‘ప్రభుత్వ భూములన్నీ పెత్తందార్లకేనా’
జిల్లాలోని ప్రభుత్వ భూములను పెత్తందార్లకు అప్పగించేందుకే రెవెన్యూ అధికారులున్నట్లున్నారని మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్కుమార్ ఆరోపించారు.
కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న మాల మహానాడు నేతలు
జిల్లా సచివాలయం, న్యూస్టుడే: జిల్లాలోని ప్రభుత్వ భూములను పెత్తందార్లకు అప్పగించేందుకే రెవెన్యూ అధికారులున్నట్లున్నారని మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్కుమార్ ఆరోపించారు. ప్రభుత్వ భూములను ధారాదత్తం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాలమహానాడు నాయకులు సోమవారం అంబేడ్కర్ కూడలి నుంచి మహావీర్ కూడలి మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. కడప, ఖాజీపేట, మైదుకూరు, మైలవరం, జమ్మలమడుగు, పెండ్లిమర్రి మండలాల్లో ప్రభుత్వ భూములను అగ్రకులాలు, రెవెన్యూ అధికారులతో కలిసి భూదోపిడీకి పాల్పడుతున్నారన్నారు. మైదుకూరులో దళితులకు ఇచ్చిన భూములను పోలీసులతో కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఆయా మండలాల్లో భూములపై విచారణ చేపట్టి సంబంధిత రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు రామాజీ ఇమ్మాన్యుయేలు, ఉపాధ్యక్షుడు వెంకటరమణ, గౌరవాధ్యక్షుడు మురళీప్రసాద్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదేశాలకు పాతర.. ఇసుకాసురుల జాతర!
[ 29-03-2024]
పర్యావరణ అనుమతుల్లేకుండా ఇసుక తవ్వకాలు జరపొద్దని హైకోర్టు స్పష్టం చేసినా అధికార పార్టీ నేతలు ఖాతరు చేయడం లేదు. నిబంధనలను అతిక్రమిస్తే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తీర్పు వెల్లడించినా పోలీసు అధికారులు సైతం వాటిని పట్టించుకోకుండా వైకాపా నేతలకు వత్తాసు పలుకుతున్నారు. -
కీలక నేతలతో చంద్రబాబు భేటీ!
[ 29-03-2024]
మదనపల్లెలో బుధవారం రాత్రి, గురువారం ఉదయం తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ కీలక నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు -
రాయచోటిపై తెదేపా ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
రాయచోటి నియోజకవర్గంపై తెదేపా ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలను పిలిపించుకుని గెలుపు వ్యూహాలపై చర్చించారు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథరెడ్డితో చంద్రబాబు పలుమార్లు మాట్లాడారు -
రెండో రోజూ ప్రయాణికులకు తిప్పలే
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభలకు జిల్లా నుంచి బస్సులు కేటాయించడంతో వరుసగా రెండోరోజూ గురువారం ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. -
ఒంటిమిట్టలో ఆదర్శ పోలింగ్ కేంద్రం
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒంటిమిట్ట ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఆదర్శ పోలింగ్ (పీఎస్-47) కేంద్రం ఏర్పాటు చేశారు. ఉద్యోగుల విధుల నిర్వహణ, ఓటర్లతో మాట్లాడాల్సిన తీరు, ఈవీఎంల పనితీరుపై వీఆర్వోలు, వీఆర్ఏలు, బీఎల్వోలు, సిబ్బందికి అవగాహన కల్పించారు -
దాహమో.... రఘురామ!
[ 29-03-2024]
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది సీఎం జగన్ సొంత ఇలాకాలోని మైదుకూరు పురపాలక సంఘం ప్రజల పరిస్థితి -
మైనార్టీ విద్యకు గ్రహణం!
[ 29-03-2024]
కేంద్ర ప్రాయోజిత నిధులతో నిర్మించతలపెట్టిన ముస్లిం, దూదేకులు, దళిత క్రిస్టియన్ల పిల్లలకు 6 నుంచి 10వ తరగతి వరకు గురుకుల పాఠశాలలు, వసతిగృహ సముదాయాలు ప్రతిపాదనలకే పరిమిత మయ్యాయి -
‘దోషులను వెంట పెట్టుకుంది జగనే’
[ 29-03-2024]
శామాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిని వెంటపెట్టుని తిరుగుతున్నది సీఎం జగనే అని మాజీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు సనసభ తెదేపా అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి ఆరోపించారు -
వివేకా హత్య కేసులో నిందితుడు అవినాష్ ఎంపీ టికెట్టా?
[ 29-03-2024]
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడు వై.ఎస్.అవినాష్రెడ్డిని పక్కన పెట్టుకుని, తన చిన్నాన్నను ఎవరో చంపేశారని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని భాజపా జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్రెడ్డి అన్నారు. -
తాగునీటి గండం..విద్యార్థులకు శాపం
[ 29-03-2024]
దేశ సరిహద్దులో భద్రత ఏర్పాట్లు చూసే సైనికులు... పశువైద్య విజ్ఞానాన్ని అవపోశన పడుతున్న విద్యార్థులను తాగునీటి సమస్య విపరీతంగా వేధిస్తోంది.