logo

గ్యాస్‌ లీకై మహిళ సజీవ దహనం

నగరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఓ ఇంటి రెండో అంతస్థులో గ్యాస్‌ లీకై మంటలు వ్యాపించి అందులో చిక్కుకున్న గంగమ్మ (48)  సజీవ దహనమయ్యారు.

Published : 06 Jun 2023 02:41 IST

అగ్నిప్రమాదంలో కాలిపోయిన ఇల్లు

కడప, నేరవార్తలు, న్యూస్‌టుడే: నగరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఓ ఇంటి రెండో అంతస్థులో గ్యాస్‌ లీకై మంటలు వ్యాపించి అందులో చిక్కుకున్న గంగమ్మ (48)  సజీవ దహనమయ్యారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే గంగమ్మ మంటల్లో చిక్కుకుని కేకలు వేస్తున్నారు. వెంటనే ఆమెను బయటకు తీసి 108లో రిమ్స్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి మంటలు ఆర్పివేశారు. ఎస్‌.ఐ.రంగస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని