బిల్లులకు మోక్షం.. అడ్డంకి సాంకేతిక లోపం
మూడేళ్ల కిందట వర్షాభావం వెంటాడింది. భూగర్భ జలాలు పాతాళానికి వెళ్లాయి. నీటి మట్టాలు తరిగిపోయాయి. తాగునీటి గొట్టపు బావులు తడారిపోవడంతో పల్లెల్లో దాహం కేకలు మిన్నంటాయి.
జిల్లాకు రూ.2.64 కోట్లు మంజూరు
దస్త్రాలు వెలికి తీస్తున్న అధికారులు
ట్యాంకరు నుంచి నీటిని పట్టుకుంటున్న ప్రజలు (పాత చిత్రం)
కడప, న్యూస్టుడే: మూడేళ్ల కిందట వర్షాభావం వెంటాడింది. భూగర్భ జలాలు పాతాళానికి వెళ్లాయి. నీటి మట్టాలు తరిగిపోయాయి. తాగునీటి గొట్టపు బావులు తడారిపోవడంతో పల్లెల్లో దాహం కేకలు మిన్నంటాయి. గ్రామీణుల గొంతు తడారిపోకుండా తాత్కాలికంగా ఆయా గ్రామాల్లోని నాయకులతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మాట్లాడి ట్యాంకర్లను ఏర్పాటు చేయించి నీరందించారు. కాసుల కష్టంతో గుత్తేదారులకు రవాణా బిల్లులు చెల్లించలేదు. నెలలకొద్దీ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసినా నిన్నటిదాకా నిర్వేదం మిగిలింది. ఎట్టకేలకు ప్రభుత్వం నిధులివ్వడానికి ముందుకొచ్చింది. బిల్లులను సీఎఫ్ఎంఎస్లో నమోదు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులందాయి. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఇంజినీరింగ్ అధికారులు గ్రామాల వారీగా బిల్లులను అప్లోడ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. చాలాకాలం విరామం తర్వాత పాలకులు పచ్చజెండా ఊపడంతో నీరు తోలిన నాయకులు ఊరట చెందుతున్నారు. అయితే సీఎఫ్ఎంఎస్లో సాంకేతిక సమస్యల వల్ల ఈ బిల్లులు అందుకోవడానికి ఇంకెన్ని రోజులు పడుతుందా? అని గుత్తేదారులు ఎదురుచూస్తున్నారు.
ఇరు జిల్లాల్లో సమస్య
* మూడేళ్ల కిందట పల్లెల్లో నీటిఎద్దడికి తాత్కాలికంగా పరిష్కారం చూపాలని ట్యాంకర్లతో రవాణా చేయించాలని గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ అధికారులు నిర్ణయించారు. రాజంపేట, మదనపల్లె డివిజన్ల పరిధిలో 4,517 పనులకు అనుమతిచ్చారు. వీటి అంచనా విలువ రూ.19.01 కోట్లు. పల్లెల్లో ట్రాక్టర్ల ట్యాంకర్లను ఏర్పాటు చేయించి నీటిని సరఫరా చేశారు.
* నీటిని రవాణా చేయడానికి 2020 జూన్ 30వ తేదీ మునుపు ఒప్పందం జరిగిన వాటికి ఒక ట్రిప్పునకు రూ.515, జియో ట్యాగింగ్ యాప్లో నమోదు చేయడానికి రూ.4.90 వంతున ఇస్తామని నాడు ప్రకటించారు. అదే విధంగా 2020 జులై 1 తర్వాత ట్యాంకరు ట్రిప్పునకు రూ.515, జియో ట్యాకింగ్ చేస్తే రూ.4.75 మేర ఇచ్చేలా అనుమతిచ్చారు. చాలామంది ప్రభుత్వ కరుణ కోసం నెలలకొద్దీ నిరీక్షణ చేస్తున్నారు. డబ్బులు చెల్లించకపోవడంతో ఇంజినీర్లు, గుత్తేదారుల మధ్య తరచూ సంఘర్షణ జరుగుతోంది..
* అన్నమయ్య జిల్లాలో రూ.17.51 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఈ సొమ్ములు చెల్లించడానికి అంగీకరించారు. గ్రామాల వారీగా సీఎఫ్ఎంఎస్ దశ-2లో బిల్లులను నమోదు చేయాలని ఉత్తర్వులు రావడంతో ఏఈలు దృష్టి సారించారు. వైయస్ఆర్ జిల్లాలో 192 పనులు చేయాలని రూ.2.64 కోట్లకు అనుమతిచ్చారు. ఇప్పటికీ రూ.2.43 కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉంది. మదనపల్లె డివిజన్లో రూ.10.90 కోట్లు అత్యధికంగా, పులివెందుల డివిజన్లో అతి తక్కువగా రూ.20.24 లక్షలు మాత్రమే రావాల్సి ఉంది. పెండింగ్లో ఉన్న తాగునీటి రవాణా బిల్లులు చెల్లించాలని గత నెల 31న ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టరు కేవీవీ సత్యనారాయణ ఉత్తర్వు-2412 జారీ చేశారు.
అధికారులు ఏమంటున్నారంటే...
ఈ విషయంపై కడప డివిజన్ బాధ్య ఈఈ రామగోపాల్రెడ్డితో ‘న్యూస్టుడే’ చరవాణిలో మాట్లాడగా గతంలో తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా రవాణా చేసి నీరందించిన గుత్తేదారులకు బిల్లులు చెల్లించాలని ఉన్నత స్థాయి నుంచి ఆర్థిక అనుమతి వచ్చింది. సీఎఫ్ఎంఎస్లో బిల్లులు నమోదు చేస్తున్నామని చెప్పారు. వారం, పది రోజుల్లోపు రవాణాదారుల ఖాతాల్లో జమ అవుతుందని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసురుడికి పగ్గాలు.. కన్నీళ్లలో చేనేత మగ్గాలు!
[ 24-04-2024]
‘నేను ఉన్నాను... నేను విన్నాను’ అంటూ సీఎం జగన్ చేనేత కార్మికులను నమ్మించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నట్టేట ముంచారు. గత ప్రభుత్వాల హయాంలో అమలు చేసిన పథకాలకు మంగళం పాడేశారు. -
ఉన్నవి రద్దు చేసి... పక్క జిల్లాలకు సర్దేసి..!
[ 24-04-2024]
‘జాబ్ క్యాలెండరు విడుదల చేసి ఏటా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తాం, డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తాం’ అంటూ హామీలిచ్చి గద్దెనెక్కిన సీఎం జగన్ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. -
రేపు రాజంపేట, రైల్వేకోడూరుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాక
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరుకు రానున్నారు. -
రథంపై దాశరథి... మురిసిన భక్తజన హృది!
[ 24-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం రథోత్సవం కనులపండువగా జరిగింది. -
పెద్దిరెడ్డి కాళ్ల కింద పీలేరు ఆత్మగౌరవం!
[ 24-04-2024]
పీలేరు ఆత్మగౌరవాన్ని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్ల కింద పెట్టారని, ఆయన చేతిలో కీలుబొమ్మగా మారారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, తెదేపా పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిశోర్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. -
గోప్యంగా సునీత ప్రచారం!
[ 24-04-2024]
మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఎన్నికల ప్రచారాన్ని గోప్యంగా నిర్వహిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నేతలను కలుస్తూ మద్దతు కూడగడుతున్న ఆమె.. -
వంతెనకేదీ మోక్షం... జగన్ పాలనే సాక్ష్యం!
[ 24-04-2024]
కడప - తాడిపత్రి జాతీయ రహదారిలో పాపఘ్ని నదిపై వంతెన నిర్మాణం పూర్తికాకపోవడంతో రాకపోకలకు ఇక్కట్లు తప్పడం లేదు. 2021, నవంబరు 20న వరద ప్రవాహనికి ఇక్కడ పాత వంతెన కూలి పోయింది. -
కడపలో చెడ్డీగ్యాంగ్ కలకలం
[ 24-04-2024]
జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ సంచారంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయిదు రోజుల కిందట కడప నగరంలోని ఓ శివారు ప్రాంతంలోని బహుళ అంతస్తు భవనంలోకి ఈ గ్యాంగ్ ప్రవేశించినట్లు సీసీ పుటేజీల ద్వారా తెలిసింది. -
అభ్యర్థుల ఆస్తిపాస్తులివే
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల పర్వం నడుస్తోంది. మంగళవారం పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అఫిడవిట్లు దాఖలు చేస్తూ అందులో ఆస్తులు, కేసుల వివరాలు పేర్కొన్నారు. -
వైకాపా నేత... మార్కెట్ మేత
[ 24-04-2024]
అవినీతి లేని పాలన అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా పసిడిపురి ప్రొద్దుటూరులో తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఏర్పాటు వ్యవహారమంతా ప్రజాప్రతినిధి వర్గీయులకు ఆదాయ వనరుగా మారిందనేది బహిరంగ రహస్యం. -
అయిదేళ్లు జగన్కు అధికారం... ఆవిరైంది జనానికి ఆహ్లాదం..!
[ 24-04-2024]
వైకాపా పాలనలో ఉద్యానవనాలు అంతులేని నిర్లక్ష్యానికి గురయ్యాయి. నిర్వహణను గాలికొదిలేయడంతో పార్కుల పరిస్థితి దయనీయంగా మారింది. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు వచ్చే జనం కూర్చోడానికి కనీసం బల్లల్లేని దుస్థితి నెలకొంది. -
సమస్యలు అనేకం... ప్రభుత్వానిదే పాపం
[ 24-04-2024]
-
పడకేసిన ప్రగతి... జగన్ పాలనలో అథోగతి
[ 24-04-2024]
పురపాలక ఆరో వార్డులోని కొత్తకొట్టాలు, వాసవీనగర్లో సమస్యలు వేధిస్తున్నాయి. ప్రధానంగా కొత్తకొట్టాలు, చిన్నమసీదు వీధుల మధ్య ప్రవహించే ఎర్రచెరువు అలుగువంక స్థానికులకు మురుగుకాలువగా ఉపయోగపడుతోంది. -
ఏఎస్పీ కేశప్పపై ఎంసీసీ అధికారుల విచారణ
[ 24-04-2024]
ఏఎస్పీ కేశప్పపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు అధికారులు, ఎంపీడీవో భానుప్రసాద్ మంగళవారం విచారణ చేపట్టారు. మదనపల్లె మండలం బొమ్మనచెరువులో ఆదివారం -
ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
[ 24-04-2024]
సీఎం జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డిపై వీరపునాయునిపల్లెకు చెందిన నాగప్రసాద్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్