logo

లోకేశ్‌పై వ్యక్తిగత విమర్శలు సరికాదు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రొద్దుటూరులో అశేష ప్రజాధరణను జీర్ణించుకోలేక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి లోకేశ్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని తెదేపా జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి ఆరోపించారు.

Published : 06 Jun 2023 02:41 IST

మాట్లాడుతున్న తెదేపా జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, పక్కన నాయకులు

ప్రొద్దుటూరు వైద్యం, న్యూస్‌టుడే: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రొద్దుటూరులో అశేష ప్రజాధరణను జీర్ణించుకోలేక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి లోకేశ్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని తెదేపా జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి ఆరోపించారు. స్థానిక కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పాదయాత్రకు అడ్డంకులు కలిగించేందుకే వైకాపా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని విమర్శించారు. గడిచిన నాలుగేళ్లలో ఎందుకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. గతంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగాయన్నారు. లోకేశ్‌ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు గురప్ప, సిద్దయ్య, ఏసుదాసు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని