతినిధులతో ముఖాముఖి.
* సాయంత్రం 4 గంటలకు భూమయ్యగారిపల్లి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనమామ వేషం... అక్కచెల్లెమ్మలకు మోసం
[ 18-04-2024]
సీఎం జగన్... రాష్ట్రంలోని విద్యార్థులందరికీ తాను మేనమామని గొప్పగా చెప్పుకొంటుంటారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేవిధంగా చేస్తానంటూ బీరాలు పలుకుతుంటారు. ఇందుకోసం అన్ని రకాల సాయాలు చేస్తానంటూ వాగ్దానాలు ఇచ్చేస్తుంటారు. -
ఎన్నికల రణరంగానికి వేళాయె!
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తలపడనున్న అభ్యర్థులు గురువారం నుంచి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంటు స్థానానికి, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు(ఎస్సీ), వైయస్ఆర్ జిల్లా కడప పార్లమెంటు స్థానంతో పాటు కడప, పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు, బద్వేలు(ఎస్సీ), జమ్మలమడుగు, మైదుకూరు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై మైనార్టీల తిరుగుబాటు
[ 18-04-2024]
జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై ముస్లిం మైనార్టీలు తీవ్ర స్థాయిలో తిరుగుబాటు చేశారు. జమ్మలమడుగులోని ఆయన కార్యాలయాన్ని బుధవారం రాత్రి వారంతా ముట్టడించి నిరసన తెలిపారు. -
జగన్ దంపతులకు తెలియకుండా వివేకా హత్య జరిగి ఉండదు
[ 18-04-2024]
సీఎం జగన్ దంపతులకు తెలియకుండా మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగి ఉండదని భాజపా జమ్మలమడుగు అభ్యర్థి ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక భాజపా కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. -
రాజంపేటలో వైకాపాకు భారీ షాక్!
[ 18-04-2024]
రాజంపేట నియోజకవర్గంలో వైకాపాకు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే అధిక సంఖ్యలో నాయకులు తెదేపాలో చేరగా, మరికొందరు నేతలు బుధవారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో మంగళగిరిలో చేరారు. -
దాశరథి...శేష వాహన విహారి
[ 18-04-2024]
శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో తొలిరోజు బుధవారం రాత్రి సీతారాములు ప్రత్యేక అలంకరణలో శేష వాహనంపై భక్తులకు దర్శన మిచ్చారు. -
కాస్త మిగిల్చారు
[ 18-04-2024]
మళ్లీ వైకాపా అధికారంలోకొస్తే ఇక్కడ గగ్గితిప్ప కొండ ఉండేదని మా పిల్లలకు చెప్పాల్సి వస్తుందని ఇటీవల అధికార వైకాపా నుంచి తెదేపాలో చేరిన ఓ నాయకుడు అన్న మాటలవి. -
వైకాపా అండదండలు... నేతలే అనకొండలు..!
[ 18-04-2024]
అధికార వైకాపా అండదండలతో నేతలు అనకొండల్లా కొండలు, గుట్టలను మింగేస్తున్నారు. ‘పచ్చని చెట్లను నరికేస్తే మళ్లీ నాటుకోవచ్చు. అదే కొండలు, గుట్టలను కొల్లగొడితే వాటి ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉంది’ అని న్యాయస్థానాలు అక్షింతలు వేసినా, ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా అధికార నేతల చెవికెక్కడంలేదు. -
ప్రతి హృది నిండుగా... పురుషోత్తముని పండగ
[ 18-04-2024]
ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు ధ్వజారోహణం క్రతువు వైభవంగా జరిగింది. -
ఇదేం సన్నద్ధత
[ 18-04-2024]
ఒంటిమిట్ట కోదండరామాలయం బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని గత మూడు నెలలుగా తితిదే అధికారులు తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. -
ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు తయారీ
[ 18-04-2024]
ఒంటిమిట్ట రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 22న నిర్వహించే సీతారాముల కల్యాణం తిలకించడానికి తరలిరానున్న భక్తులకు పంపిణీ చేయడానికి ముత్యాల తలంబ్రాలు ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. -
పోతన రచనలు జన రంజకం
[ 18-04-2024]
బమ్మెర పోతన రచనలు జన రంజకమై చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయినట్లు తితిదే దత్సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనందతీర్థాచార్యులు పేర్కొన్నారు. ఒంటిమిట్టలో బుధవారం పోతన జయంతి వేడుకలను నిర్వహించారు. -
తొలిప్రయత్నంలోనే సివిల్స్లో 475 ర్యాంకు
[ 18-04-2024]
సివిల్స్లో కడప యువకుడు హరిప్రసాద్రాజు మెరిశాడు. తొలిప్రయత్నంలోనే 475వ ర్యాంకుతో సత్తాచాటాడు. వీరి సొంతూరు రాజంపేట ములక్కాయలపల్లె గ్రామం కాగా, ప్రస్తుతం కడప బాలాజీనగర్ నివాసముంటున్నారు. -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
[ 18-04-2024]
ఎన్నికల ప్రక్రియలో అతి కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు విజయరామరాజు తెలిపారు. -
సెక్యూరిటీ గార్డే శవపరీక్ష నిపుణుడు
[ 18-04-2024]
మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఎంత మంది ఎంఎన్వోలు, జీడీఏ సిబ్బంది వచ్చినా శవపరీక్షలు మాత్రం భద్రతా సిబ్బందే చేయాల్సి వస్తోంది. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రెడ్డెప్ప గత కొంతకాలంగా శవపరీక్ష విధులు నిర్వహిస్తున్నారు. -
చేనేతల సమస్యల పరిష్కారానికి కృషి : నల్లారి
[ 18-04-2024]
చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి హామీ ఇచ్చారు. -
ఉప కారాగారంలో రిమాండు ఖైదీ మృతి
[ 18-04-2024]
మద్యం కేసులో అరెస్టు అయిన నిందితుడు మదనపల్లె ఉప కారాగారంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం ముతుకూరుకు చెందిన మొగిలప్ప (67) వ్యవసాయ కూలి. -
రామయ్యను దర్శించుకున్న శారదాపీఠం ఉత్తరాధికారి
[ 18-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని విశాఖపట్నం శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి బుధవారం సందర్శించారు. -
కడప ఎంపీ స్థానానికి పోటీ చేయాలంటే రూ.40 కోట్ల ఖర్చు
[ 18-04-2024]
కడప పార్లమెంటుకు పోటీ చేయడానికి రూ.40 కోట్ల వరకు ఖర్చవుతుందని, కాంగ్రెస్ పార్టీ మహా అయితే రూ.10 లక్షలు ఇస్తుందని, మిగిలిన డబ్బులు అభ్యర్థి వైఎస్ షర్మిల ఎక్కడి నుంచి తెస్తారని వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి రమేశ్రెడ్డి ప్రశ్నించారు.