అకుంఠిత దీక్షలు.. ఆగ్రహ జ్వాలలు
తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అరెస్టుకు నిరసనగా అన్నమయ్య, వైయస్ఆర్ జిల్లాల్లో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి.
చంద్రబాబునాయుడి అరెస్టుపై సర్వత్రా నిరసనలు
ఉద్ధృతమవుతున్న తెలుగు తమ్ముళ్ల ఆందోళనలు
రైల్వేకోడూరులో తెదేపా నేత కస్తూరి విశ్వనాథనాయుడు ఆధ్వర్యంలో రిలే
నిరాహార దీక్షలు చేస్తున్న నాయకులు, కార్యకర్తలు
ఈనాడు, కడప, న్యూస్టుడే, బృందం: తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అరెస్టుకు నిరసనగా అన్నమయ్య, వైయస్ఆర్ జిల్లాల్లో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. 11వ రోజు బుధవారం నిర్వహించిన రిలే నిరాహార దీక్షల్లో భారీగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బాబు కోసం మేము సైతం అంటూ నినదించారు. సీఎం జగన్ చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కొనలేక అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని మండిపడ్డారు. తమ అధినేతను వెంటనే విడుదల చేయాలని డిమాండు చేశారు. పలు చోట్ల మైనార్టీ నేతలు దీక్షల్లో పాల్గొనడంతో పాటు మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించారు. కడప నగరంలోని ప్రకాష్నగర్లో నియోజకవర్గ ఇన్ఛార్జి మాధవి ఆధ్వర్యంలో బీసీ వర్గాల నేతలతో రిలే దీక్షలు, నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. బద్వేలులో పార్టీ శ్రేణులు పాల్గొన్న రిలే నిరాహార దీక్షకు యువ నాయకుడు రితేష్రెడ్డి హాజరై వైకాపా ప్రభుత్వ అన్యాయాలను ఎండగట్టారు. పులివెందులలో జరిగిన రిలే నిరాహార దీక్షలో తెదేపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, రాష్ట్ర నాయకులు సురేష్నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాలు కొనసాగాయి. సురేష్నాయుడు నిర్వహిస్తున్న దీక్షలో వరదరాజులరెడ్డి పాల్గొని మద్దతు తెలిపారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆలయాల్లో పూజలు, మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించారు. జమ్మలమడుగులో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి భూపేష్రెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగగా, పెద్దసంఖ్యలో రైతులు పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. మైదుకూరులో జరిగిన దీక్షకు పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కమలాపురంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో వందలాది మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు. రైల్వేకోడూరులో నియోజకవర్గ బాధ్యుడు కస్తూరి విశ్వనాథ నాయుడు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరిగాయి. మదనపల్లెలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షలో జనసేన పార్టీ నాయకులు పాల్గొనగా, ఇరు పార్టీల నాయకులు పోస్టుకార్డుల ఉద్యమం నిర్వహిచారు. పలు కార్యక్రమాల్లో జనసేన పార్టీ రాయలసీమ బాధ్యుడు రాందాస్చౌదరి పాల్గొన్నారు. రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే రమేష్కుమార్రెడ్డి, రాజంపేటలో మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రిలే నిరాహార దీక్షలు జరిగాయి.
బద్వేలులో రిలే నిరాహార దీక్షలో మాట్లాడుతున్న తెదేపా యువ నాయకుడు రితేష్రెడ్డి, పార్టీ శ్రేణులు
జమ్మలమడుగులో నిరసన తెలుపుతున్న తెదేపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శివనాథరెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి భూపేష్రెడ్డి, నాయకులు
రిలే నిరాహార దీక్ష చేస్తున్న తెదేపా పులివెందుల పురపాలక సంఘం నాయకులు, కార్యకర్తలు
మదనపల్లె అన్నమయ్య కూడలిలో రిలే నిరాహార దీక్షల్లో పోస్టుకార్డులతో ప్రదర్శన నిర్వహిస్తున్న తెదేపా రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు సురేంద్రయాదవ్, నాయకులు త్యాగరాజు, వెంకటరమణ, యశశ్విరాజ్, చరణ్తేజ్ తదితరులు
రాజంపేటలోని రిలే నిరాహార దీక్షల్లో తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు, పార్టీ శ్రేణులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Kadapa: నెలలో 101 సార్లు ఫోన్.. వాహన షోరూంపై బాధితుడు ఫిర్యాదు
[ 01-12-2023]
క్రెడిట్ కార్డులు, సర్వీసింగ్, రీఛార్జి పేరిట తరచూ ఫోన్కాల్స్ వస్తుంటాయి.. ఆ నెంబర్లను బ్లాక్ చేసినా మార్చి చేస్తుంటారు.. -
డూప్లికేటుగాళ్లు!
[ 01-12-2023]
వైయస్ఆర్ జిల్లా బద్వేలు మండలం గుంతపల్లి గ్రామంలోని సర్వే నంబరు 961లో 1.19 ఎకరాల గ్రామకంఠం భూమి ఉంది. దీనికి సమీపంలోనే జాతీయ రహదారి వెళుతుండడంతో భూముల ధరలు ఆమాంతం పెరిగిపోయాయి. -
జగన్ వచ్చారు... అవస్థలు తెచ్చారు
[ 01-12-2023]
సీఎం పర్యటనతో ఎక్కడికక్కడ ఆంక్షలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్కడ పర్యటనకు వెళ్లినా ప్రజలకు అగచాట్లు తప్పడం లేదు. -
ఎలా తిరగాలి అనుకున్నారు?
[ 01-12-2023]
జిల్లాలో గురువారం నిర్వహించిన మూడుచక్రాల సైకిళ్ల పంపిణీ కార్యక్రమం దివ్యాంగులకు అవస్థలు తెచ్చిపెట్టింది. సైకిల్ టైర్లకు గాలిలేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. -
కళ్లు తెరవరా... కన్నీళ్లు తుడవరా?
[ 01-12-2023]
ప్రభుత్వంజిల్లాలోని కర్షకులను కరవు రక్కసి కాటేస్తోంది. ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా క్షామం మాట వినిపిస్తోంది. వర్షాభావంతో పంటలు బెట్టకు గురవుతున్నాయి. -
భూ ఆక్రమణల నివారణకు సాంకేతిక రక్షణ
[ 01-12-2023]
భూములకు విలువ పెరిగినప్పటి నుంచి ప్రతి గ్రామం, పట్టణంలో భూ ఆక్రమణలు, గొడవలు పెరిగిపోయాయి. ఒకరి భూమి మరొకరు ఆక్రమించుకోవడం వల్ల తరచూ గొడవలు జరుగుతున్నాయి. -
క్రైస్తవుల సంక్షేమానికి చర్యలేవి?
[ 01-12-2023]
క్రైస్తవులకు అందించే సంక్షేమ పథకాలు తొలగించి సీఎం జగన్ మోసగిస్తున్నారని తెదేపా క్రైస్తవ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామిదాస్ ఆరోపించారు. -
తప్పులతడక!
[ 01-12-2023]
జిల్లాలోని ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా తయారైంది. భారీ సంఖ్యలోనే మృతులు, డబుల్ ఎంట్రీలు, వలసవెళ్లిపోయిన ఓటర్ల పేర్లు నమోదై ఉన్నాయి. -
కడప-బెంగళూరు రైల్వేలైన్ పూర్తిచేయండి
[ 01-12-2023]
కడప-బెంగళూరు రైల్వేలైన్ నిర్మాణ పనులను పునఃప్రారంభించి పూర్తిచేయాలని కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్.తులసిరెడ్డి డిమాండు చేశారు. -
సొంత జిల్లా వచ్చేందుకూ భయమేనా?
[ 01-12-2023]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సొంత జిల్లాకు వచ్చేందుకు కూడా భయపడుతున్నారంటే ఆయనకు జిల్లా ప్రజలంటే ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతోందని.. -
ప్రగతి భవనం... అసాంఘిక కార్యకలాపాలకు నిలయం
[ 01-12-2023]
ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయీ ప్రభుత్వ వాహనాలు. నగరంలోని ప్రగతి భవనంలోని ఏడు ప్రభుత్వ వాహనాలు తుప్పుపట్టిపోయాయి. -
చీనీ తోట... పశువులకు మేత
[ 01-12-2023]
తెగుళ్ల కారణంగా చీనీ చెట్లు ఎండిపోతుండటంతో అన్నదాతలు తోటలను పశువులకు వదిలేస్తున్నారు. -
భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలని ర్యాలీ
[ 01-12-2023]
ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భూహక్కు చట్టం-23తో ప్రజల ఆస్తులకు ఎటువంటి భద్రత ఉండదని వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ప్రజా సంఘాల నాయకులు గురువారం రాయచోటిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. -
రానున్న ఎన్నికల్లో మాదే విజయం
[ 01-12-2023]
రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో తెదేపా, జనసేన పార్టీల సంయుక్త ప్రభుత్వం రావడం తథ్యమని ఇరు పార్టీల నేతలు స్పష్టం చేశారు. -
అధికార వైకాపాలో వర్గపోరు!
[ 01-12-2023]
అధికార వైకాపాలో వర్గపోరు బయటపడింది. మదనపల్లె పురాధ్యక్షురాలు మనూజ లక్ష్యంగా వైస్ఛైర్మర్ వర్గం అడుగడుగునా ఆమెను నిలువరించడానికి యత్నించడం, ఇరు వర్గాల వాగ్వాదాలతో ఆద్యంతం రసాబాసగా సాగింది. -
దళితులకు సహచట్టం కావాలా?
[ 01-12-2023]
సమాచారం హక్కు చట్టం కింద వివరాలు కోరడానికి రాజంపేట ఎంపీడీవో కార్యాలయానికి వెళ్తే వైకాపా నాయకుడు, ఆకేపాడు సర్పంచి ఆకేపాటి మురళీరెడ్డి తమను ఇష్టమొచ్చినట్లు దూషించారని కడపకు చెందిన ఫిజియోథెరపీ వైద్యుడు పెంచలయ్య ఆరోపించారు. -
మదనపల్లె డివిజన్లో కుండపోత వర్షం
[ 01-12-2023]
మదనపల్లె డివిజన్లో గురువారం కుండపోత వర్షం కురిసింది. కలికిరిలో అత్యధికంగా 43 మి.మీ.ల వర్షం కురవగా.. -
కుమారుడే హంతకుడు
[ 01-12-2023]
కన్నతండ్రిని హత్య చేసిన కుమారుడిని, అతడికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.